ఉద్యానాలు.. ఆక్రమించేశారు
హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన రూ.వంద కోట్ల విలువైన మూడెకరాల స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేశారు.
తప్పుడు పత్రాలతో రూ.100 కోట్ల విలువైన భూములు సొంతం
అపార్ట్మెంట్ల నిర్మాణానికి ప్రయత్నాలు.. అడ్డుకున్న అధికారులు
క్లబ్హౌస్ నిర్మాణంలో మున్సిపాలిటీ బోర్డు ఏర్పాటుచేస్తున్న దుండిగల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, అధికారులు
ఈనాడు,హైదరాబాద్, దుండిగల్, న్యూస్టుడే: హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన రూ.వంద కోట్ల విలువైన మూడెకరాల స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేశారు. వాటిని విడగొట్టి అపార్ట్మెంట్లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అపార్ట్మెంట్లలో నివాసముండే వారి కోసం క్లబ్హౌస్, ఈత కొలను నిర్మాణానికి ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలో పిల్లర్లు నిర్మిస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణానికి హెచ్ఎండీఎ నుంచి అనుమతులు కూడా పొందారు. ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్న 3 ఎకరాల భూములు దుండిగల్ సమీపంలోని బాహ్య వలయ రహదారికి సమీపంలో ఉండడంతో వేగంగా విక్రయాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానికులు మున్సిపాలిటీ అధికారులకు వివరించగా.. వారు స్పందించి చర్యలు చేపట్టారు. ఆ భూముల్లో మున్సిపాలిటీకి చెందిన భూములంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఆక్రమించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నామని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.
పార్కు స్థలాల్లో ఆక్రమణలు
గ్రామ పంచాయతీ లేఅవుట్లను అధ్యయనం చేసి...
దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన ఉద్యానాల భూములను సొంతం చేసుకునేందుకు కొందరు ప్రైవేటు వ్యక్తులు గ్రామ పంచాయతీ లేఅవుట్లను అధ్యయనం చేశారు. దుండిగల్ మున్సిపాలిటీ ఏర్పడకముందు గ్రామ పంచాయతీ అనుమతులు ఇచ్చిన లేఅవుట్లను పరిశీలించారు. వాటి సర్వే నంబర్లను జాగ్రత్తగా చూసుకున్నారు. ఇరవై ఏళ్ల క్రితం కేవీఆర్ లేఅవుట్ పేరుతో 54 ఎకరాల్లో ప్లాట్లు ఏర్పాటు చేశారు. ప్రజాఅవసరాల కోసం లేఅవుట్లోని వేర్వేరు ప్రాంతాల్లో మూడెకరాలను గ్రామ పంచాయతీకి ఇచ్చారు. ఐదేళ్ల క్రితం దుండిగల్ మున్సిపాలిటీ ఏర్పడడంతో ఈ మూడెకరాలు మున్సిపాలిటీ ఆధీనంలోకి వచ్చాయి. అప్పట్లో ఉన్న అధికారులు వీటిని పట్టించుకోలేదని తెలుసుకున్న ప్రైవేటు వ్యక్తులు.. ఆ లేఅవుట్ వేసిన వ్యక్తి.. తమకు స్థలాలు విక్రయించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఒకట్రెండేళ్లపాటు మౌనంగా ఉన్న అనంతరం పార్కు స్థలాలను సొంతం చేసుకొని కంచెలు నిర్మించారు.
హెచ్ఎండీఏ అనుమతులతో నిర్మాణాలు
ఉద్యానాల కోసం ఆక్రమించిన భూముల్లో అపార్ట్మెంట్ల నిర్మాణానికి అనుమతులు తీసుకుంటే దుండిగల్ మున్సిపల్ అధికారులకు అనుమానం వస్తుందన్న ముందస్తు అంచనాతో.. స్థలాన్ని ఎక్కువగా చూపించి బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు అనుమతులివ్వాలంటూ హెచ్ఎండీఎకు మూడేళ్ల క్రితం దరఖాస్తు చేశారు. రిజిస్ట్రేషన్ పత్రాలు, సర్వే నంబర్లు సక్రమంగా ఉన్నాయా.. లేదా? అని పరిశీలించకుండా హెచ్ఎండీఏ అధికారులు అనుమతులిచ్చేశారు. అనుమతులు వచ్చిన కొద్దిరోజులకు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కేవీఆర్ లేఅవుట్లో వేర్వేరు చోట్ల ఉన్న ఉద్యానాల స్థలాల్లో నిర్మాణాలు చేపట్టారు. అపార్ట్మెంట్లు నిర్మించనున్న స్థలాల్లో ముందుగా ఒకచోట రేకుల షెడ్డు నిర్మాణం.. మరోచోట క్లబ్ హౌస్.. ఇంకోచోట ప్రహారీలను నిర్మించారు. ఒకచోట బహుళ అంతస్తుల భవనం నిర్మించారన్న అనుమానంతో మున్సిపల్ అధికారులు డిజిటల్ సర్వే చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి