పెద్ద హోటళ్లలోనూ.. ఇదేం కక్కుర్తి
రోడ్డు పక్కన ఆహార పదార్థాల వ్యాపారాలు నిర్వహించే తోపుడు బండ్లు, చిన్నపాటి దుకాణాల్లోనే కాదు.. పలు బడా హోటళ్లు కూడా నాసిరకం వస్తువులతో, పాచిపోయిన సాస్లతో వంటలు చేస్తున్నాయి.
గడువు తీరిన, నాసిరకం వస్తువులతో ఆహార పదార్థాల తయారీ
ఇటీవల హోటళ్లలో తనిఖీలు నిర్వహించిన అధికారులు
ఈనాడు, హైదరాబాద్: రోడ్డు పక్కన ఆహార పదార్థాల వ్యాపారాలు నిర్వహించే తోపుడు బండ్లు, చిన్నపాటి దుకాణాల్లోనే కాదు.. పలు బడా హోటళ్లు కూడా నాసిరకం వస్తువులతో, పాచిపోయిన సాస్లతో వంటలు చేస్తున్నాయి. గుర్తింపు లేని పేర్లతో, నకిలీ లైసెన్సు నంబర్లతో తయారైన తాగునీటి సీసాలను విక్రయిస్తున్నాయి. గడువు తీరిన వస్తువులను ఉపయోగించి ప్రజారోగ్యాన్ని హరిస్తున్నాయి. ఇటీవల రాజధానిలో నాలుగు రోజులపాటు ఆహార భద్రత విభాగంలోని ఫుడ్ ఇన్స్పెక్టర్లు నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో వేర్వేరు ప్రముఖ హోటళ్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. అయితే.. టాస్క్ఫోర్స్ బృందాలు తనిఖీ చేసే వరకు.. జీహెచ్ఎంసీలో పనిచేస్తోన్న 25 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. నగరవాసుల నుంచి హోటళ్లలోని దుర్భర పరిస్థితులపై వస్తోన్న ఫిర్యాదులను బల్దియా అధికారులు పట్టించుకోవడంలేదని, హోటళ్ల యజమానులతో కొందరు అధికారులు కుమ్మక్కవడంతోనే ప్రముఖ హోటళ్లలో ఏళ్లుగా తనిఖీలు జరగడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బయటపడ్డ బాగోతాలు..
వేర్వేరు ప్రాంతాల్లోని ప్రముఖ హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో టాస్క్ఫోర్స్ బృందాలు ఈ నెల 16, 17, 18, 20 తేదీల్లో తనిఖీలు చేపట్టాయి. వంట గదుల్లోని శుభ్రత, వంట మనుషుల ఆరోగ్యం, సామగ్రి నాణ్యత, ఆయా ప్యాకెట్లపై ఉన్న గడువు, తయారీ సంస్థల వివరాలు, వంటల్లో కలుపుతున్న రంగులు, రసాయనాలు, ఉపయోగించే నూనె, ఇతరత్రా పదార్థాలను క్షుణ్నంగా తనిఖీ చేశారు. నాసిరకం, గుర్తింపులేని సంస్థల పేర్లతో ఉన్న ప్యాకెట్లు, తాగునీటి సీసాలు, సాస్లు, ఇతర నాసిరకం పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నమూనాలను ప్రయోగశాలకు పంపించి..యాజమాన్యాలకు నోటీసులిచ్చారు.
- గడువు ముగిసిన రూ.4,860 విలువైన ఎండుమిర్చి సాస్, చాక్లెట్ సిరప్ను, నాసిరకంగా గుర్తించిన రూ.1,09,650 విలువైన వంట నూనెను మినర్వా హోటల్లో గుర్తించారు.
- బార్కస్లోని ఇండో అరబిక్ రెస్టారెంట్లో జరిపిన దాడుల్లో రూ.63,600 విలువైన నాసిరకం తాగునీటి సీసాలు, ఇతర పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
- జూబ్లీహిల్స్లోని బాబిలోన్ బార్లో నాసిరకానికి చెందిన రూ.42,660 విలువైన ఆల్కలిన్ నీటి సీసాలు, రూ.1,797విలువైన బ్రిటీష్ ఇంగ్లీష్ స్పాంజ్ ఫింగర్స్ ప్యాకెట్లు, రూ.7,748 విలువైన వేర్వేరు గడువు తీరిన పదార్థాలను..
- బంజారాహిల్స్లోని అట్లూరి ఫుడ్స్ లిమిటెడ్లో రూ.25,200విలువైన 40 నాసిరకం కాజు ప్యాకెట్లను, ఇతర పదార్థాలను గుర్తించామని అధికారులు తెలిపారు.
- జూబ్లీహిల్స్లోని గౌరంగ్ డిజైన్స్ ఇండియా ప్రై.లి.నుంచి రూ.6,285 విలువైన నాసిరకం మసాలాలు, మిర్చి పొడి స్వాధీనం చేసుకున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి