ప్రచారాస్త్రం.. పార్టీల సమాయత్తం
లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులు దరఖాస్తుల సమర్పణ వేగవంతమైంది. ఇదే సమయంలో ఉన్నంతలో ప్రస్తుతం సమావేశాలకే పరిమితమవుతున్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించడానికి అస్త్రశస్త్రాలతో సమాయత్తమవుతున్నాయి.
న్యూస్టుడే, వికారాబాద్: లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులు దరఖాస్తుల సమర్పణ వేగవంతమైంది. ఇదే సమయంలో ఉన్నంతలో ప్రస్తుతం సమావేశాలకే పరిమితమవుతున్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించడానికి అస్త్రశస్త్రాలతో సమాయత్తమవుతున్నాయి. చేవెళ్ల నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్, భారాస, భాజపాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న తీరుపై ‘న్యూస్టుడే’ కథనం.
గ్యారంటీలతో ప్రజల్లోకి కాంగ్రెస్..
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అర్హులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ బీమా పెంపు, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్కార్డుల జారీకి మంత్రిమండలి ఆమోదం, ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వ ఏర్పాట్లు వంటి అంశాలను ప్రచార అస్త్రాలుగా మలుచుకోనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ బాధ్యులతో ఇటీవల సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. పాత, కొత్త నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. లోక్సభ నియోజకవర్గ బాధ్యతలను వేం నిరంజన్రెడ్డికి అప్పగించారు.
పదేళ్ల పాలనను వివరిస్తూ భాజపా..
కాంగ్రెస్, భారాసలకు దీటుగా ప్రచారం నిర్వహించేందుకు భాజపా సమాయత్తమవుతోంది. పదేళ్లుగా కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ అందిస్తున్న పాలనతో పాటు అవినీతిని అంతం చేసేందుకు చేపడుతున్న చర్యలను వివరించి ఓట్లు అభ్యర్థించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న పాలనా సంస్కరణలు ప్రజలకు వివరిస్తున్నారు. జాతీయ నాయకులతో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను ఆహ్వానించి, సభల్లో వారి ప్రసంగాలతో ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. బూత్, శక్తి కేంద్రాలను బలోపేతం చేసే పనిని ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పూర్తి చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో ప్రధాని మోదీ ఆవశ్యకతను వివరిస్తూ ఓట్లు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రజా సమస్యలే ఎజెండాగా భారాస..
ప్రజా సమస్యలే ఎజెండాగా భారాస ప్రచారం నిర్వహిస్తోంది. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కార్యకర్తల సమావేశాలను నిర్వహించి కార్యకర్తలను భారాస సమాయత్తం చేసింది. ప్రస్తుతం మండల, గ్రామ స్థాయిలో కార్యకర్తలు, ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించి ఇంటింటికీ ప్రచారం సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశాలపై తర్ఫీదునిస్తోంది. ముఖ్యంగా శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైన తీరును ఎండగట్టాలని నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓట్లను అభ్యర్థించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
- శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికల బాధ్యులుగా వికారాబాద్కు పట్లోళ్ల కార్తీక్రెడ్డి, తాండూర్కు బైండ్ల విజయ్కుమార్, పరిగికి గట్టు రాంచందర్రావు, చేవెళ్లకు నాగేందర్గౌడ్, మహేశ్వరానికి స్వామిగౌడ్, శేరిలింగంపల్లికి నవీన్రావు, రాజేంద్రనగర్కు పుటం పురుషోత్తంలను నియమించి సమన్వయం చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్