మాజీ ఉద్యోగుల సొమ్ము స్వాహా
అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్లో పనిచేస్తూ ఆ సంస్థకు చెందిన రూ.3.2 కోట్లను స్వాహా చేసిన వ్యక్తిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు.
అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ ఉద్యోగి చేతివాటం
ఈనాడు, హైదరాబాద్: అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్లో పనిచేస్తూ ఆ సంస్థకు చెందిన రూ.3.2 కోట్లను స్వాహా చేసిన వ్యక్తిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. సంస్థలో పనిచేసి రాజీనామా చేసిన మాజీ ఉద్యోగులకు బకాయిల చెల్లింపుల పేరిట నిధులు పక్కదారి పట్టించిన నిందితుడు ఈ నగదును తన బంధువులు, స్నేహితులకు చెందిన 50 బ్యాంకు ఖాతాలకు మళ్లించారు. మోసాన్ని గుర్తించిన అమెజాన్ సంస్థ సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ)లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్, ఏసీపీ హుస్సేని నాయుడు తెలిపారు.
హోదాను అడ్డుపెట్టుకుని.. సరూర్నగర్కు చెందిన ఎం.వెంకటేశ్వర్లు గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లాలోని అమెజాన్ క్యాంపస్లో 2015లో ఉద్యోగంలో చేరారు. సీనియర్ ఫైనాన్షియల్ ఆపరేషనల్ అనలిస్ట్ హోదాలో అమెజాన్ ఇండియా ఉద్యోగుల పేరోల్, సంస్థ నుంచి బయటకు వెళ్లిన వారి బకాయిల చెల్లింపులకు సంబంధించి సెటిల్మెంట్ వ్యవహారాలు పర్యవేక్షించేవారు. ఈ క్రమంలోనే సంస్థను వీడిన మాజీ ఉద్యోగుల్లో కొందరు దీర్ఘకాలంగా తమ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి దరఖాస్తు/క్లెయిము చేసుకోలేదని వెంకటేశ్వర్లు గుర్తించారు. బకాయిలు చెల్లించాలంటూ మాజీ ఉద్యోగుల పేర్లతో తనే దరఖాస్తు/క్లెయిము చేయించారు.
184 మంది పేర్లతో.. నిందితుడు వెంకటేశ్వర్లు 2016- 2023 మధ్య 184 మంది పేర్లతో నకిలీ అభ్యర్థనలు పెట్టి మొత్తం రూ.3.22 కోట్లు దారి మళ్లించారు. ఈ సొమ్మంతా తన బంధువులు, స్నేహితులకు చెందిన 50 బ్యాంకు ఖాతాల్లో జమ చేయించారు. ఇటీవల అమెజాన్ అంతర్గత దర్యాప్తు బృందాలు ఆర్థిక లావాదేవీలను నిశితంగా పరిశీలించగా కొన్ని అవకతవకలు జరిగినట్లు గుర్తించాయి. 50 బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బంతా జమైందని, ఇందులో ఒకే పేరుతో ఎక్కువ ఖాతాలు ఉన్నట్లు తేల్చాయి. 184 మంది మాజీ ఉద్యోగులకు సెటిల్ చేపినా అదే సంఖ్యలో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమవకుండా కేవలం 50 ఖాతాలకే మళ్లడంతో మోసం జరిగినట్లు తేలింది. వెంకటేశ్వర్లు మాజీ ఉద్యోగుల బకాయిల సెటిల్మెంటుకు నకిలీ దరఖాస్తులు చేయించి చెల్లింపులు చేసినట్లు తేలింది. బయటి వ్యక్తులతో కలిసి ఈ సొమ్మంతా పక్కదారి పట్టించారని వెల్లడైంది. ఈ అవకతవకలపై వెంకటేశ్వర్లును వివరణ కోరే ప్రయత్నం చేస్తున్న సమయంలో హఠాత్తుగా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో లెక్కింపునకు సర్వం సిద్ధం.. కౌంటింగ్లో 10 వేల మంది సిబ్బంది
[ 03-06-2024]
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. -
తల్లి మృతి.. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీకి మధ్యంతర బెయిల్
[ 03-06-2024]
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. -
అభ్యర్థులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్రెడ్డి
[ 03-06-2024]
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో కాంగ్రెస్ అభ్యర్థులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) సూచించారు. -
తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు
[ 03-06-2024]
తెలంగాణలోని నాగర్కర్నూల్, గద్వాల్, నల్గొండలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయి. -
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
[ 03-06-2024]
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు (Telangana Polycet Results) విడుదలయ్యాయి. -
హైదరాబాద్లో గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి
[ 03-06-2024]
హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లి పోలీసు స్టేషన్ పరిధి బాబుల్ రెడ్డి నగర్లో విషాదం చోటు చేసుకుంది. -
కత్తితో దాడి చేసినా.. హైదరాబాద్లో దొంగలను ప్రతిఘటించిన యువకుడు
[ 03-06-2024]
బైక్పై వచ్చి సెల్ఫోన్ తీసుకొని ఉడాయించడానికి యత్నించిన ఇద్దరు ఆగంతకులను ఓ యువకుడు ధైర్య సాహసాలతో పట్టుకున్నాడు. -
2 నిమిషాల దూరానికి గంటపాటు ట్రాఫిక్లోనే..
[ 03-06-2024]
వారాంతం వస్తే చాలు కొత్తగూడ-బొటానికల్ గార్డెన్ రోడ్డులో ప్రయాణించాలంటే ట్రాఫిక్ నరకం చవిచూడాల్సి వస్తోంది. కేవలం 2 నిమిషాల దూరానికి గంటపాటు ట్రాఫిక్ వలయం చేధించాల్సి వస్తోంది. -
మూసారాంబాగ్ చౌరస్తాలో అగ్నిప్రమాదం
[ 03-06-2024]
నగరంలోని మూసారాంబాగ్ చౌరస్తాలో అగ్నిప్రమాదం జరిగింది. రెడ్రోజ్ బేకరీలో భారీగా మంటలు చెలరేగాయి. -
అందరి చూపు.. ఆంధ్రా వైపు.. ఎన్నికల ఫలితాలపై హైదరాబాద్లో చర్చలు..
[ 03-06-2024]
ఏ ఇద్దరు కలిసినా ఆంధ్రాలో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంపైనే చర్చ. ఆదివారం కదా అని ఎవరి ఇంటికి వెళ్లినా గెలుపు అవకాశాలపై చర్చలు. ఎవరికీ అందని ఓటరు నాడి పట్టుకోలేక ఫలితాల కోసం తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. -
కోటి గొంతుకలు ఒక్కటై.. పల్లవించె తెలంగాణమై...
[ 03-06-2024]
ప్రత్యేక రాష్ట్ర నినాదం.. అమరుల త్యాగం.. ఉద్యమకారుల పోరాటం.. వెరసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆ స్వప్నం నెరవేరి పదేండ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం నిర్వహించిన దశాబ్ది సంబరాలు అంబరాన్నంటాయి. -
అమ్మో.. హోటల్ భోజనమా!
[ 03-06-2024]
కొందరు నిర్వాహకుల నిర్లక్ష్యం.. హోటల్లో భోజనం అంటేనే భయపడేలా చేస్తోంది. కనీస ప్రమాణాలు పాటించకుండా, పరిశుభ్రతను గాలికొదిలేసి నిల్వ ఉంచి బూజు పట్టిన వంటకాలను వినియోగదారులకు వడ్డిస్తున్నారు. -
బైకు రేసులకు బ్రేకులు
[ 03-06-2024]
రాయదుర్గం టీహబ్ రోడ్లలో బైకు రేసులతో హల్చల్ చేస్తున్న బైకర్లపై రాయదుర్గం పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వారాంతాల్లో అర్ధరాత్రి బైకులతో తెల్లవార్లూ రేసులు, -
అవతరణ సంబురం.. అంతా పరవశం
[ 03-06-2024]
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఆదివారం జిల్లా అంతటా ఘనంగా జరిగాయి. ఊరు, వాడ, పల్లె, పట్నం అనే తేడా లేకుండా చిన్నా, పెద్దా అందరూ సంబురాలు జరిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జెడా వందనం నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు. -
రేపటితో ఉత్కంఠకు తెర
[ 03-06-2024]
లోక్సభ ఓట్ల లెక్కింపునకు కౌంట్డౌన్ మొదలైంది. మరో 24 గంటల్లో పార్టీల, అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. రాజధాని పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ స్థానాలకు మంగళవారం కౌంటింగ్ జరగనుంది. -
కోడ్ ముగియగానే సున్నా బిల్లులు
[ 03-06-2024]
రంగారెడ్డి జోన్ పరిధిలో అర్హులైన విద్యుత్తు వినియోగదారులకు ఈ నెల నుంచే గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియగానే 6వ తేదీ నుంచి బిల్లులు జారీ చేయాలని డిస్కం నిర్ణయించింది. -
ఏప్రిల్లో ఎత్తులకు.. మేలో దిగువకు
[ 03-06-2024]
ఐటీ, ఆకాశహర్మ్యాలకు నిలయంగా మారిన రంగారెడ్డి జోన్ పరిధిలో ఏప్రిల్ నెలలో డిమాండ్ అధికంగా నమోదైంది. మార్చి నుంచి మే నెల వరకు గరిష్ఠ విద్యుత్తు డిమాండ్, సగటు డిమాండ్, -
ఉత్సాహంగా సైకిల్ ర్యాలీలు
[ 03-06-2024]
ప్రపంచ బై సైకిల్ దినోత్సవాన్ని (జూన్ 3) పురస్కరించుకొని ఆదివారం సైక్లింగ్ కమ్యూనిటీ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. నానక్రామ్గూడ, నార్సింగి, -
ఉరుములు, మెరుపులతో అకాల వర్షం
[ 03-06-2024]
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం ఆదివారం సాయంత్రం జిల్లాలోని ధారూర్, బషీరాబాద్, వికారాబాద్, తాండూరు, పెద్దేముల్ మండలాల్లో కురిసింది. -
చేవెళ్లలో ఎవరిదో విజయం?
[ 03-06-2024]
సార్వత్రిక ఫలితాలకు సమయం దగ్గరకొచ్చేసింది. ఇంకా 24 గంటలు గడిస్తే చాలు. విజేతలెవరో తెలిసిపోతుంది. కానీ అప్పటిదాకా నేతల్లో ఉత్కంఠ. చేవెళ్ల ఎంపీ స్థానం పరిధిలోకి వచ్చే జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. -
నవీన్ కుమార్రెడ్డి గెలుపుతో భారాసలో జోష్
[ 03-06-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భారాస విజయం సాధించడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. గత శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో గద్వాల, అలంపూర్లో మాత్రమే ఆ పార్టీ గెలుపొందింది. -
ఎన్టీఆర్ విశిష్ట పురస్కార ప్రదానం
[ 03-06-2024]
తెలుగు జాతి కీర్తి, ప్రతిష్ఠలను ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయులు ఎన్టీఆర్ అని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి కీర్తించారు. -
ఇద్దరిని బలిగొన్న నీటిట్యాంకర్
[ 03-06-2024]
సంతోషంగా నగరాన్ని తిలకించేందుకు వచ్చిన సందర్శకుల్లో ఇద్దరిని వాటర్ ట్యాంకర్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించిన ఘటన ఇది. నార్సింగి ఇన్స్పెక్టర్ హరిక్రిష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
ఈతకు వెళ్లి యువకుడి మృతి
[ 03-06-2024]
క్వారీ గుంతలో ఈత కొట్టడానికి వెళ్లి నీట మునిగి యువకుడు మృతి చెందాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టారెడ్డిపేటలో ఉంటున్న పల్లం అరుణ్(22) హెచ్పీ గోదాంలో సిలిండర్ల డెలివరీ బాయ్. -
‘బీమా బైపాస్ సర్జరీతో సమస్యలు స్వల్పం’
[ 03-06-2024]
బీమా బైపాస్ శస్త్రచికిత్సతో(బైలటేరియల్ ఇంటర్నల్ మమ్మరీ ఆర్టరీ-బీఐఎంఏ) అనారోగ్య సమస్యలు స్వల్పంగా ఉంటాయని, ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం.. -
హోటల్లో ఉరేసుకుని.. సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణం
[ 03-06-2024]
హోటల్ గదిలో ఉరేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్రెడ్డి, ఎస్సై రవికుమార్లు తెలిపిన వివరాల ప్రకారం. -
భార్య కాపురానికి రావడం లేదని.. భర్త ఆత్మహత్య
[ 03-06-2024]
భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో లెక్కింపునకు సర్వం సిద్ధం.. కౌంటింగ్లో 10 వేల మంది సిబ్బంది
-
రేవ్పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టు..
-
ఎస్బీఐ @ ₹8 లక్షల కోట్లు.. తొలి ప్రభుత్వరంగ సంస్థగా అవతరణ
-
భార్య గెలవాలని.. హీరో పొర్లు దండాలు: వీడియో వైరల్
-
మామిడి కాయల బస్తాల్లో తరలిస్తున్న గంజాయి పట్టివేత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM