logo

మోసంతో మూడో పెళ్లిపై ఫిర్యాదు

ముందుగా రెండు పెళ్లిళ్లయిన విషయం చెప్పకుండా తనను కూడా పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ బాధితురాలు సరూర్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించింది.

Updated : 18 May 2024 10:30 IST

దిల్‌సుఖ్‌నగర్, న్యూస్‌టుడే: ముందుగా రెండు పెళ్లిళ్లయిన విషయం చెప్పకుండా తనను కూడా పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ బాధితురాలు సరూర్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించింది. శుక్రవారం భర్త ఇంటి ముందు ఆమె నిరసనకు దిగింది. ఇన్‌స్పెక్టరు సైదిరెడ్డి తెలిపిన వివరాలివీ.. దిల్‌సుఖ్‌నగర్‌ పీఅండ్‌టీ కాలనీకి చెందిన మధు నారాయణగూడలో స్పీచ్‌ థెరపిస్టుగా పనిచేస్తాడు. అక్కడే పరిచయమైన లావణ్యను పెళ్లి చేసుకున్నాడు. మధుకు గతంలోనే పెళ్లి జరిగింది. భార్య మృతి చెందగా ఆమె సోదరినే రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయాలేవీ చెప్పకుండా లావణ్యను మూడో వివాహం చేసుకుని సనత్‌నగర్‌లో కాపురం పెట్టాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న మధు కోసం గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని