రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు.
ఐదేళ్ల ప్రగతిని ప్రజలకు నివేదించిన కిషన్రెడ్డి
నివేదికను విడుదల చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పాశం యాదగిరి, జయప్రకాష్ నారాయణ, నరసింహారెడ్డి, హనుమంతరావు
ఈనాడు - హైదరాబాద్: సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. తన నియోజకవర్గంతో పాటు నగరం, రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి కృషి చేశానన్నారు. మరోసారి ఓటేసి ఆదరించాలని కిషన్రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.48,726 కోట్లు ఖర్చు చేశామన్నారు. వీటికి అదనంగా రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ, ముద్ర యోజన, సీఎం స్వనిధి, స్టాండప్ ఇండియా వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అర్హులైన దాదాపు 26 లక్షల మందికి లబ్ధిదారులకు అందించిన రుణాల విలువ రూ.38,013 కోట్లున్నాయన్నారు. గత ఐదేళ్లలో ఎంపీగా, కేంద్రమంత్రిగా తన నియోజకవర్గంతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గురువారం లోయర్ ట్యాంక్బండ్లోని పింగలి వెంకట్ రామరెడ్డి కన్వెన్షన్లో ‘ప్రజలకు నివేదన’ పేరుతో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకరం అందకపోయినా.. ప్రధాని మోదీ, స్థానిక భాజపా నాయకులు, కార్యకర్తలు, ప్రజల సహకారంతో నగరంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు.
- వైద్యం, ఆరోగ్య సంరక్షణకు రూ.3,876 కోట్లు, రహదారులు, రైల్వేలు, పౌరవిమానయాన రంగంలో మౌలిక సదుపాయాలకు రూ.42,833 కోట్లు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రూ. 40 కోట్లు, విద్య, నైపుణ్య శిక్షణకు రూ.1,268 కోట్లు, కాలనీలు, బస్తీల్లో క్రీడలు, ఫిట్నెస్ సెంటర్లకు రూ. 18 కోట్లు, సాంస్కృతికం, పర్యాటకానికి రూ.563 కోట్లు అందించామన్నారు.
- హైదరాబాద్కే తలమానికంగా మారనున్న రీజనల్ రింగు రోడ్డు నిర్మాణానికి కేంద్రం రూ.26 వేల కోట్లు కేటయించింది. ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.627 కోట్లు, రూ.266 కోట్లతో అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఆరాంఘర్ చౌరస్తా నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకూ 6 వరుసల రహదారి నిర్మాణం రూ.283 కోట్లతో చేపట్టామన్నారు.
- ఈఎస్ఐసీ మెడికల్ కళాశాల, ఆసుపత్రి నిర్మాణానికి రూ.1438 కోట్లు, ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.663 కోట్లు, బీబీనగర్లోని ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి రూ.1366 కోట్లు, నగరంలోని 236 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు రూ.73 కోట్లు, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని హెల్దీ బేబీ షోతో పాటు 7వేల పోషణ కిట్స్ పంపిణీకి రూ.2.5 కోట్లు, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ)కి రూ.30 కోట్లు అందించామని వివరించారు.
- ఐఐటీ హైదరాబాద్కు రూ.1089 కోట్లు, 3 కేంద్ర విశ్వవిద్యాలయాలకు రూ.105 కోట్లు, సీఎస్ఐఆర్ - ఐఐసీటీలో సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్ కేంద్రం ఏర్పాటుకు రూ.10 కోట్లు, ఎన్ఐఈఎల్ఐటీ ఏర్పాటుకు రూ.5 కోట్లు అందించామన్నారు.
రూ.719 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. చర్లపల్లి, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ల అభివృద్ధికి రూ.955 కోట్లు, రైల్వే మ్యూజియం ఏర్పాటుకు రూ.40 కోట్లు ఇచ్చామన్నారు. ఎంఎంటీఎస్ రెండోదశను యాదాద్రి వరకు పొడిగించేందుకు రూ.600ల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
హెరిటేజ్ సర్క్యూట్ టూర్ అభివృద్ధికి రూ.97 కోట్లు, ట్యాంక్బండ్, గోల్కొండ కోట, ఓయూలో సౌండ్ అండ్ లైట్ షోకు రూ.57 కోట్లు, గోల్కొండ కోట అభివృద్ధికి రూ.16 కోట్లు, రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుకు రూ.25 కోట్లు, చార్మినార్ వెలుగులకు రూ.3 కోట్లు, సైన్సు మ్యూజియం ఏర్పాటుకు రూ. 233 కోట్లు కేటాయించామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే