జూలో జత కలిసే
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూపార్కులోని పెద్దపులులు నాలుగేళ్ల తర్వాత జత కలిశాయి. కేటాయించిన స్థలంతో పోలిస్తే వాటి సంతతి ఎక్కువ అవడంతో కేంద్ర జూ అథారిటీ(సీజెడ్ఏ) అప్పట్లో ఆంక్షలు విధించింది.
నాలుగేళ్ల తర్వాత సింహాలు, పులులకు తోడు
త్వరలో ఒంటరి జీవులకూ..
ఈనాడు, హైదరాబాద్, చార్మినార్, న్యూస్టుడే
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూపార్కులోని పెద్దపులులు నాలుగేళ్ల తర్వాత జత కలిశాయి. కేటాయించిన స్థలంతో పోలిస్తే వాటి సంతతి ఎక్కువ అవడంతో కేంద్ర జూ అథారిటీ(సీజెడ్ఏ) అప్పట్లో ఆంక్షలు విధించింది. కొన్నాళ్లపాటు వాటిని సంపర్కానికి దూరంగా ఉంచాలని సూచించడంతో.. జూ అధికారులు ఆడ, మగ జీవాలను వేర్వేరుగా ఉంచారు. ఈ క్రమంలో కొన్ని చనిపోవడం, కొన్నింటిని ఇతర జూలకు పంపించడంతో కొత్త సంతానానికి అనుకూల పరిస్థితులొచ్చాయి. దీంతో ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న పలు జంతువులు, పక్షులకు తోడు తీసుకొచ్చే ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు.
2 నెలల్లో పులి కూనలు: జూ పార్కులో ప్రస్తుతం 18 రాయల్ బెంగాల్ పెద్దపులులున్నాయి. వాటిలో తెల్ల పెద్దపులులు కూడా ఉన్నాయి. 4 నెలల క్రితం సంతతి వృద్ధిపై ఆంక్షలను ఎత్తేయగా 2 పులులు ఇటీవల గర్భం దాల్చాయి. 2 మాసాల్లో పులికూనలు రానున్నాయి.
నిశాచర జీవులకు: 40 ఏళ్ల క్రితం నిశాచర జీవుల సంరక్షణ కేంద్రం నిర్మాణమైంది. అప్పటి ప్రమాణాల ప్రకారం.. సూర్యకాంతి ప్రసరించకుండా భవనాన్ని నిర్మించారు. దానివల్ల గుడ్లగూబలు, ముళ్లపందులు, పిల్లుల జాతి జంతువులకు సంతతి లేకుండా పోయింది. అనంతరం కొత్త సాంకేతికతలు వచ్చాయి. దీంతో ఆధునిక భవనాన్ని నిర్మించాల్సి ఉంది. అప్పటివరకు ప్రస్తుత సంరక్షణ కేంద్రంలోనే సౌకర్యాలను మెరుగుపరచాలి.
మూగజీవుల మార్పిడి ద్వారా..
జూలో 18 పులులు, 19 సింహాలు ఉన్నాయి. మెజార్టీ ఒకే కుటుంబానికి చెందినవి. అందువల్ల పుట్టే పిల్లలు బలహీనంగా ఉండటం, జబ్బులు, జన్యుపరమైన సమస్యలు ఉత్పన్నం కావొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ పరిస్థితులను అధిగమించేందుకు గతంలో మాదిరి.. త్వరలో హరియాణాలోని రోటక్ జూ నుంచి రెండు జంటల పెద్దపులులను తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే గుజరాత్లోని జునాగఢ్ జూ నుంచి ఒక జంట సింహలను తెప్పించాలని నిర్ణయించారు. కోల్కతా నుంచి ఆడ జిరాఫీని, కాన్పూర్ నుంచి నీల్గాయ్, సాంబార్, వైట్బక్, బ్లాక్ బక్ తదితర మూగ జీవాలను కొన్నినెలల్లో నగర జూపార్కుకు తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. జీబ్రా, అడవి కుక్కలను తీసుకొచ్చేందుకు దేశీయ, అంతర్జాతీయ జూపార్కులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.
తోడు తీసుకొచ్చి..
ఆడ ఫిష్ క్యాట్, ఆడవి రాస్టస్ స్పాటెడ్ క్యాట్, స్క్వారెల్ మంకీ, సెక్రిట్ బాబూన్, సిల్వర్ కస్టేడ్ కాకటూల్స్, జిరాఫీ, కొండగొర్రెలు, పలు రకాల మకావ్ పక్షుల వంటి 23 జాతుల జీవులు జూ పార్కులో కొన్నేళ్లుగా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాయి. తోడు లేకపోవడంతో వాటి మానసిక పరిస్థితి సరిగా ఉండట్లేదు. తోడును తీసుకొచ్చి వాటిని జత కట్టించాలనే ఉద్దేశంతో మైసూర్లోని శ్రీచామ రాజేంద్ర జూపార్కు, చెన్నై, హరియాణా, గుజరాత్ తదితర జూలతో నెహ్రూ జూ పార్కు అధికారులు సంప్రదింపులు జరిపారు.
రక్త మార్పిడితో బలమైన సంతతి
డా.సునీల్ ఎస్.హిరేమత్, క్యూరేటర్
సందర్శకులకు జంతు విజ్ఞానం, వినోదాన్ని అందించడంతోపాటు వన్యప్రాణి సంరక్షణ మా ధ్యేయం. జూపార్కులోని మూగజీవుల సంతతి బలంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. రక్తమార్పిడి కార్యక్రమంతో పులులు, సింహాల సంతతి బలంగా ఉంటుంది. ఏళ్లుగా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తోన్న జంతు, పక్షి జాతులకు తోడు తీసుకురాబోతున్నాం. నిశాచర జీవుల జీవనాన్ని మెరుగుపరిచే చర్యలు ప్రారంభం కానున్నాయి. వాటికి బలమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నాం. ఏడాదికి తాగునీటి కోసం జలమండలికి రూ.కోటికిపైగా చెల్లిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.