గెలుపే లక్ష్యం.. వెన్నంటి ఉంటాం
హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్న భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థుల విజయం కోసం వారి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు.
లోక్సభ అభ్యర్థుల కోసం కుటుంబ సభ్యుల ప్రచారం
కిషన్రెడ్డి సతీమణి కావ్యారెడ్డి
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్న భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థుల విజయం కోసం వారి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. అభ్యర్థులతోపాటు సమాంతరంగా ఆయా పార్టీల నేతలతో పర్యటిస్తున్నారు. అభ్యర్థులు బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తుంటే వారి కుటుంబ సభ్యులు ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుంటున్నారు. తమ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలంటూ మద్దతు కోరుతున్నారు. ప్రచారానికి వెళ్లినప్పుడు ఓటర్లు, ప్రజలు చెబుతున్న సమస్యలను శ్రద్ధగా వింటున్నారు. అత్యవసరంగా చేయాల్సిన వాటిని ఒక పుస్తకంలో రాసుకుంటున్నారు.
వినతులు వింటూ... ఆకట్టుకుంటూ...
గడ్డం రంజిత్రెడ్డి సతీమణి సీతారెడ్డి
చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ తరఫున గడ్డం రంజిత్రెడ్డి, సునీతా మహేందర్రెడ్డి పోటీచేస్తున్నారు. గడ్డం రంజిత్రెడ్డి భార్య జి.సీతారెడ్డి చేవెళ్ల లోక్సభ పరిధిలోని వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులతో కలిసి గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి మహిళలు, వృద్ధులను కలుసుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రైతుల వద్దకు వెళ్లి ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. మహేశ్వరం, చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్రెడ్డి స్వయంగా ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడాకారులు, వయోధికులను కలుసుకుంటున్నారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండగా... ఆమె భర్త పట్నం మహేందర్ రెడ్డి ఉప్పల్, మల్కాజిగిరి, కంటోన్మెంట్, ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను వ్యక్తిగతంగా కలుసుకుని వారితో ముమ్మరంగా ప్రచారం చేయిస్తున్నారు.
కేంద్రంలో మళ్లీ మనమే అంటూ..
ఈటల కోడలు క్షమిత
భాజపా అభ్యర్థులు కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాధవీలత పోటీచేస్తున్నారు. కిషన్రెడ్డి ప్రచార రథంలో పర్యటిస్తుండగా ఆయన సతీమణి కావ్యారెడ్డి అంబర్పేట, ముషీరాబాద్, సికింద్రాబాద్ నాంపల్లి సెగ్మెంట్లలో ఇంటింటికీ వెళ్లి కిషన్రెడ్డికి మద్దతుగా ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి సతీమణి, అపోలో ఆసుపత్రుల గ్రూప్ జేఎండీ సంగీతారెడ్డి ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లు అత్యధికంగా ఉండే శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజవర్గాల్లో ఆమె ఇంటింటికీ వెళ్తున్నారు. మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి జమున, కోడలు క్షమిత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈటల క్షమిత యువ ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ భాజపా అభ్యర్థి మాధవీలత తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మజ్లిస్ కంచుకోటలను బద్దలు చేద్దాం.. మద్దతు ఇవ్వండంటూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకు ఓటేస్తే పాతబస్తీలో మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు.
కొండా విశ్వేశ్వర్రెడ్డి సతీమణి సంగీతారెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
[ 26-07-2024]
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
[ 26-07-2024]
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
[ 26-07-2024]
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
[ 26-07-2024]
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
డివైడర్ దాటి బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
[ 26-07-2024]
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన ఓ కారు డివైడర్ దాటి అవతలివైపు మార్గంలో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. -
తాగి వాహనం నడిపిన వ్యక్తిపై ట్రాఫిక్ సీఐ జులుం
[ 26-07-2024]
మద్యం తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేసి జరిమానా విధించాలి కానీ ఓ ట్రాఫిక్ సీఐ అత్యుత్సాహంతో యువకుడిపై చేయి చేసుకున్నారు. -
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
[ 26-07-2024]
విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురు చూసే ఒలింపిక్స్కు నేడే తెరలేవనుంది. పారిస్ ఒలింపిక్స్లో పతకాల వేటకు భారత అథ్లెట్లు సిద్ధమయ్యారు. -
మహానగరికి ఊపిరి
[ 26-07-2024]
ఓ వైపు అప్పులు.. వడ్డీలు.. మరోవైపు నిలిచిన అభివృద్ధి పనులు.. గుత్తేదారుల ఆందోళనలు.. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీకి రాష్ట్ర బడ్జెట్ ఊరటనిచ్చింది. -
అంచనాలను ‘భట్టి’ కేటాయింపులు
[ 26-07-2024]
బాహ్యవలయ రహదారి వరకు భాగ్యనగరమే. ఈ ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ జిల్లా పూర్తిగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు పాక్షికంగా నగర పరిధిలోకి వస్తున్నాయి. -
ప్రాంగణాలు బురదమయం.. ప్రయాణికులకు అసౌకర్యం
[ 26-07-2024]
జిల్లాలో వారం రోజులుగా ముసురు వర్షాలు పడుతున్నాయి. వీటివల్ల ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్లు, ప్రయాణ ప్రాంగణాలు బురదమయంగా మారిపోతున్నాయి. -
సంక్షేమానికి చోటు.. అభివృద్ధికి బాట
[ 26-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి అగ్రాసం లభించింది. ఇదే సమయంలో అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించామనీ, ఆమేరకు నిధుల కేటాయింపు -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
[ 26-07-2024]
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫర్నిచర్ కర్మాగారం యజమానికి రిమాండ్
[ 26-07-2024]
జియాగూడ వెంకటేశ్వరనగర్లోని తిరుపతి ఫర్నిచర్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు మృతి చెందారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో హెల్ప్ డెస్క్
[ 26-07-2024]
రద్దీ సమయంలో యాప్ ఆధారిత క్యాబ్ వాహనాల కొరతను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత