బైకు పోయిందా.. ఇక అంతే!
బైకు చోరీల కేసుల పరిష్కారంలో పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాహనం పోయిందని ఎవరైనా ఫిర్యాదు చేసినా స్పందన అంతంతమాత్రంగానే ఉంటోందని బాధితులు వాపోతున్నారు.
వాహన చోరీ కేసుల్లో జాప్యం
ఈనాడు- హైదరాబాద్: బైకు చోరీల కేసుల పరిష్కారంలో పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాహనం పోయిందని ఎవరైనా ఫిర్యాదు చేసినా స్పందన అంతంతమాత్రంగానే ఉంటోందని బాధితులు వాపోతున్నారు. కొన్ని ఠాణాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాలు తనిఖీ చేయడం.. ఇతర ఇతర ఆధారాలతో దొరకబుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నా మెజార్టీ కేసులను పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఎఫ్ఐఆర్ నమోదులో విపరీత జాప్యం జరుగుతోంది. ఎఫ్ఐఆర్ నమోదైతే వాహనం దొరికాక యజమానికి అప్పగించడానికి కోర్టు అనుమతి, చోరీ చేసిన వ్యక్తిని రిమాండు చూపడం వంటి సమస్యలు ఉంటాయనే ఉద్దేశంతో వేచి చూసే ధోరణి ప్రదర్శిస్తున్నారు. మొత్తంగా బాధితులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కొందరు వాహన బీమా పాలసీని పొందలేని పరిస్థితి ఎదురవుతోంది.
కేసు లేకుండా ఎదురుచూపులు
నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఏటా 4 వేలకుపైగా వాహనాలు చోరీకి గురవుతున్నాయి. రికవరీ 50- 70 శాతం వరకూ ఉంటోంది. మెజార్టీ కేసుల్లో నిందితులు చిక్కిన తర్వాత కూపీ లాగినప్పుడే వాహనం గుట్టు బయటపడుతోంది. కొన్ని ముఠాలు వ్యవస్థీకృతంగా నడిపిస్తూ చోరీలు చేస్తుంటాయి. కొట్టేసిన బైకులను విడి భాగాలుగా అమ్ముకోవడం, తక్కువగా మార్చడం.. వాహన స్థితి బాగుంటే ఇతర రాష్ట్రాలు లేదా ఇతర జిల్లాల్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకు విక్రయిస్తుంటాయి. ఇలాంటి కేసుల్లో రికవరీ చేయడం క్లిష్టంగా మారుతోంది. మిగిలిన కేసుల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా వేరు. మైనర్లు, యువత జల్సాలు, చేతి ఖర్చుల కోసం వాహనాలు దొంగిలిస్తారు. బార్లు, రద్దీ ప్రదేశాలు, రోడ్ల వెంట పార్కింగ్ చేసినప్పుడు అదను చూసి కొటేస్తారు. నెంబరు ప్లేటు మార్చి తక్కువ ధరకు విక్రయించడం వంటివి ఉంటాయి. ఈ తరహా కేసుల్లో చోరీ అయిన వాహనాలు రోజుల వ్యవధిలో మరో ఠాణా పరిధిలో పోలీసులకు చిక్కుతుంటాయి. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో చిక్కిన వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు యజమానుల్ని సంప్రదిస్తుంటారు. వాహనం చోరీకి గురైన ప్రాంతం, దాని ఆచూకీ లభ్యమైన ప్రాంత పోలీసులు ఇద్దరూ మాట్లాడుకుని యజమానులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవీ ఉదాహరణలు..!
- నగర శివారులో వారం రోజుల క్రితం బైకు చోరీ జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. వాహనం కొట్టేసిన దొంగ మిడ్జిల్ వరకూ వెళ్లి పెట్రోలు అయిపోగానే అక్కడ వదిలేశాడు. అక్కడి పోలీసులు వాహనం నంబరు ఆధారంగా యజమానిని సంప్రదించారు. చోరీ జరిగిన ఠాణాలో కేసు రిజిస్టర్ అయితేనే.. తదుపరి ప్రక్రియ పూర్తి చేసి వాహనాన్ని అప్పగిస్తామని మిడ్జిల్ పోలీసులు చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు జాప్యంతో బాధితుడు ఠాణా చుట్టూ తిరుగుతున్నాడు.
- మెట్రో దగ్గర పార్కింగ్ చేసిన వాహనం చోరీ అయ్యింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. నాలుగు నెలలు గడుస్తున్నా వాహన ఆచూకీ చిక్కలేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే బీమా క్లెయిమ్ చేస్తానని చెప్పినా స్పందించడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే