logo

భాజపాతోనే దేశాభివృద్ధి: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా భాజపా విజయం సాధించి, నరేంద్ర మోదీయే మళ్లీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

Published : 15 Apr 2024 02:40 IST

సమావేశంలో మాట్లాడుతున్న చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

యాలాల, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా భాజపా విజయం సాధించి, నరేంద్ర మోదీయే మళ్లీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం యాలాల మండల పరిధిలో, ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా ఏర్పాటు చేసిన భాజపా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ విఫలం అయ్యిందన్నారు. ప్రజలను మోసం చేసిన ఆ పార్టీని ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలో భాజపాతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్‌, యాదగిరి, అరుణ్‌, కాశీనాథ్‌, మధుగౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని