స్థానిక సంస్థలపై కాంగ్రెస్ గురి
నార్సింగి మున్సిపాలిటీ ఛైర్పర్సన్ దారుగుపల్లి రేఖ, వైస్ఛైర్మన్ వెంకటేశ్యాదవ్(భారాస)లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు నెగ్గాయి. వీరిపై మెజార్టీ సభ్యులు అందజేసిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు మున్సిపల్ కార్యాలయంలో శనివారం రాజేంద్రనగర్ ఆర్డీవో కె.వెంకట్రెడ్డి
నార్సింగి మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం
అవిశ్వాస తీర్మానం నెగ్గిన అనంతరం కాంగ్రెస్ కౌన్సిలర్లు, నేతలు
ఈనాడు, హైదరాబాద్, బోడుప్పల్, నార్సింగి, న్యూస్టుడే: నార్సింగి మున్సిపాలిటీ ఛైర్పర్సన్ దారుగుపల్లి రేఖ, వైస్ఛైర్మన్ వెంకటేశ్యాదవ్(భారాస)లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు నెగ్గాయి. వీరిపై మెజార్టీ సభ్యులు అందజేసిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు మున్సిపల్ కార్యాలయంలో శనివారం రాజేంద్రనగర్ ఆర్డీవో కె.వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 18మంది సభ్యులున్న మున్సిపల్ కౌన్సిల్లో పార్టీలకు అతీతంగా 12 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానం కోరుతూ కలెక్టర్కు నోటీసు అందజేసిన విషయం తెలిసిందే. కలెక్టర్ ఆదేశాల మేరకు జరిగిన సమావేశంలో అవిశ్వాస తీర్మానం అందజేసిన కౌన్సిలర్లతో పాటు మరో ఇద్దరు భారాస సభ్యులు యాదమ్మ, పత్తి శ్రీకాంత్ హాజరై ఓటింగ్లో పాల్గొన్నారు. 14మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అనంతరం వైస్ఛైర్మన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఛైర్పర్సన్, వైస్ఛైర్మన్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు నెగ్గిన విషయాన్ని వివరిస్తూ కలెక్టర్కు నివేదిక సమర్పిస్తామని ఆర్డీవో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలుంటాయన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి, మేనేజరు యోగేష్ పాల్గొన్నారు.
శివారును హస్తగతం చేసుకోవాలని..
లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే శివార్లలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించారు. భారాస, భాజపాల కౌన్సిలర్లు, కార్పొరేటర్లను చేర్చుకుంటూ ప్రస్తుత పాలక వర్గాలను దిగిపోవాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారు. శివారులో 21 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లుండగా... ఒకటి, రెండు మున్సిపాలిటీల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఛైర్మన్లుగా ఉండేవారు.. వారు కూడా ఇతర పార్టీల మద్దతుతోనే కొనసాగుతున్నారు. గతేడాది కొందరు భారాస కౌన్సిలర్లు, కార్పొరేటర్లు.. మేయర్లు, ఛైర్మన్లుగా కొనసాగుతున్న సొంతపార్టీ నాయకులపైనే అవిశ్వాస తీర్మానాలు ప్రతిపాదించి గద్దెదింపారు. డిసెంబరులో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పరిస్థితి మారిపోయింది. ఐదారు మున్సిపాలిటీలు, రెండు, మూడు కార్పొరేషన్లు మినహా అన్నింటిలోనూ భారాస కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరి.. అవిశ్వాస తీర్మానాలతో భారాసకు చెందిన మేయర్లు, ఛైర్మన్లను గద్దెదించారు.భారాస, భాజపాల నుంచి ఇంకా కొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నా భారాస ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారు. ఎలాగైనా వారిని చేర్చుకునేందుకు భవిష్యత్తులో కీలక పదవులు ఇస్తామంటూ హామీలు ఇస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?