సికింద్రా‘బాధ’ చర్లపల్లితో ఉపశమనం
నిజాం కాలంలో నిర్మించిన సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్లపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది.
ఏడాది చివరి నాటికి సేవలు
వేగంగా జరుగుతున్న పనులు
నిర్మాణంలో ఉన్న రైల్వే టెర్మినల్
ఈనాడు, హైదరాబాద్: నిజాం కాలంలో నిర్మించిన సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్లపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. ఈ మూడు స్టేషన్ల నుంచి నిత్యం 443 రైళ్ల వరకూ రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 235 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక్కడ 10 ప్లాట్ఫాంలున్నాయి. ప్రయాణికులు 1.80 లక్షలు. నిత్యం రద్దీగా కనిపించే ఈ స్టేషన్లో రైలెక్కాలన్నా.. దిగాలన్నా ఇబ్బందే. పండగలు, వేసవి సెలవులు వచ్చాయంటే ప్లాట్ఫామ్స్ ఖాళీగా ఉండవు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ రైళ్లను బయటే ఆపాల్సిన పరిస్థితి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమైన చర్లపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.
చర్లపల్లిలో దిగి ఎంఎంటీఎస్లో నగరానికి
చర్లపల్లిలో శాటిలైట్ టర్మినల్ నిర్మించాలని ద.మ.రైల్వే భావించింది. రూ.300 కోట్లకుపైగా నిధుల అంచనాతో పనులు చేపట్టింది. సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మిస్తున్న తరుణంలో ఈ స్టేషన్ను ఈ ఏడాది ఆఖరుకల్లా పూర్తి చేస్తారు. ఔటర్ రింగురోడ్డుకు చేరువలో ఉన్న ఈ స్టేషన్కు ప్రయాణికులు సులభంగా చేరుకునేందుకు వీలు కలుగుతుంది. ఈ స్టేషన్ నుంచి ప్రైవేటు రైళ్లు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఉన్న ప్లాట్ఫాంలు ప్యాసింజర్ రైళ్లకనుగుణంగా నిర్మించారు. ప్రయాణికులు చర్లపల్లిలో దిగి ఔటర్ మీదుగా లేదా రెండోదశలో అందుబాటులోకి వచ్చే ఎంఎంటీఎస్ ద్వారా నగరానికి రావచ్చు. దీంతో ఎంఎంటీఎస్ల ద్వారా చర్లపల్లికి రాకపోకలు సులభమవుతుంది. మౌలాలి నుంచి చర్లపల్లి మీదుగా ఘట్కేసర్కు ప్రత్యేకంగా ఎంఎంటీఎస్లకు రెండు లైన్లున్నాయి. దీంతో ఆ మార్గంలో 4 లైన్లు అందుబాటులోకి వచ్చాయి. సికింద్రాబాద్ నుంచి మౌలాలికి రెండు లైన్లుండడమే సమస్య కాబోతుంది.
అందుబాటులోకి రానున్న సౌకర్యాలు..
* రెండు సబ్వేలు. వీటిద్వారా ఇరువైపులా వాహనాల్లో ప్లాట్ఫాంలకు చేరుకునే వెసులుబాటు
* విశాలమైన 2 ఐల్యాండ్ ప్లాట్ఫాంలు
* ప్రస్తుత ప్లాట్ఫాంల పొడవు పెంచడంతోపాటు మరిన్నింటి నిర్మాణం
* కొన్ని రైళ్ల నిర్వహణకు యార్డు
* అన్ని ప్లాట్ఫాంలకు నీరందేలా 4 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓవర్హెడ్ ట్యాంకు
* కొత్త స్టేషన్ భవనం
* స్టేషన్ ఆవరణతోపాటు స్టేషన్కు అనుసంధానం ఉండేలా సీసీ రహదారులు
* సబ్స్టేషన్ నిర్మాణంతో సరిపడా కరెంటు సరఫరాకు ఏర్పాట్లు
* రైళ్ల నిర్వహణకు అనువైన షెడ్డు
* రెండు పాదచారుల వంతెనలు
* 5 ఎస్కలేటర్లు, 9 లిఫ్టులు
* 4 పిట్లైన్లు, పార్సిల్ బుకింగ్ కార్యాలయం
* ప్లాట్ఫాంలపై బయో మరుగుదొడ్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.