పనులిలా.. ఏమనాలా?
వరద నుంచి కాలనీలను రక్షించేందుకు జీహెచ్ఎంసీలో, శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చేపట్టిన ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం) పనులు.. ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక ఊడిందనే సామెతను తలపిస్తున్నాయి
ఎస్ఎన్డీపీ బాక్స్ డ్రెయిన్లతో పలుచోట్ల ముంపు
అడ్డదిడ్డంగా నిర్మించడంతో సమస్యలు
భారీ వర్షాలొస్తే జనాలు కొట్టుకుపోతారనే ఆందోళన
హర్షవర్దన్కాలనీ పార్కు వరకు పనులను తాజాగా మొదలుపెట్టిన కార్మికులు
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, యంత్రాంగం: వరద నుంచి కాలనీలను రక్షించేందుకు జీహెచ్ఎంసీలో, శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చేపట్టిన ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం) పనులు.. ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక ఊడిందనే సామెతను తలపిస్తున్నాయి. మూడేళ్ల కిందట సరూర్నగర్ చెరువు పక్కన ఉండే వేలాది ఇళ్లు 2 నెలలపాటు ముంపులో ఉండగా ఎస్ఎన్డీపీ పనులు పూర్తయ్యాక కూడా అదే దుస్థితి. కాకపోతే ఇప్పుడు వేరే కాలనీలు మునుగుతున్నాయి. ఇక ఎగువ నుంచి వచ్చే వరదంతా ఒక్కసారిగా బాగ్లింగంపల్లి పద్మాకాలనీని ముంచెత్తుతోంది. నగరంలోని అనేక చోట్ల నాలా పనులు మధ్యలో నిలిచిపోవడంతో నాలాలు మట్టి, వ్యర్థాలతో నిండిపోయాయి. వరదంతా రోడ్లపై నిలుస్తోంది. కొన్నిచోట్ల మనుషులు, వాహనాలు కొట్టుకుపోయేలా నాలాలు నోళ్లు తెరచుకున్నాయి. వర్షాకాలం మొదలయ్యే నాటికి సమస్యలను పరిష్కరించకపోతే కాలనీలకు ముంపు ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
కాకతీయనగర్లో తవ్వి వదిలేశారిలా
నడవలేక జనానికి నరకం
మల్కాజిగిరిలో వినాయక్నగర్ డివిజన్ కాకతీయనగర్లో 6 నెలల క్రితం రూ.2 కోట్లతో 300మీటర్ల పొడవునా చేపట్టన పనులను గుత్తేదారు మధ్యలో ఆపేశారు. బిల్లులు రావట్లేదని, సమ్మె చేస్తున్నామని అంటున్నారు. ఇళ్ల మధ్య తవ్విన గుంతలు కాలనీవాసులకు నరకం చూపిస్తున్నాయి.
ప్రారంభించనివి కొన్ని.. అసంపూర్తిగా మరికొన్ని..
- ఖైరతాబాద్లోని బీజేఆర్నగర్ బస్తీలో బాక్స్డ్రెయిన్ను ఒక అడుగు ఎత్తుగా నిర్మించారు. ఇళ్లన్నీ దిగువన ఉండటంతో వరద నీరు బస్తీలో నిలిచిపోతోంది.
- నిజాంపేట నగర పాలక సంస్థలో పాపయ్యకుంట నుంచి సిరిబాలాజీ టవర్స్ వరకు 2.5కి.మీ పొడవునా నాలా పనులు ఇంకా మొదలు కాలేదు. బాచుపల్లి భైరుని చెరువు నుంచి అమీన్పూర్ చెరువు వరకు రూ.53 కోట్లతో 4 కిలోమీటర్ల కాలువ అసంపూర్తిగా ఉంది. తన స్థలం నుంచి కాలువ వెళ్లడాన్ని నిరసిస్తూ ఓ వ్యక్తి కోర్టుకెళ్లడంతో పనులాగాయి.
