రాజధాని మహిళల కష్టాలు చూస్తే బాధేస్తోంది
రాష్ట్రం డ్రగ్స్ క్యాపిటల్గా మారింది.. ఈ ప్రాంతంలో పరిశ్రమల్లేవు..యువతకు ఉద్యోగాల్లేవు. ఇక్కడి మహిళల కష్టాలు చూస్తోంటే బాధేస్తోంది.
రాష్ట్రం డ్రగ్స్ క్యాపిటల్గా మారింది
ఇక్కడ పరిశ్రమలు.. యువతకు ఉద్యోగాల్లేవు
చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే భవిష్యత్తు
‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో నారా బ్రాహ్మణి
తాడేపల్లి, న్యూస్టుడే
పూలు కోసే మహిళా కార్మికులతో నారా బ్రాహ్మణి
రాష్ట్రం డ్రగ్స్ క్యాపిటల్గా మారింది.. ఈ ప్రాంతంలో పరిశ్రమల్లేవు..యువతకు ఉద్యోగాల్లేవు. ఇక్కడి మహిళల కష్టాలు చూస్తోంటే బాధేస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే భావితరాలకు భవిష్యత్తు’ అని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని బేతపూడి గ్రామంలో పర్యటించారు. ఇక్కడి పూల తోటలను పరిశీలించి పూలుకోసే మహిళా కూలీల సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె ‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో పలు అంశాలపై మాట్లాడారు.
రెండురోజులుగా లోకేశ్ తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎలాంటి సమస్యలు ప్రజలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు.?
బ్రాహ్మణి: మంగళగిరి ప్రజలు కుటుంబ సభ్యురాలిలా ఆదరిస్తున్నారు. వారి కష్టాలు చెప్పుకొంటున్నారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు ఇవ్వడం లేదని వాపోయారు. ఇక్కడ పరిశ్రమల్లేక చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు. మహిళలు కుటుంబ పోషణ నిమిత్తం ఎండలో..వానలో కష్టపడుతున్నారు. వారిని చూస్తే చాలా బాధేస్తోంది. లోకేశ్ ప్రారంభించిన ‘స్త్రీశక్తి’ పథకం చాలా మంది మహిళలను ఆదుకుంటోంది. టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందుతున్నారు. అధికారంలో లేకున్నా 29 సంక్షేమ కార్యక్రమాలు లోకేశ్ సొంత నిధులతో అమలు చేస్తున్నారు. ఆయన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారు.
మంగళగిరిలో చేనేత వృత్తిదారులు ఎక్కువమంది ఉన్నారు. వారికి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. చేనేత ఉత్పత్తులకు ఎలాంటి మార్కెటింగ్ అవకాశాలు కల్పించబోతున్నారు.
బ్రాహ్మణి: చేనేత అనేది చాలా గొప్ప కళ. మంగళగిరి చేనేత చీరలు, డ్రస్ మెటీరియల్స్కు మంచి పేరు ఉంది. వారిపై దృష్టి పెట్టకపోవడం వల్ల చాలా కష్టాల్లో ఉన్నారు. నారా లోకేశ్ ‘టాటా తనేరా’ సంస్థతో ఒప్పంద చేసుకుని నూతన డిజైన్లపై శిక్షణ ఇప్పించి ఇక్కడ నేసిన వస్త్రాలకు ప్రపంచస్థాయి మార్కెట్ కల్పించబోతున్నారు. మంగళగిరి రూపుమార్చాలన్నదే ఆయన లక్ష్యం.
రాష్ట్రంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగాయి. ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై దాడులు, కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ పరిస్థితిని ఎలా చూస్తారు.
బ్రాహ్మణి: రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండాపోయింది. నాసిరకం మద్యం ఏరులై పారుతోందని, దానికి అలవాటు పడి తమ భర్తలు, పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన రాష్ట్రం డ్రగ్స్కు క్యాపిటల్గా మారింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. చంద్రబాబు హయాంలో ఈ పరిస్థితి లేదు. మళ్లీ ఆయన సీఎం అయితే భావితరాల భవిష్యత్తుకు కృషి చేస్తారు.
చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. అదే విధంగా తెదేపా నాయకులపైనా కేసులు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలా ఆలోచించాలి.
బ్రాహ్మణి: ఇవన్నీ కక్షపూరిత రాజకీయాలే. చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. రానున్న ఎన్నికల్లో ఓటుతో ప్రజలు బుద్ధి చెబుతారు.
ఎన్నికల వరకు ప్రచారంలో ఏ విధంగా ముందుకు వెళతారు.?
బ్రాహ్మణి: మహిళల సంక్షేమం, అభివృద్ధే నా లక్ష్యం. ఇందులో భాగంగా అన్ని వర్గాల మహిళలతో మమేకమవుతూ వారి కష్టాలు తెలుసుకుంటున్నా. ఆ దిశగా ప్రచారం కొనసాగిస్తా. లోకేశ్ అమలు చేస్తోన్న ‘స్త్రీశకి’్త పథకం ద్వారా లబ్ధి పొంది స్వయం ఉపాధి పొందుతున్న మహిళలను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్