logo

పారదర్శకంగా ‘ఫోన్‌ ట్యాపింగ్‌’ విచారణ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ పారదర్శకంగా కొనసాగుతుందని నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 12 Apr 2024 02:20 IST

నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి

చార్మినార్‌, న్యూస్‌టుడే: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ పారదర్శకంగా కొనసాగుతుందని నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కేసుకు  దర్యాప్తు వేగంగా సాగుతోందన్నారు. కేసుకు సంబంధించి ఇప్పటి వరకు రాజకీయ నేతలకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని స్పష్టం చేశారు. బహదూర్‌పుర మీరాలం ఈద్గా పోలీస్‌ టెంట్‌ వద్ద గురువారం ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు వ్యవహారానికి సంబంధించిన అంశంపై విలేకరులు ప్రశ్నించండంతో ఆయన స్పందించారు. త్వరలో కేసుకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. కేసులో నిందితుడైన మాజీ డీసీపీ.. కిడ్నాప్‌, దోపిడీకి సంబంధించిన తాజా కేసును కూడా ఎదుర్కొంటున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని