logo

నకిలీ టికెట్‌తో విమానమెక్కి.. భద్రత సిబ్బందికి చిక్కి

నకిలీ టికెట్‌తో గోవా వెళ్లడానికి విమానం ఎక్కిన ఓ వ్యక్తిని భద్రతాధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆదివారం జరిగింది.

Published : 15 Apr 2024 02:50 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: నకిలీ టికెట్‌తో గోవా వెళ్లడానికి విమానం ఎక్కిన ఓ వ్యక్తిని భద్రతాధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆదివారం జరిగింది. ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా నందిగామకు చెందిన ఓ వ్యక్తి ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీస్‌లో గోవా వెళ్లడానికి టికెట్‌ తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆయన బంధువు కోటేశ్వర్‌రావు అదే నంబరుతో టికెట్‌తో పాటు వెబ్‌ బోర్డింగ్‌ పాస్‌ను నకిలీవి సృష్టించి తనిఖీలు పూర్తి చేసుకొని గోవా విమానంలో కూర్చున్నాడు. అప్పటికే అసలు టికెట్‌ తీసుకున్న వ్యక్తి తనిఖీలు పూర్తి చేసుకుని విమానం ఎక్కారు. ఈ క్రమంలో ఒకటే పేరుతో రెండు టికెట్లు ఉన్నట్లు గుర్తించిన ఎయిర్‌హోస్టెస్‌ వెంటనే భద్రతాధికారులకు సమాచారం అందించారు. కోటేశ్వర్‌రావుది నకిలీ టికెట్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని