logo

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని చేవెళ్ల పార్లమెంట్‌ అభ్యర్ధి రంజిత్‌రెడ్డి అన్నారు. పూడూరు మండల కేంద్రంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.

Published : 13 Apr 2024 02:13 IST

పార్టీలో చేరిన కార్యకర్తలతో ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌, రంజిత్‌ రెడ్డి

పూడూరు: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని చేవెళ్ల పార్లమెంట్‌ అభ్యర్ధి రంజిత్‌రెడ్డి అన్నారు. పూడూరు మండల కేంద్రంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.అనంతరం ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌ అధికారంలో ఉండి రూ.లక్షల కోట్లు అప్పుచేసి లూటీ చేశారన్నారు. తీవ్ర నష్టం కలిగించారనారు. కేంద్రంలో ప్రధాని మోదీ ప్రజలను మోసం చేశారని భారాస, భాజపాలను నమ్మెద్దన్నారు.  

  • భారాస మండలపార్టీ అధ్యక్షులు మహిపాల్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు శ్రీనివాస్‌ గుప్త, గోవర్ధన్‌ రెడ్డి, ముక్కంటి నర్సింలు, శ్రీధర్‌ గుప్త తదితరులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు కడ్మూరు ఆనందం, మండల పార్టీ అధ్యక్షులు సురేందర్‌, ఎంపీటీసీ సల్మాబేగం, రఘునాథ్‌ రెడ్డి, సతీష్‌రెడ్డి, నర్సింహారెడ్డి, తాజొద్దీన్‌, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు.    
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు