రైలు బండి.. గంజాయి దండి
కోట్లాది మందిని గమ్యస్థానాలకు తీసుకెళ్లే రైళ్లలో గంజాయి గుప్పుమంటోంది. వందల కిలోమీటర్లు ప్రయాణించినా అంతంతమాత్రంగా జరిగే తనిఖీలు.. ప్రయాణికుల్లా నటిస్తూ అనుమానమొస్తే మధ్యలోనే తప్పించుకునే వెసులుబాటు..
ఈనాడు- హైదరాబాద్
గంజాయి స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు
కోట్లాది మందిని గమ్యస్థానాలకు తీసుకెళ్లే రైళ్లలో గంజాయి గుప్పుమంటోంది. వందల కిలోమీటర్లు ప్రయాణించినా అంతంతమాత్రంగా జరిగే తనిఖీలు.. ప్రయాణికుల్లా నటిస్తూ అనుమానమొస్తే మధ్యలోనే తప్పించుకునే వెసులుబాటు.. వెరసి ఏటా గంజాయి రవాణా పెరుగుతోంది. రహదారుల్లో పోలీసుల తనిఖీలు పెరగడం, ఎన్నికల నేపథ్యంలో ఎక్కడికక్కడ చెక్పోస్టుల ఏర్పాటుతో స్మగ్లర్లు రైలు మార్గాన్ని ఎంచుకుని గుట్టుగా రాష్ట్రాలు దాటించేస్తున్నారు. ఇటీవల గంజాయికి డిమాండ్ పెరగడం మరో కారణం. ఆర్పీఎఫ్, జీఆర్పీబృందాల తనిఖీల్లో సరకు చిక్కుతున్నా.. రవాణాఅయ్యే పరిమాణంతో పోలిస్తే ఇది చాలా తక్కువేనని అధికారులే అంగీకరిస్తున్నారు.
చిన్న స్టేషన్లు కేంద్రంగా
చిన్న రైల్వేస్టేషన్లు కేంద్రంగా మత్తు పదార్థాల స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. దూరప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు నిర్దేశిత బస్టాపులు, పట్టణాల్లోనే ఆగుతాయి. బస్సులు, ప్రైవేటు వాహనాల్లో వెళ్తే అంతర్రాష్ట్ర సరిహద్దులు, అక్కడక్కడా పోలీసు తనిఖీలు తప్పవు. వందలు, వేల కిలోమీటర్లు ప్రయాణించే రైళ్లు చిన్నపాటి గ్రామాలు.. నగర శివార్లలో ఉండే స్టేషన్లలో ఆగుతుంటాయి. కొన్నిసార్లు రూట్ క్లియరెన్స్ కోసం శివార్లలో ఆపాల్సి ఉంటుంది. నేరగాళ్లు దీన్నే అవకాశంగా మార్చుకుంటున్నారు. ఉదాహరణకు ఏవోబీ సరిహద్దులు, ఒడిశా, ఇతర రాష్ట్రాలనుంచి గంజాయి తీసుకొచ్చేవారు.. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడవరకూ రాకుండా శివార్లలోని చిన్నస్టేషన్లలో దిగుతారు. ఇక్కడ తనిఖీలు ఉండకపోవడం.. అక్కడి నుంచి వాహనాల్లో నగరానికి చేరుకుని దందా చేస్తున్నారు. ఒకేసారి ఐదారుగురు కలిసి చిన్న మొత్తాల్లో వేర్వేరు బోగీల్లో ఉంటూ తరలిస్తున్నారు. ఒకవేళ తనిఖీలు జరుగుతున్నట్లు అనుమానమోస్తే సరకు వదిలేసి తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తారు. కొన్నిసార్లు వేర్వేరు బోగీల్లోకి మారుతూ ముప్పుతిప్పలు పెడుతుంటారని పోలీసులు పేర్కొన్నారు.
ఏవోబీ టూ హైదరాబాద్
ఇప్పటివరకూ స్మగ్లర్లు, మధ్యవర్తులే గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు చిక్కేవారు. ఇటీవల ఏవోబీ, ఒడిశా ప్రాంతాల స్థానికులు, రైతులు గంజాయి దందా మొదలుపెట్టారు. ఏవోబీ దగ్గర గంజాయి కిలో రూ.3 వేలుంటే.. నగరంలో రూ.30-50వేలు పలుకుతోంది. హ్యాష్ ఆయిల్గా మారిస్తే ఇంకా ధర పెరుగుతుంది. దీంతో మధ్యవర్తులతో సంబంధం లేకుండా వారే నగరానికి తెచ్చి విక్రయిస్తున్నారు. ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చినవారు.. తమతోపాటే సరకు తీసుకొస్తున్నారు. ఇటీవల చందానగర్లో ఆబ్కారీ అధికారులు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టుచేశారు. ఏవోబీ ప్రాంతానికి చెందిన రైతుగా గుర్తించారు. డబ్బుకోసం అప్పుడప్పుడూ రైల్లో వచ్చి గంజాయి విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు. మరోవైపు మహిళలతోనూ స్మగ్లర్లు గంజాయి రవాణా చేయిస్తున్నారు. గతేడాది రైళ్లలో గంజాయి తరలిస్తుండగా అరెస్టుయిన వారిలో 12 మంది మహిళలున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల