తాళాలు పగులగొట్టి.. మూడిళ్లలో చోరీ
మూడిళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన సంఘటన బుధవారం రాత్రి ఆదిభట్ల ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఆదిభట్ల సీఐ రాఘవేందర్రెడ్డి
తుర్కయంజాల్ పురపాలిక, న్యూస్టుడే: మూడిళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన సంఘటన బుధవారం రాత్రి ఆదిభట్ల ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ మన్నెగూడ ఎన్ఎస్ఆర్ కాలనీలో ఇరుగు పొరుగు అయిన సామల ప్రభాకర్రెడ్డి, శేఖర్.. తమ ఇళ్లకు తాళంపెట్టి కుటుంబసభ్యులతో కలిసి ఎవరికివారు వారి ఇళ్ల డాబాపై నిద్రించారు. అదేకాలనీలో వడ్డెర శ్రీరాములు 20రోజుల క్రితం వేరే ఊరికి వెళ్లాడు. ఈక్రమంలో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు.. మొదట శేఖర్ ఇంటి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ఆ ఇంట్లో ఏమీ లభించకపోవడంతో పక్కనే ఉన్న ప్రభాకర్రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు. సుమారు రూ.10 తులాల బంగారం, రూ.40 వేల నగదు ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి కొద్దిదూరంలో ఉన్న శ్రీరాములు ఇంట్లో సుమారు రూ.40తులాల వెండి ఆభరణాలు చోరీ చేశారు.
భార్యను భయపెట్టేందుకు.. పెట్రోల్ పోసుకొని
46 రోజులుగా చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
జీడిమెట్ల, న్యూస్టుడే: భార్య కాపురానికి రావడం లేదని భర్త భయపెట్టాలనుకున్నాడు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నటిస్తే భయపడి వెంటనే వస్తుందనుకున్నాడు. ఆవేశంలో నిప్పంటించుకుని 46 రోజులపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలొదిలాడు. జీడిమెట్ల ఎస్సై ముంత ఆంజనేయులు వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ వాసి మంగలి సురేశ్(29), స్వప్న దంపతులు ఉపాధికి వలస వచ్చి గాజులరామారంలో ఉండేవారు. ఓ అపార్టుమెంట్లో కాపలాదారుడిగా పనిచేస్తూ ఖాళీ సమయాల్లో కార్పెంటర్గా చేసేవాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వప్న చెల్లెలు మృతిచెందడంతో ఆమె గ్రామానికి వెళ్లారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో సురేశ్ కంకోల్కు వెళ్లాడు. నగరంలో వద్దని గ్రామానికే రావాలని భార్యకు సూచించాడు. కానీ ఆమె పట్టించుకోలేదు. ఫిబ్రవరి 26న గాజులరామారం రాగా భార్యతోపాటు అత్త, మామ ఉండటం చూసి గొడవపడ్డాడు. తనతో గ్రామానికి రాకుంటే చస్తానంటూ ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
మద్యం మత్తులో రోడ్డెక్కి.. బస్సును ఢీకొట్టి
జీడిమెట్ల: లారీ డ్రైవర్ పట్టపగలు మద్యం తాగాడు. వేగంగా నడిపి ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. గురువారం మధ్యాహ్నం జీడిమెట్ల ఆర్టీసీ డిపో బస్సు డిపో సమీపంలోని బస్టాప్లో ప్రయాణికుల కోసం ఆగింది. ఆ సమయంలో సూరారం ప్రధాన రహదారిలో సిమెంట్ లోడ్తో వేగంగా వస్తున్న లారీ బస్సును ఢీకొట్టింది. బస్సు వెనుక భాగం దెబ్బతింది. ఓ ప్రయాణికురాలి కాలు బెణికంది.
మృత శిశువును పీక్కుతిన్న వీధి కుక్కలు
ఉప్పల్, న్యూస్టుడే: మృత శిశువును వీధి కుక్కలు సగ భాగం పీక్కుతిన్న ఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలోని రామంతాపూర్లో జరిగింది. ఎస్సై రమేష్ కథనం ప్రకారం.. రామంతాపూర్ ప్రాంతంలోని నెహ్రూనగర్లో గురువారం ఓ వీధి కుక్క మృత శిశువు(మగ)ను నోట కరుచుకొని తెచ్చి అక్కడున్న కాలేజీ సమీపంలో వదిలేసిపోయింది. పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించగా మృత శిశువు తొంటి నుంచి కింది భాగం లేదు. కుక్కలు ఆ భాగం తిన్నాకనే వదిలేసిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శిశువు పుట్టి, మృతిచెంది 2, 3 రోజులై ఉంటుందని ఎస్సై తెలిపారు. శిశువు పుట్టి మరణించాకనే తెచ్చి చెత్త డబ్బాలో వేసి ఉంటే వీధి కుక్కలు తీసి ఉండొచ్చని చెప్పారు.
