రాజధాని మహిళల కష్టాలు చూస్తే బాధేస్తోంది
రాష్ట్రం డ్రగ్స్ క్యాపిటల్గా మారింది.. ఈ ప్రాంతంలో పరిశ్రమల్లేవు..యువతకు ఉద్యోగాల్లేవు. ఇక్కడి మహిళల కష్టాలు చూస్తోంటే బాధేస్తోంది.
రాష్ట్రం డ్రగ్స్ క్యాపిటల్గా మారింది
ఇక్కడ పరిశ్రమలు.. యువతకు ఉద్యోగాల్లేవు
చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే భవిష్యత్తు
‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో నారా బ్రాహ్మణి
తాడేపల్లి, న్యూస్టుడే
పూలు కోసే మహిళా కార్మికులతో నారా బ్రాహ్మణి
రాష్ట్రం డ్రగ్స్ క్యాపిటల్గా మారింది.. ఈ ప్రాంతంలో పరిశ్రమల్లేవు..యువతకు ఉద్యోగాల్లేవు. ఇక్కడి మహిళల కష్టాలు చూస్తోంటే బాధేస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే భావితరాలకు భవిష్యత్తు’ అని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని బేతపూడి గ్రామంలో పర్యటించారు. ఇక్కడి పూల తోటలను పరిశీలించి పూలుకోసే మహిళా కూలీల సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె ‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో పలు అంశాలపై మాట్లాడారు.
రెండురోజులుగా లోకేశ్ తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎలాంటి సమస్యలు ప్రజలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు.?
బ్రాహ్మణి: మంగళగిరి ప్రజలు కుటుంబ సభ్యురాలిలా ఆదరిస్తున్నారు. వారి కష్టాలు చెప్పుకొంటున్నారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు ఇవ్వడం లేదని వాపోయారు. ఇక్కడ పరిశ్రమల్లేక చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు. మహిళలు కుటుంబ పోషణ నిమిత్తం ఎండలో..వానలో కష్టపడుతున్నారు. వారిని చూస్తే చాలా బాధేస్తోంది. లోకేశ్ ప్రారంభించిన ‘స్త్రీశక్తి’ పథకం చాలా మంది మహిళలను ఆదుకుంటోంది. టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందుతున్నారు. అధికారంలో లేకున్నా 29 సంక్షేమ కార్యక్రమాలు లోకేశ్ సొంత నిధులతో అమలు చేస్తున్నారు. ఆయన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారు.
మంగళగిరిలో చేనేత వృత్తిదారులు ఎక్కువమంది ఉన్నారు. వారికి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. చేనేత ఉత్పత్తులకు ఎలాంటి మార్కెటింగ్ అవకాశాలు కల్పించబోతున్నారు.
బ్రాహ్మణి: చేనేత అనేది చాలా గొప్ప కళ. మంగళగిరి చేనేత చీరలు, డ్రస్ మెటీరియల్స్కు మంచి పేరు ఉంది. వారిపై దృష్టి పెట్టకపోవడం వల్ల చాలా కష్టాల్లో ఉన్నారు. నారా లోకేశ్ ‘టాటా తనేరా’ సంస్థతో ఒప్పంద చేసుకుని నూతన డిజైన్లపై శిక్షణ ఇప్పించి ఇక్కడ నేసిన వస్త్రాలకు ప్రపంచస్థాయి మార్కెట్ కల్పించబోతున్నారు. మంగళగిరి రూపుమార్చాలన్నదే ఆయన లక్ష్యం.
రాష్ట్రంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగాయి. ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై దాడులు, కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ పరిస్థితిని ఎలా చూస్తారు.
బ్రాహ్మణి: రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండాపోయింది. నాసిరకం మద్యం ఏరులై పారుతోందని, దానికి అలవాటు పడి తమ భర్తలు, పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన రాష్ట్రం డ్రగ్స్కు క్యాపిటల్గా మారింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. చంద్రబాబు హయాంలో ఈ పరిస్థితి లేదు. మళ్లీ ఆయన సీఎం అయితే భావితరాల భవిష్యత్తుకు కృషి చేస్తారు.
చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. అదే విధంగా తెదేపా నాయకులపైనా కేసులు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలా ఆలోచించాలి.
బ్రాహ్మణి: ఇవన్నీ కక్షపూరిత రాజకీయాలే. చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. రానున్న ఎన్నికల్లో ఓటుతో ప్రజలు బుద్ధి చెబుతారు.
ఎన్నికల వరకు ప్రచారంలో ఏ విధంగా ముందుకు వెళతారు.?
బ్రాహ్మణి: మహిళల సంక్షేమం, అభివృద్ధే నా లక్ష్యం. ఇందులో భాగంగా అన్ని వర్గాల మహిళలతో మమేకమవుతూ వారి కష్టాలు తెలుసుకుంటున్నా. ఆ దిశగా ప్రచారం కొనసాగిస్తా. లోకేశ్ అమలు చేస్తోన్న ‘స్త్రీశకి’్త పథకం ద్వారా లబ్ధి పొంది స్వయం ఉపాధి పొందుతున్న మహిళలను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
[ 03-05-2024]
కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. -
పేదల ప్రాణాలతో రాజకీయం చేస్తారా?: సీఎస్కు చంద్రబాబు లేఖ
[ 03-05-2024]
పింఛన్ల పంపిణీలో ప్రజల ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. -
బ్యాంకుల వద్ద బారులుదీరిన పింఛనుదారులు
[ 03-05-2024]
వట్టి చెరుకూరు మండలంలోని గ్రామాల్లో బ్యాంకుల వద్ద లబ్ధిదారులు బారులుదీరారు. -
తెదేపా ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన
[ 03-05-2024]
మండలంలోని ఇంజనంపాడు, కోవెలమూడి, కాట్రపాడు, వట్టి చెరుకూరు, లేమల్లెపాడు, అనంతవరప్పాడు గ్రామాల్లో తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే... -
కక్షగట్టి రప్పించారు.. కసితీరా వేధించారు..
[ 03-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అవసరమైతే తప్ప ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని ఒకవైపు ప్రచారం చేయిస్తున్న పాలకులు ఆరు పదుల వయసు పైబడిన సామాజిక పింఛనుదారులను మాత్రం మండుటెండలో బజారుకీడ్చి వారిని ఇబ్బందుల పాల్జేశారు. -
మీతోనే ముప్పు.. మీవల్లే ముంపు!
[ 03-05-2024]
వారి బాగోగులను అనుక్షణం పట్టించుకోవాలి.అక్కడి ప్రకృతి, పర్యావరణంతోపాటు నదులు, వాగులు, వంకలు సహా పంట పొలాలను రక్షించు కోవాలి. -
నా వంతుగా.. మామకు మద్దతుగా..
[ 03-05-2024]
సినీ హీరో నిఖిల్ గురువారం చీరాలలో సందడి చేశారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఎం కొండయ్యకు మద్దతుగా ఆయన పట్టణంలో ప్రచారం చేపట్టారు. -
బీసీ నాయకులకు జగన్ కుర్చీ కూడా వేయనివ్వరు
[ 03-05-2024]
బీసీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దగ్గరకు వెళితే కనీసం కుర్చీ కూడా వేయరు, ఎవరికి వేయాలో ఆయన కనుసైగలతో సూచిస్తారని మనమంతా విన్నాం, బీసీల పట్ల ఆయన చూపే గౌరవం తీరు ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని తెలియచేస్తుందని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
పోలీసు.. నేత.. చెట్టపట్టాల్!
[ 03-05-2024]
అధికార వైకాపా నేతల కనుసన్నల్లోనే ఇప్పటికీ పోలీసు యంత్రాంగం జోగుతోంది. విధి నిర్వహణలో వారు చెప్పిందే పోలీసులకు వేదంగా ఉంటోంది. -
ఉద్యోగుల ఓట్లకు..గండికొట్టాలనేనా?
[ 03-05-2024]
ఉమ్మడి గుంటూరులో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇవ్వాల్సిన ఫారం-12కు ఎన్నికల అధికారులు మోకాలడ్డుతున్నారు. -
క్షీణించిన శ్రీలక్ష్మి ఆరోగ్యం
[ 03-05-2024]
వైకాపా నాయకుల దౌర్జన్యాలు, కబ్జాలతో నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి శ్రీలక్ష్మి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు గురువారం ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం
[ 03-05-2024]
తెదేపా అధికారంలోకి రావడం ఖాయం. వచ్చే ఐదేళ్లలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలను కల్పించి తీరతాం’.. అని గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి స్పష్టం చేశారు. -
అధికార పార్టీని చిత్తుగా ఓడించండి
[ 03-05-2024]
రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న ప్రభుత్వం మారాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ‘ఇండియా’ కూటమి అభ్యర్థులు జంగాల అజయ్కుమార్, జొన్నా శివశంకరరావు తరఫున మంగళగిరిలో గురువారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
లోకేశ్ మంగళగిరి రూపురేఖలు మారుస్తారు
[ 03-05-2024]
గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన మంగళగిరి వైకాపా అభ్యర్థి తల్లి కాండ్రు కమల, మామ మురుగుడు హనుమంతరావు నియోజకవర్గానికి ఏం చేశారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. -
ఆంధ్రాప్యారిస్ పేరుకు తగ్గట్లు అభివృద్ధి చేస్తాం
[ 03-05-2024]
ఆంధ్రాప్యారిస్ను పేరుకు తగిన విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని, తమకు మద్దతు ఇవ్వాలని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు -
మహిళలే నిర్ణేతలు
[ 03-05-2024]
ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జనవరి 22 తర్వాత జరిగిన చేర్పులు, మార్పులు అనంతరం 22,029 మంది ఓటర్లు పెరిగారు. -
ఉద్యోగుల ఓట్లకు.. గండికొట్టాలనేనా?
[ 03-05-2024]
ఉమ్మడి గుంటూరులో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇవ్వాల్సిన ఫారం-12కు ఎన్నికల అధికారులు మోకాలడ్డుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా