రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
హైదరాబాద్ మెట్రోలో సగటున ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారి నుంచి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు టికెట్ల ద్వారా రూ.కోటిన్నర ఆదాయం సమకూరుతోంది.
నిర్వహణ పోను సంస్థకు మిగులే..
ఈనాడు,హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోలో సగటున ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారి నుంచి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు టికెట్ల ద్వారా రూ.కోటిన్నర ఆదాయం సమకూరుతోంది. సగటున ఒక్కో ప్రయాణికుడు రూ.35 చెల్లించి మెట్రోలో వెళుతుండగా.. సగటు ప్రయాణ దూరం(12.5 కి.మీ.) కూడా తక్కువగానే ఉంది. ప్రయాణికుల నుంచి ఛార్జీలే కాకుండా ప్రకటనలు, స్టేషన్లు, మాల్స్ లీజింగ్ ద్వారా కూడా ఆదాయం సమకూరుతోంది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆపరేషన్స్, ఇతరత్రా కలిపి రూ.703.20 కోట్ల ఆదాయం వచ్చింది. మెట్రో నిర్వహణ వ్యయం రూ.429 కోట్లుగా సంస్థ పేర్కొంది. నికరంగా చూస్తే లాభమే కదా? మరి నష్టాలు ఎక్కడివి అంటారా..? మెట్రోరైలు, మాల్స్ నిర్మాణానికి రూ.12,500 కోట్లపైన ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ కొంత ఈక్విటీ, మిగిలింది బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు తెచ్చింది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి.. ఏటా రుణాలపై వడ్డీనే రూ.1273 కోట్లు అని తన ఆర్థిక నివేదికలో పేర్కొంది. అయితే, ఈ వడ్డీ భారాన్ని 2024 ఆర్థిక సంవత్సరంలో కొంతమేర తగ్గించుకుంది.
మాల్స్, భూముల సబ్లీజుపై.. గత ఆర్థిక సంవత్సరం రూ.900 కోట్ల వడ్డీలేని రుణాన్ని ప్రభుత్వం ఇచ్చింది. రాయదుర్గంలోని 15 ఎకరాల భూమిని రూ.1045 కోట్లకు మానిటైజ్ చేసింది. ఇందులో గతేడాది రూ.512 కోట్లు ఎల్ అండ్టీకి చేరాయి. ఎర్రమంజిల్, పంజాగుట్ట, హైటెక్సిటీ మాల్స్ను సబ్లైసెన్స్ ద్వారా రూ.3 వేల కోట్లకు మరో సంస్థతో ఒప్పందం చేసుకుంది. వీటన్నింటిని ద్వారా రూ.5 వేల కోట్ల రుణభారాన్ని దించుకునే దిశగా సర్దుబాట్లు చేసింది. ఫలితంగా వడ్డీ భారం గణనీయంగా తగ్గనుంది.
ఆదాయం పెరగాలంటే..
- ప్రయాణికుల సంఖ్య మరింతగా పెరగాలి. రద్దీని తట్టుకునేందుకు అదనపు మెట్రోరైళ్లు కావాలి. ప్రస్తుతమున్న 3 కోచ్లను 6కు పెంచాలి.
- ప్రయాణికుల వేళల్ని ప్రయోగాత్మకంగా సోమ, శుక్రవారం రోజు మాత్రమే పెంచారు. ప్రజల డిమాండ్ మేరకు ప్రతిరోజూ పెంచిన వేళల ప్రకారమే నడపాలి. కుదిరితే అర్ధరాత్రి 12 గంటలకు చివరి మెట్రోరైలు అందుబాటులో ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
[ 26-07-2024]
విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురు చూసే ఒలింపిక్స్కు నేడే తెరలేవనుంది. పారిస్ ఒలింపిక్స్లో పతకాల వేటకు భారత అథ్లెట్లు సిద్ధమయ్యారు. -
మహానగరికి ఊపిరి
[ 26-07-2024]
ఓ వైపు అప్పులు.. వడ్డీలు.. మరోవైపు నిలిచిన అభివృద్ధి పనులు.. గుత్తేదారుల ఆందోళనలు.. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీకి రాష్ట్ర బడ్జెట్ ఊరటనిచ్చింది. -
అంచనాలను ‘భట్టి’ కేటాయింపులు
[ 26-07-2024]
బాహ్యవలయ రహదారి వరకు భాగ్యనగరమే. ఈ ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ జిల్లా పూర్తిగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు పాక్షికంగా నగర పరిధిలోకి వస్తున్నాయి. -
ప్రాంగణాలు బురదమయం.. ప్రయాణికులకు అసౌకర్యం
[ 26-07-2024]
జిల్లాలో వారం రోజులుగా ముసురు వర్షాలు పడుతున్నాయి. వీటివల్ల ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్లు, ప్రయాణ ప్రాంగణాలు బురదమయంగా మారిపోతున్నాయి. -
సంక్షేమానికి చోటు.. అభివృద్ధికి బాట
[ 26-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి అగ్రాసం లభించింది. ఇదే సమయంలో అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించామనీ, ఆమేరకు నిధుల కేటాయింపు -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
[ 26-07-2024]
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫర్నిచర్ కర్మాగారం యజమానికి రిమాండ్
[ 26-07-2024]
జియాగూడ వెంకటేశ్వరనగర్లోని తిరుపతి ఫర్నిచర్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు మృతి చెందారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో హెల్ప్ డెస్క్
[ 26-07-2024]
రద్దీ సమయంలో యాప్ ఆధారిత క్యాబ్ వాహనాల కొరతను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్