టపాసులు కాల్చొద్దు.. కర్రలు తేవద్దు
శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఈనెల 17న నగరంలో శ్రీరాముని శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు నగర కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
శ్రీరాముడి శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు
నగర సీపీ శ్రీనివాస్రెడ్డి
బేగంబజార్ ఛత్రి చౌరస్తాలో శోభాయాత్ర మార్గాన్ని పరిశీలిస్తున్న సీపీ శ్రీనివాస్రెడ్డి, అదనపు సీపీ విక్రమ్సింగ్మాన్ తదితరులు
అబిడ్స్, సుల్తాన్బజార్, న్యూస్టుడే: శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఈనెల 17న నగరంలో శ్రీరాముని శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు నగర కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. శోభాయాత్రలో రాజకీయ చిహ్నాలు, అన్యమతస్థులను కించపరిచేలా పాటలు, ప్రసంగాలు చేయకూడదని స్పష్టం చేశారు. సీతారాంబాగ్లోని ద్రౌపది గార్డెన్స్లో భాగ్యనగర్ శ్రీరామ ఉత్సవ సమితి నిర్వాహకులతో శుక్రవారం సమావేశమయ్యారు. డిగ్రీ పరీక్షలు జరుగుతున్నందున డీజే శబ్దాలతో విద్యార్థులకు ఇబ్బందులు కలిగించొద్దన్నారు. శోభాయాత్రలో టపాసులు కాల్చడం, కర్రలు, మారణాయుధాలు వెంట తెచ్చుకోవడం నిషేధమన్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా యాత్ర నిర్వహించాలన్నారు. భక్తులకు తాగునీరు, మొబైల్ టాయిలెట్స్, ఇతర వసతులు వివిధ విభాగాల తరఫున ఏర్పాటు చేస్తున్నారన్నారు. 7 కి.మీ. మేర మార్గాన్ని ఆయన ఉత్సవ కమిటీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఉత్సవ సమితి అధ్యక్షుడు డా.భగవంత్రావు, ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాల నిర్వహణకు చేపట్టాల్సిన బందోబస్తుపై సీపీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్తో కూడా సమీక్ష నిర్వహించారు. ఊరేగింపులు సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు జరిగే ప్రధాన ఊరేగింపుతోపాటు నగరంలోని మిగిలిన ప్రాంతాల్లోని వాటిపైనా దృష్టి సారించాలన్నారు. సీనియర్ అధికారుల ఆదేశాలు పాటించాలని.. డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్వోలు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
[ 26-07-2024]
విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురు చూసే ఒలింపిక్స్కు నేడే తెరలేవనుంది. పారిస్ ఒలింపిక్స్లో పతకాల వేటకు భారత అథ్లెట్లు సిద్ధమయ్యారు. -
మహానగరికి ఊపిరి
[ 26-07-2024]
ఓ వైపు అప్పులు.. వడ్డీలు.. మరోవైపు నిలిచిన అభివృద్ధి పనులు.. గుత్తేదారుల ఆందోళనలు.. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీకి రాష్ట్ర బడ్జెట్ ఊరటనిచ్చింది. -
అంచనాలను ‘భట్టి’ కేటాయింపులు
[ 26-07-2024]
బాహ్యవలయ రహదారి వరకు భాగ్యనగరమే. ఈ ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ జిల్లా పూర్తిగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు పాక్షికంగా నగర పరిధిలోకి వస్తున్నాయి. -
ప్రాంగణాలు బురదమయం.. ప్రయాణికులకు అసౌకర్యం
[ 26-07-2024]
జిల్లాలో వారం రోజులుగా ముసురు వర్షాలు పడుతున్నాయి. వీటివల్ల ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్లు, ప్రయాణ ప్రాంగణాలు బురదమయంగా మారిపోతున్నాయి. -
సంక్షేమానికి చోటు.. అభివృద్ధికి బాట
[ 26-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి అగ్రాసం లభించింది. ఇదే సమయంలో అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించామనీ, ఆమేరకు నిధుల కేటాయింపు -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
[ 26-07-2024]
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫర్నిచర్ కర్మాగారం యజమానికి రిమాండ్
[ 26-07-2024]
జియాగూడ వెంకటేశ్వరనగర్లోని తిరుపతి ఫర్నిచర్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు మృతి చెందారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో హెల్ప్ డెస్క్
[ 26-07-2024]
రద్దీ సమయంలో యాప్ ఆధారిత క్యాబ్ వాహనాల కొరతను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
-
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
-
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
-
డబ్బులు ఊరికే రావు.. మాటల మాయలో పడ్డారో.. ఇల్లు గుల్లే
-
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం