సరదా అనుకోకు.. ప్రాణాల మీదకు తెచ్చుకోకు
‘ఈత’ అంటే ప్రతి ఒక్కరికీ ఉత్సాహమే. చెరువు కనిపించినా, వాగులో నీటిని చూసినా, పిల్లలైనా, పెద్దలైనా ఒక్కసారైనా ఈత కొట్టాలని ఉవ్విళూరుతారు.
ఈదేటప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం
న్యూస్టుడే, వికారాబాద్: ‘ఈత’ అంటే ప్రతి ఒక్కరికీ ఉత్సాహమే. చెరువు కనిపించినా, వాగులో నీటిని చూసినా, పిల్లలైనా, పెద్దలైనా ఒక్కసారైనా ఈత కొట్టాలని ఉవ్విళూరుతారు. అయితే ఈ సరదా ప్రాణాల మీదికి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా చిన్నారులు నీళ్లను చూసి ఆకర్షితులై ఒక్కోసారి ఇంట్లో చెప్పకుండా వెళ్తుంటారు. వారికి ఈత రాకున్నా కూడా నీళ్లలో దిగి స్నానాలు చేస్తుంటారు. యువకులు కూడా ఇలా చేస్తుంటారు. ఈ యత్నంలో ఈతరాక, లోతు తెలియక నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయి కుటుంబాల్లో విషాదం నింపుతారు. ప్రస్తుతం ఎండాకాలం. విద్యా సంస్థలకు సెలవులు. గ్రామాల్లో ఎండ వేడినుంచి ఉపశమనం కోసం సమీపంలోని చెరువులు, కుంటలు, బావుల చెంతకు ఈత కొట్టాలని వెళ్తుంటారు. అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకుంటారు. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను అరికట్టవచ్చు. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ అందిస్తున్న కథనం.
- 2023 జనవరి 15న పూడూర్ మండలం మన్నెగూడకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు యువకులు కోట్పల్లి ప్రాజెక్టుకు విహరించడానికి వెళ్లి ఈత రాక నీట మునిగి మృతి చెందారు.
- 2022 ఆగస్టులో ఓ విద్యార్థి విహార యాత్రకు వచ్చి అనంతగిరి పుష్కరిణిలో స్నానం చేస్తూ ఈత రాక మృతి చెందాడు.
- 2022 అక్టోబరులో ఈత రాక నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయికుమార్ బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు.
- 2021లో రాజధాని నగరానికి చెందిన నలుగురు యువకులు విహార యాత్రకు కోట్పల్లి ప్రాజెక్టుకు రాగా, వీరిలో ఓ యువకుడు నీటిలో మునిగి మృతువు పాలయ్యాడు.
ఇవీ తీసుకోవాల్సిన చర్యలు
- చెరువుల మరమ్మతులు చేసే సందర్భాల్లో అక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డును అధికారులు ఏర్పాటు చేయించాలి.
- గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ బావుల దగ్గర సంబంధిత యజమానులు కంచె ఏర్పాటు చేసి ఎవరూ బావిలోకి దిగకుండా చర్యలు తీసుకోవాలి.
- చెరువులు, ఇతర జలాశయాల్లో అడుగున బురద పేరుకుపోయి ఉంటుంది. అక్కడి పరిస్థితి తెలుసుకోకుండా ఈత వచ్చినా అందులో దూకితే ప్రమాదాల బారిన పడటం ఖాయం.
- ఈత వచ్చినా కూడా నీళ్లు ఎంత లోతు ఉన్నాయి? ఎలాంటి ప్రమాదాలు ఉంటాయనేది గమనించి ఈతకు ప్రయత్నించాలి.
- పిల్లలు ఈత నేర్చుకోవాలనుకుంటే నిపుణులైన ఈతగాళ్ల సమక్షంలో తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఈత నేర్పాలి.
పిల్లలు, యువకులపై కన్నేసి ఉంచాలి..
వార్షిక పరీక్షలు ముగిసి సెలవులకు సొంత ఊళ్లకు వెళ్లిన పిల్లలు, యువకులు చేసే పనులపై ఓ కన్నేసి ఉంచాలి. పిల్లలు స్నేహితులతో కలిసి పొలం గట్ల వెంబడి, చెరువులు, కుంటల్లోకి వెళ్లి సరదాగా గడపాలని చూస్తారు. ఈత కొట్టడానికి వెళ్లి లోతు తెలియక, ఈత రాక మృత్యువాత పడ్డ పిల్లల సంఘటనలు జిల్లాలో అక్కడక్కడా చోటు చేసుకుంటున్నాయి. అందుకే పిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్లి ఎవరితో ఆటలాడుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని గమనించి తగు సలహాలు, సూచనలు చేయాలి. అవసరమైతే ఈత వచ్చిన పెద్దలే పిల్లల వెంట ఉండి ఈత నేర్పించాలి. ఏమరుపాటు వహించకూడదు.
కోటిరెడ్డి, జిల్లా పోలీసు అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?