పనులిలా.. ఏమనాలా?
వరద నుంచి కాలనీలను రక్షించేందుకు జీహెచ్ఎంసీలో, శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చేపట్టిన ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం) పనులు.. ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక ఊడిందనే సామెతను తలపిస్తున్నాయి
ఎస్ఎన్డీపీ బాక్స్ డ్రెయిన్లతో పలుచోట్ల ముంపు
అడ్డదిడ్డంగా నిర్మించడంతో సమస్యలు
భారీ వర్షాలొస్తే జనాలు కొట్టుకుపోతారనే ఆందోళన
హర్షవర్దన్కాలనీ పార్కు వరకు పనులను తాజాగా మొదలుపెట్టిన కార్మికులు
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, యంత్రాంగం: వరద నుంచి కాలనీలను రక్షించేందుకు జీహెచ్ఎంసీలో, శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చేపట్టిన ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం) పనులు.. ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక ఊడిందనే సామెతను తలపిస్తున్నాయి. మూడేళ్ల కిందట సరూర్నగర్ చెరువు పక్కన ఉండే వేలాది ఇళ్లు 2 నెలలపాటు ముంపులో ఉండగా ఎస్ఎన్డీపీ పనులు పూర్తయ్యాక కూడా అదే దుస్థితి. కాకపోతే ఇప్పుడు వేరే కాలనీలు మునుగుతున్నాయి. ఇక ఎగువ నుంచి వచ్చే వరదంతా ఒక్కసారిగా బాగ్లింగంపల్లి పద్మాకాలనీని ముంచెత్తుతోంది. నగరంలోని అనేక చోట్ల నాలా పనులు మధ్యలో నిలిచిపోవడంతో నాలాలు మట్టి, వ్యర్థాలతో నిండిపోయాయి. వరదంతా రోడ్లపై నిలుస్తోంది. కొన్నిచోట్ల మనుషులు, వాహనాలు కొట్టుకుపోయేలా నాలాలు నోళ్లు తెరచుకున్నాయి. వర్షాకాలం మొదలయ్యే నాటికి సమస్యలను పరిష్కరించకపోతే కాలనీలకు ముంపు ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
కాకతీయనగర్లో తవ్వి వదిలేశారిలా
నడవలేక జనానికి నరకం
మల్కాజిగిరిలో వినాయక్నగర్ డివిజన్ కాకతీయనగర్లో 6 నెలల క్రితం రూ.2 కోట్లతో 300మీటర్ల పొడవునా చేపట్టన పనులను గుత్తేదారు మధ్యలో ఆపేశారు. బిల్లులు రావట్లేదని, సమ్మె చేస్తున్నామని అంటున్నారు. ఇళ్ల మధ్య తవ్విన గుంతలు కాలనీవాసులకు నరకం చూపిస్తున్నాయి.
ప్రారంభించనివి కొన్ని.. అసంపూర్తిగా మరికొన్ని..
- ఖైరతాబాద్లోని బీజేఆర్నగర్ బస్తీలో బాక్స్డ్రెయిన్ను ఒక అడుగు ఎత్తుగా నిర్మించారు. ఇళ్లన్నీ దిగువన ఉండటంతో వరద నీరు బస్తీలో నిలిచిపోతోంది.
- నిజాంపేట నగర పాలక సంస్థలో పాపయ్యకుంట నుంచి సిరిబాలాజీ టవర్స్ వరకు 2.5కి.మీ పొడవునా నాలా పనులు ఇంకా మొదలు కాలేదు. బాచుపల్లి భైరుని చెరువు నుంచి అమీన్పూర్ చెరువు వరకు రూ.53 కోట్లతో 4 కిలోమీటర్ల కాలువ అసంపూర్తిగా ఉంది. తన స్థలం నుంచి కాలువ వెళ్లడాన్ని నిరసిస్తూ ఓ వ్యక్తి కోర్టుకెళ్లడంతో పనులాగాయి.
- కేపీహెచ్బీ బ్రాండ్ ఫ్యాక్టరీ-రాజీవ్ రోటరీ మార్గంలో వరద నీరు బాక్స్ డ్రెయిన్లోకి వెళ్లకుండా రోడ్డుపైనే నిలుస్తోంది. కొందరు దుకాణదారులు నాలా మూతలను మూసేయడంతోనే ఈ సమస్య. మలేసియన్ టౌన్షిప్ ఎదురుగా ఉన్న పాదచారుల వంతెన కింద వరద నీరు నడుము లోతున నిలుస్తోంది.
- చిన్న వానకే ఎగువ నుంచి వచ్చే వరదతో ఆసిఫ్నగర్(మల్లేపల్లి) ఫిరోజ్గాంధీనగర్ ముంపునకు గురవుతోంది. ఆసిఫ్నగర్ నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న గల్లీ నుంచి శీతల్ లస్సీ వరకు బాక్సు డ్రెయిన్ నిర్మాణానికి దాదాపు రూ.1.84 కోట్లు బల్దియా మంజూరు చేసింది. గతేడాది పనులు ప్రారంభించగా సగం కూడా కాలేదు.
మైత్రీవనం వెనుక
అమీర్పేటలో కదలని నిర్మాణం..
అమీర్పేట మైత్రీవనం వెనుక రూ.కోటిన్నరతో చేపట్టిన బాక్స్ డ్రైయిన్ పనులు ముందుకు సాగడం లేదు. వర్షం వచ్చిన ప్రతీసారి గాయత్రినగర్, ఇతరత్రా వీధులు, అపార్ట్మెంట్స్ సెల్లార్లలో నీరు నిండుతోంది. మరోచోట రూ.35 లక్షల పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. త్వరలో పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ డీఈ యతీంద్ర మోహన్ తెలిపారు.
ఆర్యూబీ వద్ద టన్నుల్లో వ్యర్థాలు
లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర బాక్స్ నాలాలో వ్యర్థాలు పేరుకుపోవడంతో వరద వెళ్లే ఆస్కారం లేక ఆర్యూబీ ప్రాంతం మునుగుతోంది. దీంతో బాక్స్ నాలా స్లాబ్ను ధ్వంసం చేసి జేసీబీతో ఇసుక, మట్టి తొలగించారు. చిన్నపాటి బాక్స్ నాలాల నిర్మాణాలతో వరదనీరు వంకలు తిరిగి పోవాల్సిన పరిస్థితిని అధికారులు కల్పించారు.
మునుగుతున్న కాలనీలు..
ముషీరాబాద్ పరిధి నాగమయ్య కుంట నుంచి పద్మాకాలనీ మీదుగా చేపట్టిన వరదనీటి నాలా విస్తరణ, అభివృద్ధి పనులు మూడేళ్లయినా పూర్తవ్వలేదు. వర్షం వచ్చిన ప్రతీసారీ పద్మాకాలనీని మురుగు ముంచెత్తుతోంది. గురుదత్త పాఠశాల వద్ద రూ.39 కోట్లతో, నల్లకుంట చౌరస్తాలోని వామాక్షి స్కూల్ వద్ద బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. నల్లకుంట మూన్కేఫ్ చౌరస్తా వద్ద భూగర్భ విద్యుత్తు తీగలు కొనసాగింపు కారణంగా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.
కంటోన్మెంట్కు కష్టకాలమే..
ఓల్డ్బోయిన్పల్లి డివిజన్లో రూ.2.5 కోట్లతో బాక్స్ డ్రెయిన్ పనులను చేపట్టారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని హర్షవర్దన్కాలనీ, మర్రి రాంరెడ్డినగర్కాలనీ, సీతారాంపురం, బాపూజీనగర్ చౌరస్తాల మీదుగా ఫిలిప్స్ గోడౌన్ బ్రిడ్జి వరకు పనులను చేపట్టాల్సి ఉండగా హర్షవర్దన్కాలనీ వరకు నాలాను నిర్మించి పనులను ఎన్నికల ముందు నిలిపివేశారు. ఓల్డ్బోయిన్పల్లి మల్లికార్జునకాలనీ రోడ్డు నంబర్-3లో వరద నీటి కాలువను మధ్యలో వదిలేయడంతో వ్యర్థాలన్నీ కాలువలోకి చేరి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి