‘నేలబిడ్డల’పై.. నిప్పులు చిమ్మిన నింగి
ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ..
యాలాల మండలంలో పిడుగుపాటుకు ముగ్గురి మృత్యువాత
మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు
శ్రీనివాస్ మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదన
న్యూస్టుడే, తాండూరు, యాలాల: ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. ఏపుగా ఎదిగేలా చేస్తాడు. పంట చేతికి వస్తుందంటే సంతోషానికి అవధులుండవు.. కోత కోయాలి.. కాంటాకు తరలించాలి.. కుటుంబానికి అండగా నిలవాలన్న తపనే. పొలమే వారి బలం.. వారి ఆనందం.. ఆ సంతోషంతోనే పొలం బాట పట్టిన ముగ్గురు కర్షకులను విధి చిన్న చూపు చూసింది. మృత్యురూపంలో వచ్చిన పిడుగు వారిని కబళించింది. ఆ మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. యాలాల మండలం జుంటుపల్లి, బెన్నూరు గ్రామాల్లో ఆదివారం జరిగిన ఈ హృదయ విదారకమైన ఘటన అందరిని శోక సంద్రంలో ముంచింది.
అందరి బాధ్యత మోస్తూ..
జుంటుపల్లికి చెందిన యువరైతు మంగలి శ్రీనివాస్(30) బీఈడీ వరకు చదువుకున్నాడు. కుటుంబానికి అండగా నిలవాలని సేద్యం బాట పట్టాడు. నాలుగు ఎకరాల భూమితో పాటు, మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేసి, ఆశాజనకమైన దిగుబడులు సాధిస్తూ వస్తున్నాడు. తండ్రి వెంకటయ్య అనారోగ్యానికి గురికావడంతో వైద్యం చేయించడమే కాకుండా, నలుగురు చెల్లెళ్లలో ముగ్గురి వివాహం చేశాడు. మరో చెల్లెలు పదోతరగతి వరకు చదువుకుని తల్లి సత్యమ్మకు ఆసరాగా ఉంటోంది. కుటుంబ పరిస్థితి మెరుగవుతుందన్న సమయంలోనే గతేడాది తండ్రి చనిపోయాడు. ఒకవైపు తల్లి, చెల్లిని ఓదారుస్తూనే పంటలు పండిస్తున్నాడు. యాసంగి వడ్లను విక్రయించి ఆ డబ్బుతో చెల్లి పెళ్లి చేయాలని అనుకున్నాడు. ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్లడంతో.. శ్రీనివాస లే నాయనా అంటూ తల్లి సత్యమ్మ రోదన మిన్నంటింది.
పొలమే సర్వస్వం: జుంటుపల్లి గ్రామానికి చెందిన కొనింటి లక్ష్మప్ప మూడు ఎకరాల భూమిని సాగు చేస్తున్నాడు. పొలం, కుటుంబం సర్వస్వంగా జీవించాడు. ఆయనకు భార్య అనసూజ, ఇద్దరు కుమారులున్నారు. ఇటీవలే పెద్దకుమారుడు శివప్రసాద్ పదోతరగతి పూర్తి చేశాడు. చిన్నకుమారుడు ఆదిత్య మూడో తరగతి చదువుతున్నాడు. తండ్రి ఇక లేడని తెలిసి ఆ చిన్నారుల హృదయాలు తల్లడిల్లాయి. ఇక తమకు ఎవరు దిక్కని ఆయన భార్య అనసూజ గుండెలవిసేలా శోకంలో మునిగిపోయింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే
శ్రీనివాస్, లక్ష్మప్ప, వెంకప్ప కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. జరిగిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.6లక్షల చొప్పున సహాయం కోసం ప్రతిపాదనలు పంపించాలని ఆర్డీవోను కోరినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా డబ్బులను అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
భార్య ఎదుటే విగతజీవిగా
బెన్నూరు గ్రామానికి చెందిన గొల్లవెంకప్పకు 60 ఏళ్లు పైబడినా కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. ఆయన భార్య ఎల్లమ్మ, కుమారుడు మొగులప్ప, కోడలు ఉన్నారు. మూడు ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. కుమారుడు కూలీ పనులు చేస్తూ తండ్రికి చేదోడుగా ఉంటున్నాడు. వానాకాలంలో పంటల సాగుకు మేకల ఎరువును చల్లేందుకు భార్యతో కలిసి పొలానికి వెళ్లాడు. కుప్పగా ఉన్న ఎరువును భార్య తట్టలో నింపి ఇస్తుంటే, వెంకప్ప చల్లుతుండగానే దారుణం జరిగిపోయింది. కళ్లెదుటే భర్త విగత జీవిగా మారిపోవడాన్ని చూసి ఆమె తట్టుకోలేక పోయింది. అయ్యో దేవుడా..నా దేవున్ని తీసుకుపోయావా అంటూ రోదించడం అందరిని కదిలించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు