ప్రపంచంలోనే అరుదు.. బాంబే బ్లడ్ గ్రూపు
బాంబే బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ అని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు.
నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప
దాతలతో డైరెక్టర్ బీరప్ప చిత్రంలో డాక్టర్ స్వాతి కులకర్ణి, శాంతివీర్ ఉప్పిన్, బి.శాంతి, వినయ్శెట్టి, వైద్యులు
నిమ్స్, న్యూస్టుడే: బాంబే బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ అని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. ఆదివారం ఆస్పత్రిలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునో హెమటాలజీ(ఎన్ఐఐహెచ్), థింక్ ఫౌండేషన్, నిమ్స్ ఆద్వర్యంలో జరిగిన సమావేశానికి ఐసీఎంఆర్ కన్సల్టెంట్ డాక్టర్ స్వాతికులకర్ణితో పాటు బీరప్ప హాజరయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అరుదైన బాంబే రక్త వర్గంపై ప్రజలకు లోతుగా అవగాహన కల్పించేందుకు నిమ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. స్వాతి కులకర్ణి మాట్లాడుతూ.. దేశంలో ఈగ్రూప్ వారు ఎంతమంది ఉన్నారో గుర్తించేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందుకు థింక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వినయ్శెట్టి కృషిచేస్తున్నట్లు చెప్పారు. నిమ్స్ ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ శాంతివీర్ ఉప్పిన్, రక్తనిధి కేంద్ర విభాగాధిపతి బి.శాంతి, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్, వైద్యులు మురళీమహేశ్, టెక్నికల్ స్టాఫ్ బిడుగు శేఖర్, మల్లిక్, వివిధ ప్రాంతాల రక్తదాతలు పాల్గొన్నారు.
చాలా మందికి అర్ధం కాదు: వెంకటరమణ, ఎల్బీనగర్.
బాంబే బ్లడ్ గ్రూప్ అంటే 90 శాతం మందికి తెలియదు. నేను రక్త పరీక్ష చేయించుకున్న సమయంలో ఓ పాజిటివ్ గ్రూప్ అని చెప్పారు. తర్వాత ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకుంటే బాంబే గ్రూప్ అని స్పష్టంగా తెలిసింది. బంజారాహిల్స్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో నా గ్రూప్ రక్తం కలిగిన ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చాను.
30 ఏళ్ల వరకు తెలియదు: రాజ సుబ్బయ్య, మధురానగర్
నాకు బాంబే బ్లడ్ గ్రూప్ ఉందనే విషయం 30 ఏళ్ల వరకు తెలియదు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్నప్పడు ఓ పాజిటివ్ అని చెప్పారు. సీఎంసీ ఆస్పత్రిలో మరోసారి పరీక్ష చేయించుకుంటే స్పష్టంగా తెలిసింది. ఇలాంటి బ్లడ్ గ్రూప్ ఉంటుందా అని ఆశ్చర్యపోయా. నేను ఇప్పటి వరకు బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న 35 మందికి రక్తదానం చేశా.
ఆనందం, బాధ రెండూ..: ఎస్.కె. మహేశ్కర్, విశ్రాంత శాస్త్రవేత
అరుదైన రక్త గ్రూప్ ఉన్నన్నట్లు 30 ఏళ్ల క్రితమే తెలిసింది. ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో పరీక్ష చేయిచుకున్న సమయంలో గుర్తించారు. వెంటనే మా కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేయగా, అందరివీ సాధారణ గ్రూప్లేనని నిర్ధారించారు. కొవిడ్ సమయంలో అత్యవసరంగా నాకు రక్తం కావాల్సి వచ్చినా దొరకలేదు. వైద్యుల కృషి, శరీరం సహకరించడంతో కోలుకున్నాను. ఈ గ్రూప్ ఉన్నవారు తక్కువ మంది ఉన్నట్లు తెలిసింది. ఓ వైపు సంతోషం ఉన్నా.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకదనే బాధ ఉంది.
రెండేళ్లలో 16 మందిని గుర్తించాం
- డా.శాంతి, నిమ్స్ రక్తనిధి కేంద్రం విభాగాధిపతి
అత్యంత అరుదుగా ఉండే బాంబే బ్లడ్ గ్రూప్పై నగరంలో అవగాహన కల్పిస్తున్నాం. నగరంలోని పలు డయాగ్నోస్టిక్, రక్తనిధి కేంద్రాల నిర్వహకులతో మాట్లాడి ఈ గ్రూప్ ఎలా పరీక్షిస్తే స్పష్టంగా తెలుస్తుందో తెలియజేస్తున్నాం. గడిచిన రెండేళ్లలో ఇలా 16 మందిని గుర్తించాం. ఈ గ్రూప్ ఉన్న వారు ఇతర గ్రూప్ వారికి ఇవ్వొద్దు. ఈ గ్రూప్ వారికి రక్తం కావాల్సి వస్తే ఏ ఇతర గ్రూప్ రక్తం సరిపడదు. బాంబే బ్లడ్ మాత్రమే ఎక్కించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే