జడ్పీకి నిధుల పోటు
స్థానిక సంస్థలు స్వపరిపాలన చేసినపుడే గ్రామ స్వరాజ్యం సాధించినట్లవుతుందని మహాత్మగాంధీ పేర్కొన్నారు.
స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన వైకాపా ప్రభుత్వం
న్యూస్టుడే, జిల్లాపరిషత్తు(గుంటూరు): స్థానిక సంస్థలు స్వపరిపాలన చేసినపుడే గ్రామ స్వరాజ్యం సాధించినట్లవుతుందని మహాత్మగాంధీ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్తులు, జిల్లాపరిషత్తులు స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సి ఉండగా వైకాపా ప్రభుత్వం అధికారాలతో పాటు నిధులను కూడా తన వద్దే ఉంచుకోవడంతో పంచాయతీరాజ్ స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయి. జిల్లా స్థాయిలో పెద్దన్న పాత్రను పోషించే జిల్లాపరిషత్తు నిధుల ‘పోటు’తో నామమాత్రంగా మిగిలిపోతుందనే విమర్శలు ఉన్నాయి.
నిధుల విడుదలలో జాప్యం
పంచాయతీరాజ్ స్థానిక సంస్థలకు ఇసుక, గనులు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే సెస్సు ప్రధాన ఆదాయ వనరులు. వైకాపా ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి గనుల శాఖ ద్వారా ఇసుక విక్రయం చేపట్టింది. రాష్ట్ర స్థాయిలో టెండర్లు పిలిచి ఓ సంస్థకు అనుమతులు వచ్చేలా చేసింది. పేరుకు ఆ సంస్థ ఉన్నప్పటికీ బినామీల ద్వారా కృష్ణా నదీ తీర ప్రాంతంలోని రేవుల్లో ఇసుక విక్రయాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో స్థానిక సంస్థలకు సెస్సు రూపంలో ఇవ్వాలి. వచ్చిన మొత్తంలో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా తీసుకుని జిల్లాపరిషత్తు, 57 మండల పరిషత్తులు, 1,011 పంచాయతీలకు దామాషా విధానంలో నిధులు కేటాయిస్తారు.
జిల్లాపరిషత్తు కార్యాలయ భవనం మరమ్మతులకు గురవడంతో కొత్తది నిర్మించేందుకు రూ.13 కోట్లు మంజూరు చేసేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారని జడ్పీ ఛైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా రెండేళ్ల కిందట ప్రకటించారు. ఇప్పటికీ నిధులు విడుదలవకపోవడంతో శిథిల భవనంలోనే ఉద్యోగులు భయపడుతూ విధులు నిర్వహిస్తున్నారు. జడ్పీ ఉద్యోగుల నివాస సముదాయం కూడా నివాస యోగ్యంగా లేదని ఇంజినీర్లు నివేదిక సమర్పించారు. క్వార్టర్స్ కూల్చివేసి కొత్తవాటితో పాటు కల్యాణ మండపం నిర్మిస్తామని చేసిన ప్రకటన కార్యరూపం దాల్చలేదు. ఏ పని చేయాలన్నా నిధుల సమస్య ఎదురవటంతో జడ్పీ సర్వసభ్య సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాలు, తీసుకున్న నిర్ణయాలు కార్యరూపం దాల్చడం లేదు. దాంతో అధికార వైకాపాకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, వార్డు సభ్యులు అసంతృప్తితో ఉన్నారు. నిధులు విడుదల చేసి పనులు ప్రారంభిస్తే వాటిని చూపించి ఓట్లు అడిగే వాళ్లమని, అభివృద్ధి పనులు చేయకుండా వారి వద్దకు ఎలా వెళ్లగలమని నేతల వద్ద ప్రస్తావిస్తున్నారు.
కార్యరూపం దాల్చని తీర్మానాలు
- ఉమ్మడి గుంటూరు జిల్లాపరిషత్తులో 54 మంది జడ్పీటీసీ సభ్యుల్లో వైకాపా వారు 53 మంది ఉన్నారు. తెదేపా నుంచి శావల్యాపురం జడ్పీటీసీ సభ్యురాలు పారా హైమావతి సూచించిన పనులకు నిధులు కేటాయించలేదు.
- ఇసుక సీనరేజీ ద్వారా జిల్లాపరిషత్తుకు రూ.10 కోట్లు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి స్టాంప్డ్యూటీ రూ.15 కోట్లు, మినరల్ సీనరేజి రూ.3.60 కోట్లు రావాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసినా ఇసుక సీనరేజీ నిధులు విడుదల చేయలేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు పరిపాలన అనుమతులు ఇవ్వడం లేదు. కొత్తగా పనులు మంజూరు చేయక జడ్పీటీసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
- ఇసుక, మినరల్ సీనరేజీ, స్టాంప్ డ్యూటీ కలిపి మొత్తం రూ.13.88 కోట్ల నిధులను జడ్పీకి ప్రభుత్వం విడుదల చేయలేదు. దీనివల్ల అభివృద్ధి పనులకు జిల్లాపరిషత్తు నిధులు కేటాయించకపోవడంతో గ్రామాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు, కచ్చా డ్రెయిన్లు, రక్షిత నీటి పథకాల పనులు, అనుసంధాన రహదారులు, ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులు, ఇతర పనులు చేసేందుకు నిధుల సమస్య ఎదురవుతోంది.
ఇబ్బందులు పడుతున్నాం
జిల్లాపరిషత్తు బడ్జెట్ రూ.60 కోట్లకు అభివృద్ధి పనుల కోసం రూ.25 కోట్లయినా కేటాయించాలి. సగటున ఒక్కో జడ్పీటీసీ సభ్యుడికి రూ.15 లక్షలు చొప్పున కేటాయించాల్సి ఉండగా కొందరికే కేటాయించారు. అభివృద్ధి పనులు చేసేందుకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాం. మంజూరు చేసిన పనులకు బిల్లులు చెల్లించేందుకూ ఇబ్బందులే. సర్వసభ్య సమావేశంలో ప్రశ్నిస్తాను.
పిల్లి ఓబుల్రెడ్డి, రొంపిచర్ల జడ్పీటీసీ సభ్యుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?