ఉపాధ్యాయులపై ఎందుకింత ఒత్తిడి?
ఉపాధ్యాయులపై మరింతగా ఒత్తిడి తెస్తున్నారు. పిల్లలతో కలిసి ఎంతో హుందాగా ఉద్యోగం చేసే రోజుల్ని అయ్యవార్లు రెండేళ్ల క్రితమే కోల్పోయారు.
విద్యాసంవత్సరం ఆఖరి రోజుల్లోనూ అల్టిమేటం
మార్కుల వివరాలు నమోదు చేస్తున్నా ఆన్లైన్లో కన్పించని వైనం
మంగళగిరి, తాడేపల్లి, న్యూస్టుడే: ఉపాధ్యాయులపై మరింతగా ఒత్తిడి తెస్తున్నారు. పిల్లలతో కలిసి ఎంతో హుందాగా ఉద్యోగం చేసే రోజుల్ని అయ్యవార్లు రెండేళ్ల క్రితమే కోల్పోయారు. విద్యా సంవత్సరం ముగియడానికి మరో రెండు రోజులు గడువున్నా సరే విద్యార్థుల మార్కులు ఆదివారం సాయంత్రానికల్లా అప్లోడ్ చేస్తారా? లేదా? అంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఆదివారం సెలవు రోజున విద్యార్థుల వివరాలు ఇంటి వద్ద ఎలా ఉంటాయనే ఆలోచన కూడా లేకుండా పూర్తిచేయకుంటే డీఈవో ముందు హాజరుకావాలని ఒక మెసేజ్, కమిషనర్ ఎదుట హాజరుకావాలంటూ వాట్సాప్ ద్వారా మరో సందేశం అందుతుండడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 18వ తేదీ వరకూ హైస్కూళ్లలో పరీక్షలు జరిగాయి. ఆ జవాబు పత్రాల్ని ఉపాధ్యాయులు సక్రమంగా దిద్దడానికి కనీసం మూడు, నాలుగు రోజులు పడుతుంది. ఆ సంగతి ఉన్నతాధికారులందరికీ తెలుసు. కానీ ఆదివారం సాయంత్రం కల్లా వివరాలన్నింటినీ నమోదు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాక ప్రతి విద్యార్థికి సంబంధించి సబ్జెక్టు మార్కులతో పాటు సంపూర్ణమైన ప్రగతి(హోలిస్టిక్ ప్రోగ్రెస్) పేరుతో నాలుగు అంశాల్లో విద్యార్థులకు మార్కులు వేయాలి. మొతం 21 అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కులు నమోదు చేయాలి. ఇందుకు గంటల సమయం పడుతోంది. అన్నీ చేసి ఆన్లైన్ ప్రగతి నివేదిక (రిపోర్టు కార్డు)లో నమోదు చేస్తే వివరాలు కన్పించడం లేదు. దీంతో మళ్లీ మొదటికి రావాల్సి వస్తోందని, ఈ తరహా ఒత్తిడి ఎప్పుడూ లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఆటల్లో మనమెక్కడ?
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.