సుమో బీభత్సం.. ఆటోడ్రైవర్ మృతి
నారాయణగూడ, న్యూస్టుడే: తెల్లారితే రంజాన్ ప్రార్థనలకు వెళ్లాల్సిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. లిబర్టీ కూడలిలో టాటా సుమో సృష్టించిన బీభత్సంలో ఓ ఆటోడ్రైవర్ మృతి చెందాడు. నారాయణగూడ అడ్మిన్ ఎస్సై నరేష్కుమార్ వివరాల మేరకు.. పాతబస్తీ భవానీనగర్ తలాబ్కట్ట హిదాయత్ ఫంక్షన్ హాల్ లేన్లో ఉండే హసన్ బిన్ జాఫర్ ఈవెంట్ మేనేజర్. బుధవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద ఓ వేడుక ముగించుకొని, డెకరేషన్ వస్తువులను తలాబ్కట్ట, ఒవైసీ స్కూల్ వద్ద ఉండే ఆటో డ్రైవర్ సయ్యద్ అఖీబ్ ఉర్ రహెమాన్ ఆటోలో వేసుకొని బయలుదేరాడు. లిబర్టీ కూడలిలో ఆటో నిలిపి నీళ్ల సీసా కొనుక్కోవడానికి లిబర్టీకి ఎదురు రోడ్డులో పాన్షాప్ వద్దకు వెళ్లారు. తిరిగి వస్తుండగా టాటా సుమో.. రహెమాన్ను, మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి నేరుగా ఓ దుకాణం షట్టర్ వైపు దూసుకెళ్లింది. అక్కడి నుంచి సుమో డ్రైవర్ రివర్స్ తీసుకుంటుండగా రోడ్డుపై గాయాలతో పడి ఉన్న రహెమాన్పై నుంచి వెళ్లింది. సుమో డ్రైవర్ ముస్తాక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది ఓ ఉర్దూ దినపత్రికకు సంబంధించినది. రహెమాన్ను ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
పోలీసు విచారణకు శివానందరెడ్డి హాజరు
ఈనాడు, హైదరాబాద్: బుద్వేల్లో 26 ఎకరాల అసైన్డు భూముల వ్యవహారంలో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా తెదేపా నేత, వెస్సెల్లా గ్రూపు సీఈవో మాండ్ర శివానందరెడ్డి నగర సీసీఎస్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే శివానందరెడ్డి భార్య ఉమాదేవి, కుమారుడు కనిష్క, పైరెడ్డి ప్రశాంత్రెడ్డి ఏప్రిల్ 2న విచారణకు హాజరయ్యారు. సంస్థకు సంబంధించి ముఖ్య వ్యవహారాలన్నీ శివానందరెడ్డి చూస్తారని వారు పేర్కొన్న నేపథ్యంలో పోలీసులు శివానందరెడ్డితో పాటు ఆరోగ్యంరెడ్డికి నోటీసులిచ్చారు. శివానందరెడ్డి బుధవారం విచారణకు హాజరయ్యారు.
రూ.1,15,460 స్వాధీనం
బషీరాబాద్ న్యూస్టుడే: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తీసుకెళ్తున్న నగదు రూ.1,15,460 లను జప్తు చేసినట్లు బషీరాబాద్ ఎస్సై రమేష్ కుమార్ తెలిపారు. బషీరాబాద్ మండలం మైల్వార్ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద గురువారం హెడ్ కానిస్టేబుల్ లోక్యా నాయక్, కానిస్టేబుల్ రాములు విధులు నిర్వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం షాదీపూర్కు చెందిన పటేల్ మనోజ్ కుమార్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా తనిఖీలు చేసిన పోలీసులు ఆయన వద్ద ఎక్కువ నగదును గమనించి విషయాన్ని ఎస్ఐకి వివరించారు. మొత్తం రూ.1,15,460 ఉండగా జప్తు చేసి వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్కు పంపించడం జరిగిందని తెలిపారు.
24 గ్రాముల హెరాయిన్ పట్టివేత
పహాడీషరీఫ్, న్యూస్టుడే: డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను మహేశ్వరం జోన్ ఎస్ఓటీ బృందం, బాలాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకొని గురువారం రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... బిహార్కు చెందిన లాల్బాబు కుమార్(28).. మహ్మద్ ముస్తాక్(26)తో కలిసి సైదాబాద్లో ఉంటున్నారు. డీజే సౌండ్ సిస్ట్మ్లో పనిచేస్తారు. ఎంత కష్టపడినా ఆదాయం పెద్దగా ఉండట్లేదని.. లాల్బాబు కుమార్ డ్రగ్స్ కొనుగోలు చేసి విక్రయించాలని ఆలోచన చేశాడు. మిత్రుడు ముస్తాక్ వద్ద డబ్బులు తీసుకుని స్వస్థలానికి వెళ్లాడు. తెలిసిన పప్పు కుస్వాల్ వద్ద డ్రగ్స్ సరఫరా చేసే మధ్యవర్తిని కలిశాడు. అదే రాష్ట్రంలో నివసించే అస్లం అనే వ్యక్తి వద్ద రూ.5 వేలకు గ్రాము చొప్పున 24 గ్రాములు హెరాయిన్ కొనుగోలు చేశాడు. నగరానికి వచ్చి మిత్రుడు ముస్తాక్తో కలిసి గ్రాము.. రూ.10 వేల చొప్పున విక్రయించేందుకు స్థానిక మధ్యవర్తులతో మాట్లాడటానికి ఈనెల 9న బాలాపూర్ శివాజీచౌక్కు చేరుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు.. దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. పప్పు కుస్వాల్, అస్లం అనే వ్యక్తుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
విమానాశ్రయంలో హిజ్రాల అసభ్య ప్రవర్తన
శంషాబాద్, న్యూస్టుడే: శంషాబాద్ విమానాశ్రయంలో అకారణంగా హల్చల్ చేసిన ఇద్దరు హిజ్రాల(ట్రాన్స్జెండర్స్)ను ఆర్జీఐఏ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ఇద్దరు హిజ్రాలు శంషాబాద్ నుంచి ఇండిగో ఎయిర్లైన్స్లో వడోదర వెళ్లడానికి విమానాశ్రయానికి వచ్చారు. అదే సమయంలో జయపుర వెళ్లడానికి భద్రతాధికారుల తనిఖీల కోసం క్యూలైన్లో నిలుచున్న ఆస్ట్రేలియా దేశస్థులతో హిజ్రాలు గొడవ పడ్డారు. విమానాశ్రయంలో అసభ్య పదజాలంతో హంగామా చేయడంతో ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. భద్రతాధికారులు వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల