పొరుగు నేతలకే పెద్దపీట
గత రెండు నెలల్లో భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున నేతలు చేరిపోయారు. దీంతో రాజధానిలో అనేక నియోజకవర్గాల్లో బలపడ్డామని నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉండటంతో ఆందోళన సైతం వ్యక్తమవుతోంది.
ఆవేదనలో కాంగ్రెస్లో సీనియర్ నాయకులు
ఎన్నికలపై ప్రభావం చూపుతుందేమోనని ఆందోళన
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: గత రెండు నెలల్లో భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున నేతలు చేరిపోయారు. దీంతో రాజధానిలో అనేక నియోజకవర్గాల్లో బలపడ్డామని నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉండటంతో ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. కొత్త, పాత నేతల మధ్య వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. ఇది ఎన్నికల్లో ఎక్కడ ప్రభావం చూపుతుందోననే ఆందోళన సీనియర్ నేతల నుంచి వ్యక్తమవుతోంది. నేతల మధ్య సమన్వయం తీసుకురావడానికి అగ్రనేతలు సంబంధిత నియోజకవర్గ నేతలతో చర్చిస్తున్నారు.
బలం పెంచుకోవడానికి..
రాజధాని పరిధిలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనంగా ఉంది. లోక్సభ ఎన్నికల పోలింగ్కు ముందే మొన్నటివరకు అధికార పక్షంగా ఉన్న భారాస నుంచి కీలక నేతలను చేర్చుకోవడం మొదలుపెట్టారు. సుమారు 50 మందికి పైగా నాయకులు హస్తం కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థలో 12 మంది కార్పొరేటర్లు ఆ పార్టీలో చేరారు. నగరం చుట్టపక్కల ఉన్న నగరపాలక సంస్థ, పురపాలక సంఘాల స్థానిక ప్రతినిధులు చాలామంది హస్తం గూటికి చేరారు.
అసంతృప్తి..
సుమారు 20 ఏళ్లుగా కాంగ్రెస్లోనే ఉంటూ ఎన్నో కష్టనష్టాలు ఓర్చిన సీనియర్ నేతలను కొన్నిచోట్ల పక్కన పెట్టి భారాస నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తుండటంతో పూర్వ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కొత్త నాయకులు చేరితే తాము ఎందుకూ కొరగాకుండా పోతామని ఆవేదన చెందుతున్నారు. దీనిపై ఇప్పటికే కొంతమంది స్థానిక నేతలు కాంగ్రెస్ అగ్రనేతలకు ఫిర్యాదులు చేశారు. ఈ పరిణామంతో లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ఎక్కడ దెబ్బతగులుతుందోననే ఆందోళన కనిపిస్తోంది.
- ఇటీవలే పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ టికెట్ ఆశించిన పూర్వ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఖైరతాబాద్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి రెండుసార్లు పోటీ చేసిన విజయారెడ్డికి దానంకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అలాంటి ఆయనకు టికెట్ ఇవ్వడంతో ఆగ్రహంతో ఉన్నారు. వీరిద్దరి మధ్య ఇప్పటికీ సఖ్యత లేదని చెబుతున్నారు. దీని సరిదిద్దే ప్రయత్నాలూ చేయకపోవడం గమనార్హం.
- కొంతమంది భారాస కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్లో చేరగా.. డివిజన్లలో అధికారపక్ష నేతలుగా చలామణి అవుతున్నారు. గతంలో అక్కడ పోటీ చేసి ఓడిపోయిన నేతలకు ఇది మింగుడుపడటం లేదు.
- మొన్న జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గణేష్ను రాత్రి రాత్రికి కాంగ్రెస్లో చేర్చుకొని ఉప ఎన్నికల్లో బరిలో నిలిపారు. దీంతో అక్కడ ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న నాయకులు కంగుతిన్నారు. గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటి చేసి ఓడిపోయిన డీబీ దేవేందర్ ఆగ్రహంతో ఉన్నారు. శ్రీ గణేష్కు కాకుండా అసలైన వారికి టికెట్ ఇవ్వాలని కోరినా అగ్రనేతలు పట్టించుకోలేదు.
- గతంలో అనేక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన గజ్వేల్ భరత్ ఇక్కడి అయిదో వార్డు నుంచి కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. ఈలోగా భారాస నాయకుడు తేలుకుంట సతీష్కుమార్ను పార్టీలో చేర్చుకుని అదే వార్డు నుంచి పోటీ చేస్తారని సీనియర్ నేతలు ప్రకటించారు. దీంతో భరత్ ఆగ్రహంతో ఉన్నారు. ఇలా అనేకమంది నేతలు తమ అవకాశాలను ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు తన్నుకుపోతున్నారంటూ ఆవేదనతో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్