logo

కేఏ పాల్‌పై చీటింగ్‌ కేసు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కేఏ పాల్‌పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యేగా పోటీకి పార్టీ టికెట్‌ ఇస్తానని పాల్‌ రూ.57 లక్షలు తీసుకున్నారని రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడకు చెందిన ఎస్‌.కిరణ్‌కుమార్‌ గురువారం రాత్రి పంజాగుట్ట పోలీసులు ఫిర్యాదు చేశారు.

Published : 18 May 2024 01:23 IST

పంజాగుట్ట, న్యూస్‌టుడే: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కేఏ పాల్‌పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యేగా పోటీకి పార్టీ టికెట్‌ ఇస్తానని పాల్‌ రూ.57 లక్షలు తీసుకున్నారని రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడకు చెందిన ఎస్‌.కిరణ్‌కుమార్‌ గురువారం రాత్రి పంజాగుట్ట పోలీసులు ఫిర్యాదు చేశారు. రూ.30 లక్షలు ఆన్‌లైన్‌ ద్వారా, మిగిలిన సొమ్ము దశల వారీగా ఇచ్చానని, టికెట్‌ ఇవ్వకపోగా డబ్బులూ ఇవ్వడం లేదని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని