logo

గంజాయి కావాలని ఖైదీల గొడవ

చర్లపల్లి కేంద్ర కారాగారంలో శుక్రవారం మత్తుపదార్థాలకు ఖైదీలు గలాటా సృష్టించారు. అధికారులు ధూమపానం, గంజాయి అందకుండా చేస్తున్నారని ఆందోళనకు దిగారు.

Published : 13 Apr 2024 02:18 IST

కాప్రా: చర్లపల్లి కేంద్ర కారాగారంలో శుక్రవారం మత్తుపదార్థాలకు ఖైదీలు గలాటా సృష్టించారు. అధికారులు ధూమపానం, గంజాయి అందకుండా చేస్తున్నారని ఆందోళనకు దిగారు. కారాగారంలోని విచారణ ఖైదీల్లో ఓ వర్గం  మత్తు పదార్థాలు కావాలంటూ గొడవకు దిగారు. జైలు వార్డర్లు, సిబ్బందిపై తిరబడ్డారు. మాటామాటా పెరడంతో పాటు పరిస్థితి చేయి దాటటంతో అధికారులు రంగ ప్రవేశం చేశారు.  జైలు పర్యవేక్షాణాధికారి సంతోష్‌ రాయ్‌  సిబ్బందితో వెళ్లి పరిస్థితిని అదుపు లోనికి తీసుకువచ్చారు. కొంతమంది విచారణ ఖైదీలను ప్రత్యేక బ్యారక్‌లోకి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని