వరద కదలక.. దారి వదలక
వర్షాకాలం ఇంకా మొదలవలేదు. అడపాదడపా కురిసే అకాల వర్షాలకే నగరంలో పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. జనజీవనం స్తంభించిపోతోంది. గంటల తరబడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
వ్యర్థాలతో మ్యాన్హోళ్లు మూసుకుపోయి కాలనీల మునక
విధులు బహిష్కరించిన ఐఆర్టీ, డీసిల్టింగ్ బృందాలు
ఈనాడు, హైదరాబాద్
వర్షాకాలం ఇంకా మొదలవలేదు. అడపాదడపా కురిసే అకాల వర్షాలకే నగరంలో పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. జనజీవనం స్తంభించిపోతోంది. గంటల తరబడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రోడ్లపై పేరుకుపోయిన వ్యర్థాలు మ్యాన్హోళ్లను కప్పేస్తుండగా.. నాలాల్లోని పూడిక మట్టి కూడా వరద ప్రవాహానికి అడ్డంకిగా మారుతోంది. దానికితోడు..మ్యాన్హోళ్లపై వ్యర్థాలను తొలగించి వరదను దారి మళ్లించాల్సిన పూడికతీత బృందాలు, సత్వర మరమ్మతు బృందాలు(ఐఆర్టీ) బిల్లులు చెల్లించట్లేదన్న కారణంతో విధులకు దూరంగా ఉండటం ప్రజలకు శాపంగా మారింది. దాంతో.. ఇంజినీరింగ్ అధికారులపై విమర్శలొస్తున్నాయి.
కమిషనర్ హెచ్చరించడంతో..
కొన్నేళ్లుగా జీహెచ్ఎంసీ ఏడాది పొడవునా నాలాల పూడికతీత, రోడ్లకు మరమ్మతు పనులను చేపడుతోంది. అందుకోసం రెండు రకాల బృందాలను నియమిస్తోంది. నవంబరు 1 నుంచి మే 31 మధ్య ఐఆర్టీ బృందాలు పనిచేస్తాయి. డివిజన్కు ఒకటి చొప్పున 150 బృందాలు, మరో 10-16 అదనపు బృందాలను ఇంజినీర్లు జోన్లవారీగా నియమిస్తారు. డీసీఎం లేదా టాటా మినీ ట్రాలీ వాహనంలో కంకర, ఇసుక, తారు మిశ్రమం పనిముట్లతో నలుగురు కార్మికులు, ఓ డ్రైవరుతో ఆయా బృందాలు పనిచేయాల్సి ఉంటుంది. వీరు కాకుండా.. ఏడాది పొడవునా పూడికతీత కోసం జోన్లవారీగా బృందాలు పనిచేస్తుంటాయి. అయితే.. ఆయా బృందాలు కాగితాలపై పక్కాగా, క్షేత్రస్థాయిలో మొక్కుబడిగా పనిచేస్తుంటాయి. ఇదేంటని అడిగితే.. ఏడాదికో, ఏడాదిన్నరకో బిల్లులు ఇస్తారని, దాని వల్ల అరకొర సిబ్బందితో పనిచేస్తుంటామని గుత్తేదారులు చెబుతుంటారు. కమీషన్లు, ఇతర వ్యవహారాలతో ఇంజినీర్లు కూడా ఆయా బృందాలను ప్రోత్సహిస్తుంటారు. దీంతో రోడ్లపై గుంతలు అలాగే ఉంటున్నాయి. పూడికతీత జరగట్లేదు. సెంటీ మీటరు వర్షపాతం కురిసినా.. కిలోమీటర్ల మేర రోడ్లపై నీరు నిలుస్తోంది. గుత్తేదారుల సంఘం నిర్ణయంతో ఐఆర్టీ బృందాలు ఈనెల 18న పనులను ఆపేశాయి. గత రెండ్రోజులుగా కురిసిన వర్షంతో గచ్చిబౌలి, లింగంపల్లి, బండ్లగూడ, తదితర ప్రాంతాల్లో మ్యాన్హోళ్లు పూడిపోయి.. వరదంతా జనావాసాలను ముంచెత్తింది. ఘటనపై బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ ఇంజినీర్లపై, జోనల్ కమిషనర్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేసి, పనులు ఆపేసిన గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆమేరకు శేరిలింగంపల్లి జడ్సీ స్నేహ శబరీష్ గుత్తేదారుపై చర్యలకు ఆదేశిస్తూ ఉత్తర్వు జారీ చేశారు.
