logo

భర్తను వేధిస్తున్న భార్యపై కేసు

భర్తను ఎంతోకాలంగా వేధిస్తూ.. చివరకు కూరగాయల కత్తితో దాడికి పాల్పడిన మహిళపై అల్వాల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 21 May 2024 03:50 IST

కూరగాయల కత్తితో దాడి చేసినట్లు ఫిర్యాదు

అల్వాల్‌: భర్తను ఎంతోకాలంగా వేధిస్తూ.. చివరకు కూరగాయల కత్తితో దాడికి పాల్పడిన మహిళపై అల్వాల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన టెమూజియన్‌ కుముజకు.. అదే జిల్లా రాజోలుకు చెందిన లక్ష్మీగౌతమితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అల్వాల్‌లోని సూర్యనగర్‌లో కాపురం ప్రారంభించారు. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్త మల్లారెడ్డి కళాశాలలో సహాయ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఆమె అదే కళాశాలలో కంప్యూటర్‌ ల్యాబ్‌లో సహాయకురాలిగా పనిచేస్తోంది. పెళ్లయిననాటి నుంచి భార్య.. అత్తింటి ఆస్తులు, డబ్బు వ్యామోహంతో భర్తను శారీరకంగా మానసికంగా వేధిస్తోంది. అత్తమామలను వేధించడంతో రెండు వారాల క్రితం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కక్ష పెంచుకొని శనివారం కూరగాయల కత్తితో దాడిచేసిందని బాధితుడు ఫిర్యాదు చేశాడు.  పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. తనపైనే భర్త దాడి చేశాడంటూ లక్ష్మీగౌతమి పోలీసులను ఆశ్రయించింది. విచారించి కేసు నమోదు చేస్తామని ఎస్సై శంకర్‌ తెలిపారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని