తాగేది.. శుద్ధ జలమేనా?
అసలే వేసవి కాలం..ఆపై జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గడంతో నగరంలో నల్లా నీరు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది నీటి శుద్ధి కేంద్రాలపై ఆధారపడుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు
సికింద్రాబాద్ క్లాక్టవర్ వద్ద చిరువ్యాపారులకు సరఫరా
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: అసలే వేసవి కాలం..ఆపై జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గడంతో నగరంలో నల్లా నీరు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది నీటి శుద్ధి కేంద్రాలపై ఆధారపడుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని ప్లాంట్ల నిర్వాహకులు.. నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్, బీఐఎస్, ఆహార కల్తీ నిరోధక శాఖ అనుమతులు లేకుండానే వ్యాపారం చేస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో శుద్ధి చేస్తున్న నీటిని సురక్షితమని భావించి వినియోగిస్తూ.. ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. భాగ్యనగరంలో ఏటా వేసవిలో వాటర్ ప్లాంట్ల కేంద్రంగా రూ.కోట్ల వ్యాపారం జరుగుతుంది. నగర వ్యాప్తంగా వేల సంఖ్యలో నీటి శుద్ధి కేంద్రాలు ఉన్నా.. నిర్వహణను పట్టించుకునేవారు కరవయ్యారు.
తోడేస్తున్నారు..
నగరంలో చాలావరకు వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు బోరు నీటినే ఉపయోగిస్తున్నారు. కొందరు ఇంటి అవసరాలకు తీసుకున్న బోరుని వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్లాంట్ను ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, నీటి శుద్ధికి అవసరమైన యంత్రాలు కొనుగోలు చేయకుండా రూ.2 నుంచి రూ.5 లక్షలతో ప్లాంట్ ప్రారంభిస్తున్నారు. అనధికారికంగా చిన్న చిన్న గదుల్లో ప్లాంట్లను ఏర్పాటు చేసి, రూ.లక్షలు దండుకుంటున్నారు.
నిబంధనలు ఇలా..
నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు మున్సిపాలిటీ అధికారుల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. ఈ ఎన్వోసీ ఆధారంగా ప్లాంట్ ఏర్పాటుకు విద్యుత్తు శాఖ నుంచి కనెక్షన్ పొందాలి.
- బీఎస్ఐ ధ్రువ పత్రం, ట్రేడ్, ఫుడ్ లైసెన్స్లు తప్పనిసరి.
- నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షకు ల్యాబ్, పరికరాలు, రసాయనాలు ఉండాలి. బీఎస్ఐ నిబంధనల ప్రకారం మైక్రో బయాలజిస్ట్, కెమిస్టులను నియమించుకోవాలి.
- నీటిని 12 సార్లు శుద్ధి ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. అనంతరం నీటిని డబ్బాల్లో నింపే ముందు 48 గంటలపాటు నిల్వ ఉంచాలి. అనంతరం కెమిస్ట్ పరీక్షలు జరపాలి. ఇందుకోసం మైక్రో బయలాజికల్ ల్యాబ్ ఉండాలి.
తరలింపులోనూ నిర్లక్ష్యం..
ప్లాంట్ నుంచి వినియోగదారుల వద్దకు నీటిని తరలించే క్రమంలో జాగ్రత్తలు పాటించడం లేదు. 40 డిగ్రీలు దాటిన ఎండలో ప్లాస్టిక్ డబ్బాల్లో తరలిస్తున్నారు. వాటిపై ఎండ పడకుండా చర్యలు తీసుకోవడంలేదు. నీటి శుద్ధికి చాలా సమయం పడుతుంది. డిమాండ్ రీత్యా తూతూ మంత్రంగా శుద్ధిచేసి విక్రయిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో రోజులతరబడి క్యాన్లను శుభ్రం చేయడంలేదు. ప్లాస్టిక్ డబ్బాలను కాలపరిమితికి మించి వాడటం నిషిద్ధమని తెలిసినా.. పట్టించుకోవడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం