logo

వారణాసిలో ప్రచారానికి భాజపా బృందం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి  నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేంద్రమోదీకి మద్దతుగా  ప్రచారం నిర్వహించేందుకు 10 మంది సభ్యులతో కూడిన భాజపా బృందాన్ని ఎంపిక చేశారు.

Published : 19 May 2024 03:35 IST

గీతామూర్తితో జయశ్రీ, పరిణీత 

కాచిగూడ, న్యూస్‌టుడే: ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి  నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేంద్రమోదీకి మద్దతుగా  ప్రచారం నిర్వహించేందుకు 10 మంది సభ్యులతో కూడిన భాజపా బృందాన్ని ఎంపిక చేశారు. ఇందులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఆ పార్టీ ఎన్నికల కమిటీ సభ్యురాలు, గీతామూర్తి తదితరులు ఉన్నారు.  శనివారం కాచిగూడ నుంచి భాజపా రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ,  మెదక్‌ ఇన్‌ఛార్జి కరణం పరిణీతలతో కలిసి బయలుదేరిన సందర్భంగా గీతామూర్తి మాట్లాడారు. వారణాసిలోని తెలుగు ప్రజలను కలిసి మోదీకి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నామని తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని