సైబర్ మోసం.. కట్టడికి యోధులు సిద్ధం
నేటి ఆధునిక కాలంలో ఫోన్ లేనిదే రోజు గడవని పరిస్థితి. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకోవడంతో చాలా మంది స్మార్ట్ఫోన్లను ఉపయోగిస్తున్నారు.
ప్రతి పోలీస్స్టేషన్లో నియామకం
న్యూస్టుడే, వికారాబాద్
నేటి ఆధునిక కాలంలో ఫోన్ లేనిదే రోజు గడవని పరిస్థితి. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకోవడంతో చాలా మంది స్మార్ట్ఫోన్లను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా, పట్టణం అనే తేడా లేకుండా సైబర్ నేరాలు సైతం అధికమై అమాయకులు ఆర్థికంగా నష్టపోతున్నారు.వీటిని నియంత్రించేందుకు పోలీసుశాఖ ఇప్పటికే ఎన్నో అవగాహన కార్యక్రమాలను చేపడుతూ, ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా చైతన్యం తెస్తున్నారు. అయినా పరిస్థితికి అడ్డుకట్ట పడటం లేదు. ఈ నేపథ్యంలో బాధితులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రజలకు చేరువలోకి ‘సైబర్ వారియర్స్’ పేరిట ప్రత్యేక సిబ్బందిని నియమించారు.
టోల్ ఫ్రీ నం.1930కు రోజుకు 4 ఫిర్యాదులు
సైబర్ నేరాలకు గురైన బాధితులు టోల్ఫ్రీ నంబరు 1930కు ఫిర్యాదు చేయాలి. నేరం జరిగిన అనంతరం ఎంత త్వరగా సమాచారం ఇస్తే, అంత త్వరగా నేరాన్ని నియంత్రించేందుకు వీలవుతుంది. ఆలస్యమైతే పరిస్థితి చేజారి పోతుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం చాలా మంది బాధితులు టోల్ఫ్రీ నంబరును ఆశ్రయిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో టోల్ఫ్రీ నంబరుకు సగటున రోజుకు 4 ఫిర్యాదులు అందుతున్నాయి. బాధితులకు సత్వర సేవలు అందించేందుకు జిల్లాలో 19 పోలీస్ ఠాణాల్లో సైబర్ వారియర్స్ను సిద్ధం చేశారు.
వీళ్లు ఏం చేస్తారంటే..
సైబర్ వారియర్స్ను సంప్రదిస్తే, వారు నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ)లో వివరాలు నమోదు చేస్తారు. ఎవరైనా 1930కి కాల్ చేసినా, అక్కడి నుంచి బాధితులు ఉన్న పోలీస్ఠాణా పరిధిలోని సైబర్ వారియర్స్కు సమాచారం చేరుతుంది.
హైదరాబాద్లో శిక్షణ, ప్రత్యేక సిమ్కార్డులు
ఈ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ప్రతి పోలీస్ఠాణాకు ఒక సైబర్ వారియర్ను నియమించారు. వీరికి హైదరాబాద్ కేంద్రంగా శిక్షణ అందించారు. అందరికీ ప్రత్యేకంగా సిమ్కార్డులు, ఫోన్లు అందించారు. పోలీస్ఠాణాల వారీగా ఆ నంబర్లు అందరికీ తెలిసేలా ప్రచారం చేపడుతున్నారు.
ఆందోళన వద్దు.. వెంటనే సమాచారం ఇవ్వండి. చర్యలు తీసుకుంటాం
- ప్రశాంత్రెడ్డి, డీఎస్పీ, జిల్లా సైబర్ క్రైం విభాగం.
బాధితులు ఏమాత్రం ఆందోళన చెందొద్దు. సైబర్ మోసానికి గురైనట్లు తెలిసిన వెంటనే పరిధిలోకి వచ్చే సైబర్ వారియర్కు సమాచారం అందించాలి. రద్దీతో టోల్ఫ్రీ నంబరు 1930 సంప్రదించడంలో జాప్యం జరుగుతోంది. దీన్ని నివారించేందుకే ప్రతి పోలీస్స్టేషన్లో సేవలు అందించేందుకు ప్రభుత్వం వారియర్స్ను నియమించింది. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.