అల్లర్ల వేళ .. బలగాలు చేరేదెలా..
గుంతల రహదారులతో ఇప్పటివరకు ప్రజలే కష్టాలు పడ్డారు. ఇప్పుడు ఎన్నికల నిర్వహణకూ ఇబ్బందులు తప్పట్లేదు.
గుంతలమయంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గ్రామాలకు వెళ్లే మార్గాలు
పావుగంట ప్రయాణానికి.. గంటకు పైనే..
ఈనాడు డిజిటల్, నరసరావుపేట
మాచర్ల మండలం ఏకోనాంపేట పోలింగ్ కేంద్రానికి వెళ్లే దారి
గుంతల రహదారులతో ఇప్పటివరకు ప్రజలే కష్టాలు పడ్డారు. ఇప్పుడు ఎన్నికల నిర్వహణకూ ఇబ్బందులు తప్పట్లేదు. పల్నాడులోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్న గ్రామాలకు చేరుకోవాలంటే.. రహదారులన్నీ గుంతలమయమే. పది నిమిషాలు ప్రయాణించాల్సిన మార్గంలో.. గంటకూ గమ్యం చేరలేని దుస్థితి. ఇలాంటి ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఏదైనా ఉద్రిక్తత తలెత్తితే సాయుధ బలగాలు చేరుకునేలోగానే పరిస్థితి చేయి దాటిపోతుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉన్న మాచర్ల, గురజాల, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. పల్నాడు జిల్లాలో మొత్తం 445 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. వీటిలో చాలా కేంద్రాలకు రోడ్డుమార్గం సరిగా లేదు. అందువల్ల ఎన్నికల సంఘం ముందుజాగ్రత్త చర్యగా అన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లోనూ అదనపు బలగాలను మోహరించాలి.
దుర్గి మండలం మించాలపాడుకు వెళ్లే మార్గం..
అడ్డూ అదుపూ లేని దాడులు
పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వైకాపా నేతల అరాచకాలకు అడ్డూ అదుపు లేదు. కొందరు పోలీసులు కూడా.. పార్టీ కార్యకర్తల కంటే మిన్నగా వ్యవహరిస్తున్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో విచ్చలవిడిగా దాడులకు పాల్పడ్డారు. కొన్నిచోట్ల నామినేషన్లు కూడా వేయనివ్వలేదు. ఎన్నికల సంఘం వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి.
బెల్లంకొండ నుంచి వెంకటాయపాలెం వెళ్లే రోడ్డు
మూడు నియోజకవర్గాల్లోనూ..
మాచర్ల, గురజాల, పెదకూరపాడు నియోజకవర్గాల్లో పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. మాచర్ల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే ఏకోనాంపేట వెళ్లాలంటే గోతుల కారణంగా గంటపైగానే పడుతోంది. కృష్ణానది పక్కనుండే ఈ గ్రామానికి మరో మార్గం లేదు. ఇదే మండలంలో ద్వారకాపురి పోలింగ్ కేంద్రానికి వెళ్లే దారి అధ్వానంగా తయారైంది.
- మించాలపాడులో ఇటీవలే వైకాపా నేతలు.. తెదేపా వర్గీయులపై దాడులకు పాల్పడ్డారు. దుర్గి నుంచి మించాలపాడుకు వెళ్లే మార్గమంతా గుంతలు.. అందులో మూడు కిలోమీటర్లు మట్టిరోడ్డే. పోలింగ్ రోజు అల్లర్లు జరిగితే.. హుటాహుటిన బలగాలు చేరుకోవాలన్నా కష్టమే. వెల్దుర్తి మండలంలో సేవానాయక్ తండా, వజ్రాలపాడు తండాలకు వెళ్లే రోడ్లు పూర్తిగా గుంతలే.
- గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలో తంగెడ, ముత్యాలంపాడు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లే రోడ్డు మరింత దారుణం. దాచేపల్లి నుంచి 12 కిలోమీటర్లు ఉండే ఈ మార్గమంతా గుంతల్లో రోడ్డును వెతుక్కోవాల్సిందే.
- రెంటచింతల మండలంలో పాల్వాయి జంక్షన్- జెట్టిపాలెం, జెట్టిపాలెం-మల్లవరం, పాల్వాయి జంక్షన్- తుమృకోట, పాల్వాయిగేట్-మంచికల్లు రోడ్లు పూర్తిగా పాడయ్యాయి. ఈ మండలంలో అల్లర్లకు ఆస్కారం ఉందని ప్రతిపక్షాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. తుమృకోట-జమ్మలమడక రహదారిలో ఒక లేయర్ వేసి వదిలేయడంతో.. దుమ్ము విపరీతంగా లేస్తోంది.
- పెదకూరపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండ నుంచి 18 కి.మీ. దూరంలో ఉండే వెంకటాయపాలెం గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతింది. కొన్నేళ్లుగా మరమ్మతులే లేవు. అరగంటలో వెళ్లాల్సి ఉంటే.. 2 గంటలు పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం