కమలం జెండా భుజాన.. కాషాయ దండు నగరాన
లోక్సభ ఎన్నికల్లో రాజధాని పరిధిలోని నాలుగు స్థానాల్లో పాగా వేయడానికి భాజపా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
4 లోక్సభ స్థానాల్లో ప్రచారానికి అగ్ర నేతలు
అన్నింటిలో విజయానికి కార్యాచరణ
లోక్సభ ఎన్నికల్లో రాజధాని పరిధిలోని నాలుగు స్థానాల్లో పాగా వేయడానికి భాజపా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. జనానికి దగ్గరగా ఉన్న నేతలను అభ్యర్థులుగా నిలపడంతో విజయం సులభంగా సాధించాలని భావిస్తోంది. ఇదే లక్ష్యంగా పార్టీ అగ్రనేతలు హైదరాబాద్కు రాబోతున్నారు. పన్నెండు మందికిపైగా కేంద్ర మంత్రులు ఓటర్లను కలవడానికి వస్తున్నారు. ప్రధాని మోదీ ఈనెల 27న పర్యటించబోతున్నారు. మరోవైపు నలుగురు అభ్యర్థులు నెల రోజులుగా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
రాజధాని పరిధిలోకి వచ్చే సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గోషామహల్ నుంచి రాజాసింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదీ హైదరాబాద్ లోక్సభ పరిధి. నాలుగు ఎంపీ స్థానాల్లో సికింద్రాబాద్ నుంచి గత ఎన్నిల్లో కిషన్రెడ్డి ఒక్కరే గెలిచారు. ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించడంతో పాటు రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో భాజపా ఒక్క స్థానంలోనే గెలిచినా, 12 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. కొన్ని నియోజకవర్గాల్లో లక్షకుపైగా ఓట్లను దక్కించుకుంది. ఫలితంగా కొన్నిచోట్ల కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. తద్వారా కమలానికి బలమైన ఓటు బ్యాంకు ఉందని స్పష్టమైంది. ఇప్పుడు దీన్నే ఉపయోగించుకోవాలన్నది పార్టీ అగ్రనేతల ఆలోచన. అయోధ్య రామాలయాన్ని ప్రారంభించిన తరువాత రాజధాని పరిధిలో పార్టీకి అనుకూల వాతావరణం ఉందని కమలనాథులు చెబుతున్నారు. మహా నగరం పరిధిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ఉన్నారు. వీరంతా అనుకూలంగా ఉంటారన్న ఉద్దేశంతో నగర నేతలు ప్రధానంగా దృష్టిసారించారు. సంబంధిత వర్గం అగ్రనేతలను దిల్లీనుంచి రప్పించి వారితో మాట్లాడించడానికి ఏర్పాట్లుచేస్తున్నారు. నగరంలో ఉన్నత విద్యావంతులు, మేధావులతో ప్రధాన మోదీ ఈనెల 27న ప్రత్యేకంగా మాట్లాడబోతున్నారు. ఇటీవల మాజీ సైనికులతో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సమావేశానికి నిర్ణయించినా ఆయన హాజరుకాలేదు. మరోసారి వచ్చి ప్రత్యేకంగా మాట్లాడతారని చెబుతున్నారు. భాజపా అనుబంధ సంస్థలు కూడా రంగంలోకి దిగి పెద్దఎత్తున ప్రచారంలో పాలుపంచుకుంటున్నాయి. మొత్తంగా ఏ వర్గాన్నీ వదలకుండా భాజపా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. ఇకనుంచి ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో అగ్రనేతలతో ప్రచారానికి కార్యాచరణ రూపొందించింది.
సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా మరోసారి కిషన్రెడ్డి బరిలో నిలిచారు. ఎమ్మెల్యేగా మూడుసార్లు, ఎంపీగా ఒక్కసారి గెలిచిన అనుభవంతో మరోసారి గెలవడానికి అన్ని వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. అన్ని కాలనీల్లో పర్యటిస్తూ ఓటర్లతో మమేకం కావడానికి ప్రయత్నిస్తున్నారు. కేంద మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండటంతో మిగిలిన లోక్సభ నియోజకవర్గాల ప్రచారంలో పాల్గొంటున్నా ప్రధానంగా సికింద్రాబాద్పైనే దృష్టి సారించారు.
మల్కాజిగిరి నుంచి బరిలో ఉన్న ఈటల రాజేందర్ అన్ని శక్తులను ఒడ్డి పోరాడుతున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెల్చిన ఈటల మొన్నటి శాసనసభ ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలోనే మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లభించడంతో, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. అగ్రనేతలతో భారీగా ప్రచారానికి ప్రణాళిక రూపొందించుకున్నారు.
చేవెళ్ల అభ్యర్థిగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి బరిలో నిలిచారు. ఇక్కడ ఆయన మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా నియోజకవర్గంలోని పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలతో గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసుకున్నారు. మూడు నెలలుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన భార్య, అపోలో జేఎండీ కొండా సంగీతారెడ్డి కూడా పెద్దఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడా అన్ని ప్రాంతాల్లో అగ్రనేతలతో ప్రచారం చేయించనున్నారు.
హైదరాబాద్ అభ్యర్థిగా మాధవీలత పోటీ చేస్తున్నారు. ఎంఐఎం అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారు. చాలా ఏళ్లుగా ఇక్కడ ఎంఐఎం విజయం సాధిస్తోంది. ఈ పార్టీకి గట్టిపోటీ ఇవ్వాలనే లక్ష్యంతో, ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేసిన మాధవీలతను భాజపా బరిలో నిలిపింది. తొలుత ఇక్కడి ప్రధాన ఓటర్ల మనసు గెల్చుకోవాలన్న ఆలోచనలో పార్టీ ఉంది. దీనికి అనుగుణంగానే ఆమె ప్రచారం పెద్దఎత్తున సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి