మురుగు.. పరుగు!
గ్రేటర్లో మురుగు పరుగు పెడుతోంది. గత నెల 19 నుంచి ఈ నెల 20 తేదీ వరకు మ్యాన్హోళ్ల ఓవర్ఫ్లోపై దాదాపు 43,280 ఫిర్యాదులు వచ్చాయి.
ఒక్క నెలలోనే 43 వేల ఫిర్యాదులు
వానాకాలంలో మరిన్ని ఇబ్బందులు
ఈనాడు, హైదరాబాద్: గ్రేటర్లో మురుగు పరుగు పెడుతోంది. గత నెల 19 నుంచి ఈ నెల 20 తేదీ వరకు మ్యాన్హోళ్ల ఓవర్ఫ్లోపై దాదాపు 43,280 ఫిర్యాదులు వచ్చాయి. మ్యాన్హోళ్ల మిస్సింగ్లపై మరో 882 ఫిర్యాదులు అందాయి. మురుగు ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నట్లు జలమండలి చెబుతోంది. 60 శాతం వరకు అప్పటికప్పుడు పరిష్కారిస్తున్నామని పేర్కొంటోంది. అయితే చిన్న వర్షానికే అనేక ప్రాంతాల్లో మురుగు సమస్య వేధిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వరద పెరిగితే మ్యాన్హోళ్ల మూతలు సైతం కొట్టుకుపోతున్నాయి. గతంలో ప్రధాన నగరంలో మాత్రమే జలమండలి మురుగు నిర్వహణ చూసేది. తర్వాత గ్రేటర్లోని శివారు సర్కిళ్ల మురుగు నిర్వహణ కూడా జలమండలి కిందకు తేవడంతో పరిధి భారీగా విస్తరించింది. ఫలితంగా మ్యాన్హోళ్ల నిర్వహణ, మురుగుకు అడ్డుకట్ట వేయడం సవాలుగా మారుతోంది.
అక్రమంగా కనెక్షన్లు..
నగరంలో చాలా ప్రాంతాల్లో అక్రమ మురుగు కనెక్షన్లు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న హోటళ్లు, దుకాణాలు ఇతర సముదాయాలకు సంబంధించి మురుగు కనెక్షన్లును నేరుగా ప్రధాన పైపులకు కలుపుతున్నారు. మరోవైపు చాలా ప్రాంతాల్లో గతంలో పోల్చితే నివాస సముదాయాలు పెరిగాయి. వ్యక్తిగత గృహాల స్థానంలో అపార్ట్టుమెంట్లు వెలుస్తున్నాయి. ఆ ప్రాంతంలో మురుగు వ్యవస్థ సామర్థ్యం తక్కువగా ఉంటోంది. దీంతో పైపుల సామర్థ్యం సరిపోవడం లేదు. వరద నీటి వైపులను కొన్నిచోట్ల మురుగు నీటి పైపులతో కలిపేయడం వల్ల భారీ వర్షాలు కురిసిన సమయంలో ఆ వరద తాకిడికి మ్యాన్హోళ్లు లేచిపోతున్నాయి. దీంతో మురుగు మొత్తం రోడ్లపై పారుతోంది. దీనికితోడు మురుగు పైపుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త వేస్తున్నారు. సంపుల వద్ద జల్లెడలు లాంటివి అమర్చడం లేదు. ఈ వ్యర్థాలన్నీ పైపుల్లోకి చేరి మురుగుపారుదలకు ఆటంకం ఏర్పడుతోంది. గ్రేటర్ వ్యాప్తంగా అక్రమ నీటి కనెక్షన్లకు సరిసమాన స్థాయిలో అక్రమ మురుగు కనెక్షన్లు ఉన్నాయి.రాత్రి వేళల్లో రోడ్లను తవ్వి అక్రమంగా నల్లాలతో పాటు మురుగు కనెక్షన్లును ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనిపై విజిలెన్సు అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
కార్యాచరణ షురూ...
వచ్చే వానాకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీతో కలిసి కార్యాచరణ రూపొందించినట్లు జలమండలి తెలిపింది. మ్యాన్హోళ్లు, మురుగు నిర్వహణతో పాటు బోర్డు ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు ప్రకటించింది. మురుగు, మ్యాన్హోళ్ల సమస్యపై వస్తున్న సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నట్లు పేర్కొంది. వినియోగదారులు, రోడ్డు పక్కన చిరు వ్యాపారులు చెత్తను మ్యాన్హోళ్లలోకి డంప్ చేయడంతో చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉత్పన్నమవుతోందని తెలిపింది. దీనిపై ఎప్పటికప్పుడు వ్యాపారులతో పాటు హోటళ్లు ఇతరులకు అవగాహన కల్పిస్తున్నామని వివరించింది. ఈ మేరకు ఆయా కాలనీల సంక్షేమ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు