మంటల కాలం.. ముందు చూపుంటేనే పైలం
తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు నగరవాసుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అటు పరిశ్రమలు, ఇటు వాణిజ్య కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్ల్లో సంభవించిన ఘటనలు ప్రతి చోటా నిప్పు ముప్పు పొంచి ఉందన్న సంగతిని గుర్తు చేస్తున్నాయి.
అప్రమత్తతతోనే అగ్నిప్రమాదాలు దూరం
ఈనాడు, హైదరాబాద్: తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు నగరవాసుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అటు పరిశ్రమలు, ఇటు వాణిజ్య కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్ల్లో సంభవించిన ఘటనలు ప్రతి చోటా నిప్పు ముప్పు పొంచి ఉందన్న సంగతిని గుర్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో షాపింగ్ కాంప్లెక్స్లు, ఆసుపత్రులు వంటి జనసంచారం ఉండే ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగితే తప్పించుకునే మార్గాలున్నాయా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి నెలాఖరు నుంచే వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతుండగా.. ‘మే’ నెల వరకు ‘అగ్నిగండం’ పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఇళ్లు, ఆసుపత్రులు, పరిశ్రమలు, గోదాముల్లో ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని.. ప్రమాదాలు జరిగితే తక్షణమే తప్పించుకునేలా వ్యూహాలపై అవగాహన ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రమాదాల లెక్కలివీ..
జనవరి నుంచి ఏప్రిల్ 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,104 ఫైర్కాల్స్ నమోదయ్యాయి. స్వల్ప ప్రమాదాల విభాగంలో 2,860, మధ్యస్థంగా 62, తీవ్రతర ప్రమాదాలు 9, రెస్క్యూ కాల్స్ 127, ఎమర్జెన్సీ కాల్స్ 15 ఉన్నాయని కమాండ్ కంట్రోల్ సిబ్బంది తెలిపారు. ఇందులో 40-50శాతం ప్రమాదాలు రాజధాని పరిధిలోవే. ఇటీవల జరిగిన ఫిల్మ్ఛాంబర్లో అగ్నిప్రమాదంతో మొదలుకొని కాటేదాన్లోని ఓ బిస్కెట్ ఫ్యాక్టరీ, మల్కాజిగిరి పరిధిలోని ఓ ఆయిల్గోదాం, చార్మినార్ యునానీ ఆసుపత్రి సమీపంలో, గండిపేటలోని ఓ కార్ల గోదాముల్లో మంటల ఘటనలు సంభవించాయి. నివాస ప్రాంతాల్లో ఘటనల వేళ అగ్నిమాపకశాఖ వెనువెంటనే అక్కడికి చేరుకొని మంటలార్పేస్తోంది. వర్షాలతో వాతావరణం చల్లబడే వరకు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండటంతో పాటు ఎవాక్యుయేషన్ ప్లాన్పై దృష్టి సారించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎంఎస్డీఎస్ షీట్లో సూచనలు పాటించాలి...
పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలకు ప్రధాన కారణం నిషేధిత ప్రదేశాల్లో సిగరెట్లు తాగడం, విద్యుత్ ఉపకరణాల్లో స్పార్క్లను పట్టించుకోకపోవడమే. షార్ట్సర్క్యూట్, ఓవర్లోడ్, వదులుగా వైరింగ్, మండే స్వభావమున్న పదార్థాలు లీక్ అవడం, వెల్డింగ్, కటింగ్, సోల్డరింగ్, పరిశ్రమల యంత్రాల నిర్వహణలో లోపాలు ఇతర కారణాలు. ప్రమాదాలు జరిగిన వెంటనే ‘ఎంఎస్డీఎస్’ షీట్లో పేర్కొన్న సూచనలు పాటించాలి.
మంటల్లో చిక్కుకుంటే....
అగ్నిప్రమాదం సంభవిస్తే ఫైర్ అలారం మోగించాలి. లిఫ్ట్ వాడకుండా మెట్లమార్గం ఎంచుకుని సురక్షిత ప్రదేశం చేరుకోవాలి. ఫైర్ అలారం వింటే గాబరా పడకుండా ఎవాక్యుయేషన్ ప్లాన్ను అనుసరించాలి. విలువైన వస్తువుల గురించి చూడకుండా మొదటగా ప్రాణాలను కాపాడుకోవాలి. పొగలో చిక్కుకుపోతే మెల్లగా శ్వాస పీలుస్తూ.. నేలపై పాకుతూ అక్కడి నుంచి బయటపడాలి. ముఖానికి తడి రుమాలు లేదా టవల్ను చుట్టుకోవాలని అగ్నిమాపకశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఎవాక్యుయేషన్ ప్లాన్ ఉందా...?
ఆసుపత్రులు, షాపింగ్మాల్లు, మల్ల్టీప్లెక్స్ల్లో అంతస్తులను ఫైర్ కంపార్ట్మెంట్లుగా విభజించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెత్త పోగవకుండా ఆసుపత్రుల్లో వాడే గ్యాస్ నిల్వలో జాగ్రత్తలు పాటించాలి. ర్యాంపులు, మెట్లకు అడ్డంగా సామగ్రి ఉంచొద్దు. అత్యవసర ద్వారాలు, ఫైర్ డోర్లకు తాళాలు వేయకూడదు. అగ్నిమాపక పరికరాలున్న స్థలాలు, బయటకు వెళ్లే మార్గాలు, మెట్లను చూపుతున్న ఎవాక్యుయేషన్ ప్లాన్ను ప్రతి అంతస్తులో అందరికీ కనిపించేలా అతికించాలి. ఐదేళ్లకోసారి వైరింగ్, ఎంసీబీలు, ఇతర ఎలక్ట్రిక్ పరికరాలు లైసెన్స్డ్ ఇంజినీర్లతో పరీక్ష చేయించి అవసరమైన మార్పులు చేయించుకోవాలి. బ్యాటరీ బ్యాకప్తో కనీసం 90 నిమిషాలు పనిచేసేలా ఎమర్జెన్సీ లైటింగ్, ఆటో గ్లో ఎగ్జిట్ సైన్ ఏర్పాటుచేసుకోవాలి. అర్హులైన ఫైర్ అధికారి, ఎవాక్యుయేషన్ సూపర్వైజర్లను నియమించుకోవాలి. మూడు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలి.
హోటల్లో బస చేసినప్పుడు..
- హోటల్లో బసచేసే గది, అక్కడినుంచి సురక్షితంగా బయటకు వెళ్లే మార్గం గురించి తెలుసుకోవాలి. హోటల్లోని ఎగ్జిట్లు, స్టెయిర్ కేసులపై అవగాహన పెంచుకోవాలి. హోటల్లో సరైన అగ్నిమాపక పరికరాలు, అగ్ని నిరోధక చర్యలు ఉన్నాయో లేదో చూడాలి.
- ఫైర్ అలారం కాల్ పాయింట్లు, ఫైర్ ఎగ్జిట్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, హోస్ రీల్స్ పనితీరుపై అవగాహన అవసరం.
- విద్యుత్ ఉపకరణాల్లో స్విచ్ల్లో ఏ విధమైన పగుళ్లు, లోపాలు కనిపించినా వెంటనే మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్