జూన్ 1 నుంచి వర్షాకాల బృందాలు..
ఐఆర్టీ బృందాల కాంట్రాక్టు మే 31తో ముగియనుండగా, జూన్ 1 నుంచి అక్టోబరు నెలాఖరు వరకు వర్షాకాల అత్యవసర బృందాలను రంగంలోకి దించేందుకు జీహెచ్ఎంసీ టెండర్లు పిలిచింది. రూ.36.98కోట్లతో 64 సంచార బృందాలు, 104 మినీ అత్యవసర బృందాలు, 160 స్టాటిక్ బృందాలతో పని చేయించనున్నట్లు బల్దియా వెల్లడించింది. ఆయా బృందాలు 24గంటల పాటు అందుబాటులో ఉంటాయని, అలాగే.. ప్రతి చెరువుకు ఓ ఇంజినీరును బాధ్యులుగా నియమించామని ఇంజినీరింగ్ విభాగం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
[ 26-07-2024]
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
[ 26-07-2024]
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
డివైడర్ దాటి బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
[ 26-07-2024]
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన ఓ కారు డివైడర్ దాటి అవతలివైపు మార్గంలో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. -
తాగి వాహనం నడిపిన వ్యక్తిపై ట్రాఫిక్ సీఐ జులుం
[ 26-07-2024]
మద్యం తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేసి జరిమానా విధించాలి కానీ ఓ ట్రాఫిక్ సీఐ అత్యుత్సాహంతో యువకుడిపై చేయి చేసుకున్నారు. -
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
[ 26-07-2024]
విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురు చూసే ఒలింపిక్స్కు నేడే తెరలేవనుంది. పారిస్ ఒలింపిక్స్లో పతకాల వేటకు భారత అథ్లెట్లు సిద్ధమయ్యారు. -
మహానగరికి ఊపిరి
[ 26-07-2024]
ఓ వైపు అప్పులు.. వడ్డీలు.. మరోవైపు నిలిచిన అభివృద్ధి పనులు.. గుత్తేదారుల ఆందోళనలు.. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీకి రాష్ట్ర బడ్జెట్ ఊరటనిచ్చింది. -
అంచనాలను ‘భట్టి’ కేటాయింపులు
[ 26-07-2024]
బాహ్యవలయ రహదారి వరకు భాగ్యనగరమే. ఈ ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ జిల్లా పూర్తిగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు పాక్షికంగా నగర పరిధిలోకి వస్తున్నాయి. -
ప్రాంగణాలు బురదమయం.. ప్రయాణికులకు అసౌకర్యం
[ 26-07-2024]
జిల్లాలో వారం రోజులుగా ముసురు వర్షాలు పడుతున్నాయి. వీటివల్ల ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్లు, ప్రయాణ ప్రాంగణాలు బురదమయంగా మారిపోతున్నాయి. -
సంక్షేమానికి చోటు.. అభివృద్ధికి బాట
[ 26-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి అగ్రాసం లభించింది. ఇదే సమయంలో అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించామనీ, ఆమేరకు నిధుల కేటాయింపు -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
[ 26-07-2024]
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫర్నిచర్ కర్మాగారం యజమానికి రిమాండ్
[ 26-07-2024]
జియాగూడ వెంకటేశ్వరనగర్లోని తిరుపతి ఫర్నిచర్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు మృతి చెందారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో హెల్ప్ డెస్క్
[ 26-07-2024]
రద్దీ సమయంలో యాప్ ఆధారిత క్యాబ్ వాహనాల కొరతను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్