ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ప్రియుడి ఆత్మహత్య
ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మనోవేదనకు గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సూరారం ఏఎస్ఐ మల్లేశం వివరాల ప్రకారం.. బిహార్కు చెందిన తన్వీర్ఖాన్(27)కు మూడేళ్లక్రితం వివాహమైంది.
కుత్బుల్లాపూర్: ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మనోవేదనకు గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సూరారం ఏఎస్ఐ మల్లేశం వివరాల ప్రకారం.. బిహార్కు చెందిన తన్వీర్ఖాన్(27)కు మూడేళ్లక్రితం వివాహమైంది. పెళ్లికిముందే అతను మరో యువతిని ప్రేమించాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అతను ప్రేమించిన యువతికి ఇటీవల పెళ్లి జరిగింది. దీంతో మూడునెలల క్రితం దయానంద్నగర్లో తన మామ ఇంటికివచ్చి అద్దెకుంటూ పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తన గదిలోకి వెళ్లాడు. శనివారం మధ్యాహ్నం వరకు బయటకు రాకపోవడంతో మామ, అనుమానంతో కిటికీ తెరచి చూడగా ఇనుప రాడ్కు ఉరేసుకుని కనిపించాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
పారిశుద్ధ్య కార్మికుడిని రోడ్డున పడేశారు
అనుమానాస్పద స్థితిలో మృతి
నాచారం: మద్యం దుకాణంలో ఒక వ్యక్తి అపస్మారక స్థితిలోకి చేరుకుంటే...ఆసుపత్రికి పంపించాల్సిన మద్యం పర్మిట్ రూం సిబ్బంది అతన్ని తీసుకెళ్లి రోడ్డు పక్కనే ఉన్న ఫుట్పాత్పై పడేశారు. తెల్లవారేసరికి అపస్మారక స్థితిలో ఉన్న కార్మికుడి ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారు. ఈ ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాలు ప్రకారం....నాచారం శ్రీరామ్నగర్ కాలనీలో ఉంటున్న ఎర్రబచ్చల కుమార్(45) జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుడు. కాప్రా సర్కిల్ పరిధిలోని నాచారం బాబానగర్లో గత 20ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య స్వరూప, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. శుక్రవారం రాత్రి 8గంటల సమయంలో మద్యం తాగేందుకు ఇంటి నుంచి బయలుదేరి నాచారం ప్రధాన రహదారిపై ఉన్న లిక్కర్ మార్ట్కు వెళ్లాడు. అక్కడ మద్యం తీసుకుని పక్కనే ఉన్న పర్మిట్ రూంలో తాగాడు. కొద్దిసేపటికే పర్మిట్ రూంలో అపస్మారక స్థితిలో పడిపోవడంతో పర్మిట్ రూం సిబ్బంది.. పోలీసులకు గానీ, ఆసుపత్రికి గానీ తీసుకెళ్లకుండా నిర్లక్ష్యంగా రోడ్డు పక్కన పడేశారు. రాత్రి నుంచి అలానే పడి ఉండటంతో ఉదయం 7 గంటల సమయంలో స్థానికులు రోడ్డు పైన పడి ఉన్న వ్యక్తిని గుర్తించి పోలీసులకు, కుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే అతను మృతి చెందాడు. మద్యం దుకాణం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న కుటుంబ సభ్యులు యాజమాన్యం నిర్లక్ష్యంతోనే మృతి చెందినట్లు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
సెలవని తండ్రితో నగరానికొచ్చి.. రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
ఆదిభట్ల, న్యూస్టుడే: సెలవు ఉండడంతో ఓ పాఠశాల విద్యార్థి హమాలీ అయిన తండ్రితోపాటు నగరానికొచ్చి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. తండ్రికి, డ్రైవర్కి తీవ్రగాయాలై చికిత్స పొందుతున్నారు. ఆదిభట్ల ఎస్సై వెంకటేష్ వివరాల ప్రకారం.. రాయచూర్కు చెందిన హమాలీ అంబాజీ.. శుక్రవారం అదే ప్రాంతం నుంచి ఉల్లిగడ్డల లోడ్తో బొలేరో వాహనం డ్రైవర్ మిట్టల్తో పెద్దఅంబర్పేటలో అన్లోడ్ చేయడానికి వస్తున్నారు. ఆదివారం సెలవు ఉండడంతో ఆరోతరగతి చదువుతున్న కుమారుడు సామ్రాట్(13) వస్తాననడంతో సరేనన్నాడు. మిట్టల్ బొలేరోను నిర్లక్ష్యంగా నడిపి శనివారం తెల్లవారుజామున బొంగుళూరు ఎగ్జిట్ 12 సమీపంలోని ఓఆర్ఆర్ పక్కనున్న గ్రిల్ను డీకొట్టాడు. ఈ ప్రమాదంలో సామ్రాట్కు గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మిట్టల్కి, అంబాజీకి తీవ్ర గాయాలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.