వర్షపు నీటినీ తాగొచ్చు
నగరంలో కురుస్తున్న వాన నీటిలో కొంతైనా భూమిలోకి ఇంకించినా.. ఫిల్టర్ చేసి వాడుకున్నా.. నగరవాసులకు నీటి కష్టాలే ఉండవు. నగరంలో సరాసరి వర్షపాతం 850 మిల్లీమీటర్లు. హెచ్ఎండీఏ పరిధిలో 7,200 చదరపు కిలోమీటర్ల మేరకు ఏటా కురుస్తున్న వాన నీళ్లు 15 టీఎంసీలకు సమానమని నిపుణులు చెబుతున్నారు.
వెయ్యి చ.మీ.లో 85 వేల లీటర్లు ఆదా
స్లాబ్పై నుంచి వచ్చే వాన నీటి గొట్టానికి అమర్చిన ఫిల్టర్, సంపులో పడుతున్న నీరు
ఈనాడు, హైదరాబాద్: నగరంలో కురుస్తున్న వాన నీటిలో కొంతైనా భూమిలోకి ఇంకించినా.. ఫిల్టర్ చేసి వాడుకున్నా.. నగరవాసులకు నీటి కష్టాలే ఉండవు. నగరంలో సరాసరి వర్షపాతం 850 మిల్లీమీటర్లు. హెచ్ఎండీఏ పరిధిలో 7,200 చదరపు కిలోమీటర్ల మేరకు ఏటా కురుస్తున్న వాన నీళ్లు 15 టీఎంసీలకు సమానమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో 5శాతం కూడా భూమిలోకి ఇంకించడం, అవసరాలకు వాడుకోవడం లేదని పేర్కొంటున్నారు. ఆలోచన ఉండాలనే కానీ.. ప్రతి వర్షపు చుక్కనూ ఒడిసి పట్టవచ్చు. భూమిలోకి ఇంకించడమే కాకుండా.. ఫిల్టర్ చేసి వంటకు, తాగడానికీ వాడుకోవచ్చు. వాక్ ఫర్ వాటర్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.కరుణాకర్రెడ్డి కర్మన్ఘాట్లోని తన కార్యాలయంలో ఈ విధానాన్ని అమలు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నగరంలో చాలామంది ఇలానే వాననీటితో లబ్ధిపొందుతున్నారని తెలిపారు.
అతి తక్కువ ఖర్చుతోనే..
ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటి సంరక్షణకు అతి తక్కువ ఖర్చుతోనే ఏర్పాటు చేసుకోవచ్చు. ఇళ్లు, అపార్ట్మెంట్లపై పడే వర్షపు నీటిని కిందికి పంపే పైపులకు సంపు ప్రాంతంలో చిన్న ఫిల్టర్ పెట్టి సంపులోకి మళ్లించాలి. ఫిల్టర్ ఖరీదు రూ.3 వేలతోపాటు ప్లంబర్ ఖర్చులు మాత్రమే చెల్లించాలి. వాన నీళ్లు అత్యంత స్వచ్ఛమైనవి. డాబాపై పడిన తర్వాత అందులోకి వ్యర్థాలు చేరుతాయి. వాటిని ఫిల్టర్ వడబోసి.. స్వచ్ఛమైన నీటిని సంపులోకి పంపుతుంది. తర్వాత సంపులో ఒకటి, రెండు క్లోరిన్ మాత్రలు కలిపి ఇంట్లో తాగడానికి, వంటకు ఉపయోగించవచ్చునని కరుణాకర్రెడ్డి తెలిపారు. తొలుత 5 నిమిషాలు వర్షపు నీటిని సంపులోకి కాకుండా బయటకు విడిచి పెట్టడంతో ఏదైనా చెత్త ఉంటే పూర్తిగా పోతుంది. తర్వాత సంపులోకి మళ్లించాలి.
భారీగా వాన నీటి ఆదా..
ఏటా నగరంలో 850 మిల్లీమీటర్ల వరకు వాన కురుస్తుంది. ఈ లెక్కన ఒక చదరపు మీటరు స్థలంలో ఏటా 850లీటర్ల వర్షపు నీరు చేరుతుంది. అదే వెయ్యి చదరపు మీటర్ల ఇంటి పైకప్పుపై ఏటా 85వేల లీటర్ల వరకు వాన నీటిని ఆదా చేయవచ్చు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మణికొండ, నానన్రాంగూడ, గచ్చిబౌలి, మియాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సనత్నగర్ ప్రాంతాల్లో 33 వేల బోర్లు ఎండిపోయినట్లు జలమండలి గుర్తించింది. ఇందులో సగం ఇళ్లల్లో వర్షపు నీటి సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోలేదని గుర్తించింది.
ఏడాదంతా బోర్లు ఎండకుండా..
- ఎం.కరుణాకర్రెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షుడు, వాక్ ఫర్ వాటర్ సంస్థ
ఈ విధానంతో ఇళ్లు, కాలనీల్లో వర్షపు నీటిని ఆదా చేయచ్చు. పార్కులు, కాలనీల్లోని ఖాళీ స్థలాల్లో ఇంకుడు గుంతలు తవ్వి వాన నీటిని వాటిలోకి మళ్లించడం ద్వారా బోర్లు ఇంకే పరిస్థితి ఉండదు. బోరుకు కొంత దూరంలో ఇంజక్షన్వెల్ తవ్వి అందులోకి ఈ విధానంలో వర్షపు నీటిని మళ్లించడం ద్వారా ఏడాది అంతా బోర్లు ఇంకిపోవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