పై వంతెన పనులు వేగవంతం
వికారాబాద్ మీదుగా పరిగి, హైదరాబాద్ వెళ్లేందుకు ఒకే పై వంతెన ఉండటంతో నిత్యం వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.ఈ సమస్యను పరిష్కరించడానికి రెండు నెలల క్రితం నూతన వంతెన పనులు చేపట్టారు.
వాహనదారులకు తీరనున్న ఇక్కట్లు
కొనసాగుతున్న నిర్మాణం
న్యూస్టుడే, వికారాబాద్ టౌన్: వికారాబాద్ మీదుగా పరిగి, హైదరాబాద్ వెళ్లేందుకు ఒకే పై వంతెన ఉండటంతో నిత్యం వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.ఈ సమస్యను పరిష్కరించడానికి రెండు నెలల క్రితం నూతన వంతెన పనులు చేపట్టారు. ప్రస్తుతం వేసవి కావడంతో వేగంగా సాగుతున్నాయి. సకాలంలో పూర్తయితే పట్టణ వాసులకు, వాహనదారులకు రాకపోకలకు అవస్థలు తొలగుతాయి.
- అన్నింటికీ కీలకం: ఎప్పుడో 1995-96లో అప్పటి వాహనాల రాకపోకలను అంచనా వేస్తూ వికారాబాద్ ఆరంభంలో పై వంతెన నిర్మించారు. రోజు రోజూకు వాహనాల సంఖ్య అధికం కావడం, జిల్లా కేంద్రం కావడంతోపాటు ఇక్కడే కలెక్టరేట్ కార్యాలయం ఉండటంతో పాటు అన్ని జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. పనుల నిమ్తితం వివిధ ప్రాంతాల ప్రజలు వస్తుంటారు. అంతేకాదు హైదరాబాద్నుంచి వికారాబాద్ మీదుగా తాండూరు, ఇతర ప్రాంతాలకు, అలాగే అటు నుంచి హైదరాబాద్కు రావాలంటే ఈ వంతెనే కీలకం. వికారాబాద్ నుంచి తాండూరు, సదాశివపేట, నవాబుపేట తదితర ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. దీంతో పట్టణ ప్రజలకు నిత్యం ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకు గత భారాస ప్రభుత్వం నూతనంగా మరో పై వంతెన నిర్మాణానికి రూ.96 కోట్లను మంజూరు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తే, నిర్మాణ పనులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై వేగంగా సాగుతున్నాయి.
- సిమెంటు పిల్లర్లు: ప్రస్తుతం ఉన్న పాత వంతెన మట్టి కట్టపై నిర్మించినది. మధ్యలో రైల్వే ట్రాక్ ఉన్న చోట మామ్రే పిల్లర్లు ఉన్నాయి. దీని పక్కనే చేపట్టిన కొత్త వంతెనకు ఆర్ అండ్ బి అధికారులు సిమెంటు పిల్లర్లు వేస్తున్నారు. దీన్ని అందుబాటులోకి తెచ్చిన తరువాత పాత వంతెనకు కూడా మట్టి తొలగించి సిమెంటు పిల్లర్లు నిర్మిస్తారు. దీంతో రెండు వంతెనలు ప్రజలకు ఉపయోగపడతాయని, తద్వారా ట్రాఫిక్ సమస్య తొలగడంతోపాటు రాకపోకలు ఎంతో వేగంగా సులభంగా మారతాయని అధికారులు వివరిస్తున్నారు.
త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు
పై వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి రోజు పర్యవేక్షిస్తున్నాం. సంబంధిత గుత్తేదారుకు ఇచ్చిన సమయంలోగా పూర్తి అయ్యేలా చూస్తున్నాం. సంవత్సరంలోగా పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు వంతెన అందుబాటులోకి తీసుకువస్తాం.
శ్రీధర్రెడ్డి, అర్ అండ్ బీ డీఈ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్