పారదర్శకతకు పెద్దపీట.. దళారులకు అడ్డుకట్ట
రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు కొన్నేళ్లుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇదే అదునుగా భావించి కొందరు దళారులు తమ చాకచక్యాన్ని చూపుతున్నారన్న ఫిర్యాదులు అధికారులకు అందుతున్నాయి.
ధాన్యం కొనుగోళ్లకు ఐరిస్ విధానం
అధికారుల అవగాహన కార్యక్రమం
న్యూస్టుడే, వికారాబాద్ కలెక్టరేట్, పరిగి: రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు కొన్నేళ్లుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇదే అదునుగా భావించి కొందరు దళారులు తమ చాకచక్యాన్ని చూపుతున్నారన్న ఫిర్యాదులు అధికారులకు అందుతున్నాయి. దీంతో ధాన్యం కొనుగోళ్లను ఈసారి మరింత కట్టుదిట్టంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
అవసరాలే ఆసరా చేసుకుంటున్నారని..
రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అక్రమాలను, దళారీ వ్యవస్థను అరికట్టేందుకు ప్రభుత్వం ఐరిస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. డీఆర్డీఏ-ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, డీసీఎంఎస్లు, ఏఎంసీ, ద్వారా గ్రామాల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధరను పొందనున్నారు.
- కొన్ని చోట్ల దళారులు రైతుల అవసరాలను ఆసరా చేసుకుని ధాన్యాన్ని మద్దతు ధర కంటే తక్కువకు కొంటున్నారు. అదే ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లో రైతుల పేరుతో విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సీజన్ నుంచి ధాన్యం కొనుగోళ్లను ఐరిస్ యంత్రాలను ఉపయోగించి కనుపాప ద్వారా లబ్ధిదారుల గుర్తింపు విధానం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం నిర్వాహకులకు ఐరిస్ పరికరాలను పంపిణీచేశారు.
మూడో వారంలో ప్రారంభం
మిగతా జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో వరి ధాన్యం కోతకు కొంత ఆలస్యంగా వస్తుంది. జిల్లాలోని బొంరాస్పేట, కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లో వరి కోతలు ముందుగా ప్రారంభమవుతాయి. ఈ మండలాల్లో ఈనెల మూడో వారంలో కేంద్రాలను ప్రారంభించనున్నారు. కొన్ని కేంద్రాలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. జిల్లాలోని అన్ని కేంద్రాలు ఈనెల చివరి వారంలో కాని వచ్చే నెలలో పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
ప్రతి రైతు రావాల్సిందే..
గతంలో రైతుబంధు పాసుపుస్తకం, ఆధార్, ఫోన్ నంబర్ను అనుసంధానించారు. పాత పద్ధతి ప్రకారం ట్యాబ్లో నమోదు చేయగానే రైతుల ఫోన్కు వన్టైం పాస్వర్డ్ (ఓటీపీ) వచ్చేది. ఈ సంఖ్యను నమోదు చేసి ధాన్యాన్ని కొనేవారు. దీనికి అదనంగా ఇప్పుడు కనుపాప గుర్తింపు తీసుకోనున్నారు. ఇందు కోసం ప్రతి రైతు కొనుగోలు కేంద్రానికి రావాల్సి ఉంటుంది.
1,92,500 లక్షల టన్నుల లక్ష్యం
జిల్లాలో ఈ సీజన్లో 1,92,500 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా నిర్ణయించింది.
- జిల్లా వ్యాప్తంగా 122 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో డీర్డీఏ-ఐకేపి 27, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో 61, డీసీఎంఎస్ల ద్వారా 27, ఏఎంసీ 3, ఎఫ్సీఓ ఆధ్వర్యంలో 4 కేంద్రాలు ఉంటాయి.
కేంద్రానికి ఒకటి చొప్పున పంపిణీ:
రాజేశ్వర్, జిల్లా పౌర సరఫరాల అధికారి
జిల్లాలో 122 వరి ధాన్యం కేంద్రాలను 122 ప్రారంభించనున్నాం. ప్రతి కేంద్రానికి ఒకటి చొప్పున ఐరిస్ యంత్రాలను పంపిణి చేశాం. నిర్వాహకులకు వీటిని ఏ విధంగా వినియోగించాలో తగిన శిక్షణ ఇచ్చాం. కేంద్రాల్లో వీటిని తప్పని సరిగా ఉపయోగించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