- కేపీహెచ్బీ బ్రాండ్ ఫ్యాక్టరీ-రాజీవ్ రోటరీ మార్గంలో వరద నీరు బాక్స్ డ్రెయిన్లోకి వెళ్లకుండా రోడ్డుపైనే నిలుస్తోంది. కొందరు దుకాణదారులు నాలా మూతలను మూసేయడంతోనే ఈ సమస్య. మలేసియన్ టౌన్షిప్ ఎదురుగా ఉన్న పాదచారుల వంతెన కింద వరద నీరు నడుము లోతున నిలుస్తోంది.
- చిన్న వానకే ఎగువ నుంచి వచ్చే వరదతో ఆసిఫ్నగర్(మల్లేపల్లి) ఫిరోజ్గాంధీనగర్ ముంపునకు గురవుతోంది. ఆసిఫ్నగర్ నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న గల్లీ నుంచి శీతల్ లస్సీ వరకు బాక్సు డ్రెయిన్ నిర్మాణానికి దాదాపు రూ.1.84 కోట్లు బల్దియా మంజూరు చేసింది. గతేడాది పనులు ప్రారంభించగా సగం కూడా కాలేదు.
మైత్రీవనం వెనుక
అమీర్పేటలో కదలని నిర్మాణం..
అమీర్పేట మైత్రీవనం వెనుక రూ.కోటిన్నరతో చేపట్టిన బాక్స్ డ్రైయిన్ పనులు ముందుకు సాగడం లేదు. వర్షం వచ్చిన ప్రతీసారి గాయత్రినగర్, ఇతరత్రా వీధులు, అపార్ట్మెంట్స్ సెల్లార్లలో నీరు నిండుతోంది. మరోచోట రూ.35 లక్షల పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. త్వరలో పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ డీఈ యతీంద్ర మోహన్ తెలిపారు.
ఆర్యూబీ వద్ద టన్నుల్లో వ్యర్థాలు
లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర బాక్స్ నాలాలో వ్యర్థాలు పేరుకుపోవడంతో వరద వెళ్లే ఆస్కారం లేక ఆర్యూబీ ప్రాంతం మునుగుతోంది. దీంతో బాక్స్ నాలా స్లాబ్ను ధ్వంసం చేసి జేసీబీతో ఇసుక, మట్టి తొలగించారు. చిన్నపాటి బాక్స్ నాలాల నిర్మాణాలతో వరదనీరు వంకలు తిరిగి పోవాల్సిన పరిస్థితిని అధికారులు కల్పించారు.
మునుగుతున్న కాలనీలు..
ముషీరాబాద్ పరిధి నాగమయ్య కుంట నుంచి పద్మాకాలనీ మీదుగా చేపట్టిన వరదనీటి నాలా విస్తరణ, అభివృద్ధి పనులు మూడేళ్లయినా పూర్తవ్వలేదు. వర్షం వచ్చిన ప్రతీసారీ పద్మాకాలనీని మురుగు ముంచెత్తుతోంది. గురుదత్త పాఠశాల వద్ద రూ.39 కోట్లతో, నల్లకుంట చౌరస్తాలోని వామాక్షి స్కూల్ వద్ద బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. నల్లకుంట మూన్కేఫ్ చౌరస్తా వద్ద భూగర్భ విద్యుత్తు తీగలు కొనసాగింపు కారణంగా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.
కంటోన్మెంట్కు కష్టకాలమే..
ఓల్డ్బోయిన్పల్లి డివిజన్లో రూ.2.5 కోట్లతో బాక్స్ డ్రెయిన్ పనులను చేపట్టారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని హర్షవర్దన్కాలనీ, మర్రి రాంరెడ్డినగర్కాలనీ, సీతారాంపురం, బాపూజీనగర్ చౌరస్తాల మీదుగా ఫిలిప్స్ గోడౌన్ బ్రిడ్జి వరకు పనులను చేపట్టాల్సి ఉండగా హర్షవర్దన్కాలనీ వరకు నాలాను నిర్మించి పనులను ఎన్నికల ముందు నిలిపివేశారు. ఓల్డ్బోయిన్పల్లి మల్లికార్జునకాలనీ రోడ్డు నంబర్-3లో వరద నీటి కాలువను మధ్యలో వదిలేయడంతో వ్యర్థాలన్నీ కాలువలోకి చేరి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రోన్తో ట్రాఫిక్ పర్యవేక్షించి.. నియంత్రించి
[ 15-06-2024]
ఫైనాన్షియల్ జిల్లా, ఐటీ క్షేత్రాలతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడంలోనూ ముందుంటోంది. -
తక్కువ సమయం.. ఎక్కువ మందికి ప్రయోజనం
[ 15-06-2024]
క్యాన్సర్ చికిత్సలో కీలకమైన రేడియోషన్ థెరఫీలో అత్యాధునిక సేవలు ఎంఎన్జేలో అందుబాటులోకి రానున్నాయి. -
హాజరుకు నకిలీ మకిలి
[ 15-06-2024]
పారిశుద్ధ్య కార్మికులను వేధిస్తూ.. వారి జీతాన్ని జేబులో వేసుకుంటోన్న కేటుగాళ్లకు జీహెచ్ఎంసీ అడ్డాగా మారింది. -
కసి పెంచుకొని.. ఉసురు తీసి
[ 15-06-2024]
ప్రతీకారంతో ఒకరు.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఇంకొకరు.. ఇంట్లో గొడవల కారణంగా మరొకరు.. డబ్బుల విషయమై ఓ మహిళ, మరో వ్యక్తి హత్యకు గురయ్యారు. -
మరో 100 రోడ్లకు వాణిజ్య హోదా
[ 15-06-2024]
ఆదాయం పెంపు దిశగా జీహెచ్ఎంసీ మరో ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో మరో వంద రోడ్లకు వాణిజ్య హోదా ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. -
ఉస్మానియా ప్రాంగణంలో జైలు వార్డు ఏర్పాటుకు సన్నాహాలు
[ 15-06-2024]
ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో ‘జైలు వార్డు’ ఏర్పాటుకు పోలీసు, జైళ్లశాఖ అధికారులు, వైద్యాధికారులతో సన్నాహాలు చేస్తున్నారు. -
నేటి నుంచి డయల్ యువర్ ఎండీ
[ 15-06-2024]
జలమండలి పరిధిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై గతంలో నిర్వహించిన డయల్ యువర్ ఎండీ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తున్నట్లు జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి తెలిపారు. -
అదిరే.. కళ్లు చెదిరే
[ 15-06-2024]
యువ ఫ్యాషన్ డిజైనర్లు సరికొత్త డిజైన్లతో తమ సృజన చాటారు. -
గోదావరి నుంచి అత్యవసర పంపింగ్
[ 15-06-2024]
నగర అవసరాలకు గోదావరి జలాల తరలింపునకు సంబంధించి అత్యవసర పంపింగ్కు జలమండలి సిద్ధమవుతోంది. -
తాజా..తాజాగా..
[ 15-06-2024]
రైతులు పండించిన కూరగాయలు, పండ్లు మరింత తాజాగా వినియోగదారులకు అందనున్నాయి. -
అవకాశాల పెన్నిధి.. ఆకర్షణీయ ఉపాధి
[ 15-06-2024]
మార్కెట్లో లభించే ప్రతి వస్తువు వినియోగించే వరకు భద్రంగా ఉండాలంటే దానికి ప్రత్యేకమైన ప్యాకింగ్ అవసరం. -
తెలుగు వైతాళికుడు రామోజీరావు
[ 15-06-2024]
రామోజీరావు అక్షరశిల్పి అని సీనియర్ పాత్రికేయుడు, హాస్యావధాని శంకరనారాయణ నివాళులర్పించారు. ఆయన తెలుగు వైతాళికుడని కొనియాడారు. -
27 నుంచి రామకృష్ణ మఠంలో ‘శౌర్య క్యాంప్’
[ 15-06-2024]
యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా దోమలగూడలోని రామకృష్ణ మఠంలో.. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు ‘శౌర్య’ పేరిట శిబిరం నిర్వహిస్తున్నట్లు మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద స్వామి తెలిపారు. -
హైదరాబాద్ విద్యార్ధికే ఐసెట్ ఫస్ట్ ర్యాంక్
[ 15-06-2024]
తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీఐసెట్)లో మొదటి ర్యాంక్ హైదరాబాద్ విద్యార్ధినే వరించింది. -
అధ్వాన దారులు.. అవస్థల ప్రయాణాలు
[ 15-06-2024]
జిల్లాలో రహదారులు, భవనాలశాఖ ప్రధాన రోడ్లతో పాటు పల్లెలకు అనుసంధానంగా ఉన్న పంచాయతీరాజ్ రోడ్లు అధ్వానంగా మారాయి. -
అటవీ భూమిని వీడని కబ్జా పర్వం!
[ 15-06-2024]
రెండు దశాబ్దాలుగా తెలంగాణ అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
కానరాని.. ఖనిజ సంక్షేమ నిధి
[ 15-06-2024]
జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. వీటి తవ్వకాలతో సర్కారుకు ఏటా రూ.కోట్లల్లో ఆదాయం సమకూరుతోంది. -
కాలువలు పూడ్చిన వారిపై క్రిమినల్ కేసులు
[ 15-06-2024]
చంద్రవంచ శివారులో దశాబ్దాలుగా కాగ్నా నదికి అనుసంధానంగా ఉన్న పరీవాహక కాలువలను పూడ్చివేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు సిఫారసు చేస్తామని తాండూరు తహసీల్దారు కేతావత్ తారాసింగ్ వెల్లడించారు. -
కలకలం రేపుతున్న చిరుత సంచారం
[ 15-06-2024]
వికారాబాద్ పరిసర ప్రాంతంలోని అనంతగిరి అడవిలో చిరుత పులి సంచారం మరోమారు కలకలం రేపుతోంది. -
డా.శుభాకర్కు ఎఫ్ఆర్సీపీ పురస్కారం
[ 15-06-2024]
వైద్య రంగంలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి మాజీ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డా. కె.శుభాకర్ శుక్రవారం ఈడెన్బర్గ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ నుంచి అరుదైన ఎఫ్ఆర్సీపీ పురస్కారాన్ని అందుకున్నారు. -
అద్దె పేరుతో వచ్చి.. దోపిడీకి యత్నించి
[ 15-06-2024]
ఉపాధి కోసం నగరానికొచ్చారు. ఏ పని చేసినా ఎక్కువ డబ్బు రావట్లేదు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన తట్టింది. -
పోలీసు వేషం.. ఘరానా మోసం
[ 15-06-2024]
పోలీసు అధికారినంటూ బెదిరిస్తూ మోసాలకు పాల్పడుతున్న మాయగాడు జాదవ్ సన్నీ(35)ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు టాస్క్ఫోర్స్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ శుక్రవారం మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
క్యాబినెట్లో యువతకు ప్రాధాన్యాన్ని స్వాగతిస్తున్నాం: యనమల రామకృష్ణుడు
-
డ్రోన్తో ట్రాఫిక్ పర్యవేక్షించి.. నియంత్రించి
-
మూగ యువతిపై సామూహిక అత్యాచారం
-
మహిళలు నిల్చోలేక.. పురుషులు కూర్చోలేక..
-
తక్కువ సమయం.. ఎక్కువ మందికి ప్రయోజనం
-
నాడు డీజీపీ కార్యాలయం గేటు బయటే అడ్డగించారు.. నేడు ప్రొటోకాల్తో లోపలికి..