నీటి విక్రయం.. నాణ్యత ప్రశ్నార్థకం
జిల్లాలో నాణ్యతలేని తాగు నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమార్కులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు.
లీటరు నీటిలో ఉండాల్సిన మినరల్స్ మిల్లీ గ్రాముల్లో ఇలా..: నైట్రేట్ 45, ఐరన్ 0.3, సల్ఫేట్ 200, సీఏ సీవోటు 200, డిసాల్వ్డ్ సాలిడ్లు 500, క్యాల్షియం 75, క్లోరైడ్ 250, ఫ్లోరైడ్ 1.0.
న్యూస్టుడే, తాండూరు, పరిగి:
జిల్లాలో నాణ్యతలేని తాగు నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమార్కులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. అధికారులు తనిఖీలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఇష్టానుసారంగా శుద్ధి చేస్తున్నారు
ప్రస్తుత వేసవిలో చాలా మంది శుద్ధి చేసిన నీటిని తాగడానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో గ్రామాలే కాకుండా తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి పట్టణాల్లోని ప్లాంట్లలో విక్రయిస్తున్న నీటికి డిమాండ్ ఏర్పడింది. దీన్ని అనుకూలంగా మార్చుకున్న ప్లాంట్ల యజమానులు ఇష్టాను సారంగా శుద్ధి చేసి విక్రయిస్తున్నారు.
ఒక్కో లీటరు నీటిలో మినరల్స్ ఉండాల్సినవి ఉండటంలేదు. ఇదే నీటిని ప్లాంట్ల వద్ద విక్రయించి ప్రతి 20 లీటర్ల వద్ద రూ.10 నుంచి రూ.15 వసూలు చేస్తున్నారు. ఆటోలో తీసికెళ్లి ఇళ్ల వద్ద విక్రయిస్తే అదే 20 లీటర్ల వద్ద రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారు. మొదటి, రెండో అంతస్తులో ఉండే ఇళ్లల్లోకి తీసుకెళ్లాలంటే రూ.25 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇలా రోజూ వారీగా వేల కొద్ది క్యాన్లలో నింపిన నాణ్యతా ప్రమాణాలు లేని నీటిని విక్రయించి యజమానులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు.
ల్యాబ్లతో సంబంధం లేకుండానే..
నీటిని విక్రయిస్తున్న ప్లాంట్ల యజమానులు నాణ్యతా ప్రమాణాల పరీక్షకు సంబంధించి ల్యాబ్, పరికరాలను ఏర్పాటు చేసుకోవడం విస్మరించారు. భారత ప్రమాణాల సంస్థ నిబంధనల మేరకు ప్లాంట్లలో మైక్రో బయాలజిస్ట్, కెమిస్టు ఉండాలి. ప్లాంట్లలో స్టీలు డ్రమ్ములనే వినియోగించాలి. పైపులైన్లు అంతర్గతంగా ఉండాలి. ప్రతి ప్లాంటులో ఏసీ కచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం కొన సాగుతున్న అధికశాతం ప్లాంట్లలో ఎక్కడా ఇవి లేవు.
అనుమతుల్లేని ప్లాంటు 500కుపైనే కొనసాగింపు
జిల్లా వ్యాప్తంగా అనధికారిక లెక్కల ప్రకారం 500కు పైగా నీటి శుద్ధి ప్లాంట్లు కొనసాగుతున్నాయి. ఏ ఒక్కటీ నిబంధనలు పాటించడంలేదని అధికారులే వివరిస్తున్నారు. ఇలాంటి ప్లాంటు నుంచి శుభ్రత, నాణ్యత లేకుండా విక్రయించే నీటిని తాగుతున్న ప్రజలు అనుకోకుండా అనారోగ్యాలకు గురైతే బాధ్యులెవరనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.
- బల్లులు, ఇతర కీటకాలు పాకులాడే చిన్న పాటి గదులు, రేకుల షెడ్లలో యజమానులు ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. భూగర్భం నుంచి నేరుగా తోడిన నీటికి పెద్దగా పరిజ్ఞానం లేకుండానే రసాయ మందులను కలిపి శుద్ధి చేస్తున్నారు. తర్వాత నిర్ణీత ప్రమాణాల మేరకు శుభ్రం చేయని ప్లాస్టిక్ ట్యాంకుల్లో నిల్వ చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఇలాంటి నీటినే తాగుతున్నారు.
- జిల్లావ్యాప్తంగా కేవలం రెండు ప్లాంట్లకు మాత్రమే అన్నిరకాల అనుమతులు ఉండడం విశేషం. ఇటీవల అనుమతుల్లేని నీటి శుద్ధి ప్లాంట్లను జప్తు చేస్తామని జిల్లా భూగర్భ వనరుల శాఖ అధికారిణి దీపారెడ్డి ప్రకటించినా ఆ దిశగా చర్యలు లేకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే