logo

అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలుస్తాం: కాంగ్రెస్‌

లోక్‌సభ ఎన్నికలలో ఈ దఫా అత్యధిక ఎంపీ స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ ఖైరతాబాద్‌ జిల్లా అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Updated : 15 Apr 2024 02:08 IST

రోహిణ్‌రెడ్డిని సత్కరించిన యాసిన్‌ షరీఫ్‌, చిత్రంలో ముస్లిం మైనార్టీ నేతలు

అంబర్‌పేట, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలలో ఈ దఫా అత్యధిక ఎంపీ స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ ఖైరతాబాద్‌ జిల్లా అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మతతత్వ భాజపా, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన భారాసలకు ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఆదివారం అంబర్‌పేటకు చెందిన కాంగ్రెస్‌ మైనార్టీ విభాగం నాయకుడు, జిల్లా ఛైర్మన్‌గా నూతనంగా నియమితులైన యాసిన్‌ షరీఫ్‌ సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఆరు గ్యారంటీ’ల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ. 500కే వంటగ్యాస్‌ సిలిండర్‌ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. మిగిలిన వాటి అమలుపైనా దృష్టి సారించామన్నారు. ఈ విషయంలో విపక్షాలు రాద్ధాంతం చేయడం తగదని హితవు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని