logo

బాలిక అపహరణ.. అత్యాచారం

బాలిక అదృశ్యమైన కేసులో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. సైదాబాద్‌ పోలీసుల వివరాల ప్రకారం..

Published : 15 Apr 2024 02:04 IST

యువకుడిపై పోక్సో కేసు నమోదు

సైదాబాద్‌: బాలిక అదృశ్యమైన కేసులో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. సైదాబాద్‌ పోలీసుల వివరాల ప్రకారం.. ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన బాలిక ఈ నెల 8న బిస్కెట్లు తీసుకొస్తానని సమీపంలోని దుకాణానికి వెళ్లి తిరిగిరాలేదు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా మాదన్నపేటలోని చంద్రాహట్స్‌కు చెందిన రాజేందర్‌ (22)ను అదుపులోకి తీసుకుని విచారించారు. బాలికను అపహరించి, అత్యాచారం చేసినట్లు అంగీకరించడంతో పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని