logo

నాలుగు లోక్‌సభ స్థానాలకు 20 మంది అభ్యర్థులు

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాలకు  శనివారం 20 మంది నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.

Published : 21 Apr 2024 02:33 IST

హైదరాబాద్‌ కలెక్టర్‌కు నామపత్రం సమర్పిస్తున్న రాజేశ్‌ కుమార్‌

సికింద్రాబాద్‌, రాజేంద్రనగర్‌, కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాలకు  శనివారం 20 మంది నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. మల్కాజిగిరి నుంచి ఏడుగురు వేయగా, ఇందులో భాజపా అభ్యర్థులుగా ఈటల రాజేందర్‌, ఈటల జమున రెండో సెట్‌ సమర్పించారు. చేవెళ్ల 6, హైదరాబాద్‌ 4, సికింద్రాబాద్‌ నుంచి ముగ్గురు నామపత్రాలు దాఖలు చేశారు. హైదరాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ నేత పులిపాటి రాజేశ్‌ కుమార్‌ రిటర్నింగ్‌ అధికారి అనుదీప్‌ దురిశెట్టికి నామినేషన్‌ అందజేశారు. * కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు సంబంధించి ఒక నామినేషన్‌ దాఖలైందని ఎన్నికల అధికారి మధుకర్‌నాయక్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని