logo

ప్రకాశం బ్యారేజీకి 3,209 క్యూసెక్కుల నీరు

పులిచింతల ప్రాజెక్టు నుంచి ఆదివారం సాయంత్రం దిగువకు ప్రకాశం బ్యారేజికి 3209 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నట్లు ఏఈఈ రాజు తెలిపారు.

Published : 22 Apr 2024 04:24 IST

అచ్చంపేట, న్యూస్‌టుడే: పులిచింతల ప్రాజెక్టు నుంచి ఆదివారం సాయంత్రం దిగువకు ప్రకాశం బ్యారేజికి 3209 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నట్లు ఏఈఈ రాజు తెలిపారు. ప్రాజెక్టు రివర్‌ స్లూయిజ్‌ మరమ్మతుల కారణంగా నీరు నిల్వ లేకుండా దిగువకు విడుదల చేస్తున్నారన్నారు. రివర్‌స్లూయిజ్‌ గేట్ల నుంచి 3,109 క్యూసెక్కులు, లీకేజీ ద్వారా మరో 100 క్యూసెక్కులు విడుదలవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టులో 2.94 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని