logo

ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణం

ఓ క్యాబ్‌ డ్రైవర్‌ వేధింపులకు ఇంటర్‌ విద్యార్థిని బలైన సంఘటన శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది.

Published : 14 Apr 2024 02:20 IST

క్యాబ్‌ డ్రైవర్‌ వేధింపులే కారణమని ఫిర్యాదు

శంషాబాద్‌, న్యూస్‌టుడే: ఓ క్యాబ్‌ డ్రైవర్‌ వేధింపులకు ఇంటర్‌ విద్యార్థిని బలైన సంఘటన శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఆర్జీఐఏ పోలీసుల వివరాల ప్రకారం.. బాలిక(16) శంషాబాద్‌లో ఇంటర్‌ చదువుతోంది. రాళ్లగూడలో ఉంటున్న మహబూబ్‌నగర్‌కు చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ రాజు ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటానంటూ వేధించేవాడు. మానసికంగా కుంగుబాటుకు గురైన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకు…ంది. సాయంత్రం కుటుంబ సభ్యులు వచ్చేసరికి విగతజీవిగా కనిపించింది. మృతురాలి తల్లి గతంలో కరోనా వ్యాధితో మృతిచెందింది. బాలిక మృతికి క్యాబ్‌ డ్రైవరే కారణమంటూ ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని