గాబరా పెడుతూ.. నాసివి అంటగడుతూ..
తొలకరి ఇంకా ప్రారంభం కాలేదు. అప్పుడే కొందరు విత్తన వ్యాపారులు అన్నదాతలను పరుగులు పెట్టిస్తున్నారు. పత్తి విత్తనాల కోసం రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని కృత్రిమ కొరతకు తెర తీస్తున్నారు.
పత్తి రైతుకు పొంచి ఉన్న ముప్పు
ఖరీఫ్కు ముందే మార్కెట్లో కృత్రిమ కొరత
పత్తి విత్తనాలు నాటుతున్న కూలీలు (పాత చిత్రం)
నూస్టుడే, పరిగి, వికారాబాద్: తొలకరి ఇంకా ప్రారంభం కాలేదు. అప్పుడే కొందరు విత్తన వ్యాపారులు అన్నదాతలను పరుగులు పెట్టిస్తున్నారు. పత్తి విత్తనాల కోసం రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని కృత్రిమ కొరతకు తెర తీస్తున్నారు. పేరెన్నిక గల కంపెనీల విత్తనాలు దొరకడం లేదని ముందుగానే కొని దగ్గరుంచుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో అమాయక రైతులు విత్తనం నాసి రకమా, నాణ్యత కలిగిందా అనే విషయం కూడా గమనించలేక కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు అప్రమత్తమై తనిఖీలు ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని పేర్కొంటూ ‘న్యూస్టుడే’ కథనం.
మద్దతు ధర కలిసి వస్తుందని ఆశ
నాలుగేళ్ల అనుభవాల దృష్ట్యా ఈ వానాకాలం సీజన్లో అత్యధికంగా పత్తి పంట వేయడం వైపే జిల్లా రైతులు మొగ్గు చూపుతున్నారు. పత్తి క్వింటాలు ప్రభుత్వ మద్దతు ధర రూ.6,080 ఉండటం, బహిరంగ విపణిలో ధర రూ.6,500 పైచిలుకు పలకడంతో అధిక శాతం రైతులు పత్తి సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. 2022లో జిల్లాలో దిగుబడి తగ్గినా గరిష్ఠంగా పత్తి క్వింటాలుకు రూ.9,500 అమ్ముడుపోయింది.
పొంచిఉన్న బీటీ -3 బెడద
రైతుకు కావాల్సినవి లభించకపోవడంతో బీటీ -3 విత్తనాల బెడద పొంచి ఉంది. కలుపు పెద్దగా ఉండదని పురుగు మందుల ఖర్చులు తగ్గుతాయని ప్రచారం చేయడంతో గతేడాది కర్నూలు, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతం నుంచి కూడా వివిధ గ్రామాలకు పంపిణీ అయ్యాయి.
అసలు రూ.864.. విక్రయం.. రూ.2,000
జిలాలలో ఒక్కో ప్యాకెట్ పత్తి విత్తన ధర వాస్తవానికి రూ.864 ఉండగా రూ.1500 నుంచి రెండువేలకు పైగా విక్రయిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ డివిజన్ల పరిధిలో 523 మందికి విత్తన లైసెన్సులు ఉన్నాయి.
పట్టుకుంటున్నా కనిపించని మార్పు
అధిక ధరలకు పత్తి విత్తనాలు అమ్మడం, కొన్నిచోట్ల నాసిరకం విక్రయించడంతో అధికారులు తనిఖీల్లో ప్రతిసారీ కేసులు నమోదవుతున్నాయి. జిల్లా వ్యవసాయ శాఖకు దౌల్తాబాద్, కొడంగల్్, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ ప్రాంతాల్లో పట్టుబడిన నాసిరకం విత్తన ఉదంతాలే ఇందుకు తాజా ఉదాహరణ. సుమారు రూ.36లక్షల విలువ చేస్తే రూ.23క్వింటాళ్ల నాసిరకం పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నా మార్పు రావడంలేదు.
- కొన్ని కంపెనీలకు చెందిన విత్తనాల పట్ల రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వ్యాపారులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పల్లెల్లో ఇది జోరుగా సాగుతోంది.
అనుమతులు రద్దు చేస్తాం
-గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి.
గతంలో కంటే ఈసారి అధిక విస్తీర్ణంలో పత్తి, కంది పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం. నాసిరకం విత్తనాలు విక్రయిస్తే వ్యాపారుల లైసెన్సును రద్దు చేస్తాం. ప్రస్తుతం 1.10లక్షల విత్తనాలు అందుబాటులో ఉంచాం. జిల్లాలోని నాలుగు డివిజన్లలో డివిజన్కు ఒకటి చొప్పున ఇంటర్నల్ స్క్వాడ్ బృందాలు కూడా పనిచేస్తున్నాయి. రైతులు సైతం మెలకువతో మెలగాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల