కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి పూర్వ వైభవం : బ్రాహ్మణి
ఏ రంగంలోనైనా విజయం సాధించగల సత్తా మహిళలకే ఉందని నారా బ్రాహ్మణి అన్నారు.
స్త్రీశక్తి లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతున్న నారా బ్రాహ్మణి
మంగళగిరి, న్యూస్టుడే: ఏ రంగంలోనైనా విజయం సాధించగల సత్తా మహిళలకే ఉందని నారా బ్రాహ్మణి అన్నారు. భర్త నారా లోకేశ్ తరఫున ఆమె గత రెండు రోజులుగా మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలోని సమావేశ మందిరంలో ‘స్త్రీశక్తి’ పథకం లబ్ధిదారులతోపాటు మహిళా మిత్ర, డ్వాక్రా బృంద సభ్యులతో ఆదివారం సాయంత్రం సమావేశమయ్యారు. చంద్రబాబుపై నమ్మకంతో అమరావతి రైతులు భూములిస్తే.. ఈ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రజల కష్టాలన్నింటినీ తీరుస్తారని భరోసా ఇచ్చారు. గత ఎన్నికల్లో లోకేశ్ విజయం సాధించకపోయినా ఇక్కడి వారిని కుటుంబ సభ్యులుగా భావించి సేవ చేస్తున్నారని బ్రాహ్మణి అన్నారు. పేదలకు తోపుడుబళ్లు, పెళ్లికానుకలు, ఆరోగ్య సంజీవని, వీవర్స్శాల తదితర కార్యక్రమాలు సొంత నిధులతో అమలు చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ‘స్త్రీశక్తి’ పథకాన్ని మరింత విస్తృతం చేస్తామని, ఇప్పటికే రెండు వేల మందికి ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చి మిషన్లు అందజేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
[ 26-07-2024]
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
ఏ ఎండకా గొడుగు!
[ 26-07-2024]
ప్రస్తుతం గుంటూరులో పని చేస్తున్న ఓ సీఐ వైకాపా హయాంలో ఒక ప్రజాప్రతినిధితో బాగా అంటకాగారు. ఈయనకు తన సామాజికవర్గం ఎక్కువగా ఉన్న నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంపై కన్ను పడింది. అక్కడికి పంపేందుకు కూటమి నాయకుడొకరు పట్టుబడుతున్నారు. -
ఎందెందు వెదికినా.. ఈ కలుపు మందే!
[ 26-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. ఇందుకోసం కొంతమంది వ్యక్తులు అనేక అక్రమ మార్గాల్లో వెళ్తున్నారు -
ముంచాలనుకున్నారు.. మునిగిపోయారు!
[ 26-07-2024]
అద్భుతాలు సృష్టించాలంటే... ఆలోచన ఉండాలి.. వివేకం చూపాలి... అంతం చేయాలనుకుంటే కళ్లు మూసుకుని, మెదడు పనిచేయకుండా ఉంటే చాలు...నాటి జగన్ సర్కారు చేసిందిదే. -
ఈఎస్ఐ, ఈపీఎఫ్ వాటా తిన్నదెవరు?
[ 26-07-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పొరుగు సేవల ఉద్యోగులకు సంబంధించిన ఈఎస్ఐ, ఈపీఎఫ్ వాటా సొమ్మును కాజేసిన వ్యవహారంపై ఇన్ఛార్జి వీసీ కె.గంగాధరరావు విచారణకు ఆదేశించారు. -
సేవలకు రాం రాం.. వసూళ్లకు పరిమితం
[ 26-07-2024]
రైతు సేవలకు నిర్దేశించిన వ్యవసాయ మార్కెట్ కమిటీలు రుసుం వసూలు కేంద్రాలుగా మారాయి. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించాల్సిన యార్డులు రైతులకు దూరమయ్యాయి. -
నకిలీ పత్రాలతో బ్యాంకు రుణాలకు దరఖాస్తు
[ 26-07-2024]
-
రూ.కోట్లు కొల్లగొట్టిన వైకాపా నేతలు
[ 26-07-2024]
నాణ్యమైన ఎర్రమట్టి.. ప్రభుత్వ భూములతోపాటు విస్తారంగా అటవీ భూములు.. ఎంత తవ్వినా అడిగేవారు ఉండరు.. అధికారపార్టీ నేతల అండతో తవ్వకాలు జరుగుతుండటంతో అధికారులు అటువైపు వెళ్లలేని పరిస్థితి.. డిమాండ్ లక్ష్యంగా ఎర్రమట్టి తవ్వి తరలించి సొమ్ము చేసుకున్నారు -
ఇంట్లోకి చొరబడి బాలికతో అసభ్య ప్రవర్తన
[ 26-07-2024]
కామంతో కళ్లు మూసుకు పోయిన ఓ కామాంధుడు అర్ధరాత్రి ఒక బాలికను చెరబట్టబోయాడు. ఆ బాలిక కేకలు వేయడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రావడంతో ప్రమాదం నుంచి బయటపడింది. -
ఊసరవెల్లి నయం
[ 26-07-2024]
వైకాపా పాలనలో కొంతమంది సీఐలు ఎదురే లేదన్నట్టుగా ప్రవర్తించారు. చట్టాన్ని చుట్టచుట్టి మూలన పడేసి వైకాపా సెక్షన్ల అమల్లో పోటీ పడ్డారు. ఖాకీల ముసుగులో నీలి మూకలుగా చెలరేగిపోయారు. -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
[ 26-07-2024]
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
ఇంకెన్నాళ్లీ ఎదురుచూపులు
[ 26-07-2024]
రైతు భరోసా కేంద్రాల్లో రబీ ధాన్యం విక్రయించిన రైతులకు 21 రోజుల్లో చెల్లింపులు చేయకుండా వైకాపా ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం