మురుగు.. పరుగు!
గ్రేటర్లో మురుగు పరుగు పెడుతోంది. గత నెల 19 నుంచి ఈ నెల 20 తేదీ వరకు మ్యాన్హోళ్ల ఓవర్ఫ్లోపై దాదాపు 43,280 ఫిర్యాదులు వచ్చాయి.
ఒక్క నెలలోనే 43 వేల ఫిర్యాదులు
వానాకాలంలో మరిన్ని ఇబ్బందులు
ఈనాడు, హైదరాబాద్: గ్రేటర్లో మురుగు పరుగు పెడుతోంది. గత నెల 19 నుంచి ఈ నెల 20 తేదీ వరకు మ్యాన్హోళ్ల ఓవర్ఫ్లోపై దాదాపు 43,280 ఫిర్యాదులు వచ్చాయి. మ్యాన్హోళ్ల మిస్సింగ్లపై మరో 882 ఫిర్యాదులు అందాయి. మురుగు ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నట్లు జలమండలి చెబుతోంది. 60 శాతం వరకు అప్పటికప్పుడు పరిష్కారిస్తున్నామని పేర్కొంటోంది. అయితే చిన్న వర్షానికే అనేక ప్రాంతాల్లో మురుగు సమస్య వేధిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వరద పెరిగితే మ్యాన్హోళ్ల మూతలు సైతం కొట్టుకుపోతున్నాయి. గతంలో ప్రధాన నగరంలో మాత్రమే జలమండలి మురుగు నిర్వహణ చూసేది. తర్వాత గ్రేటర్లోని శివారు సర్కిళ్ల మురుగు నిర్వహణ కూడా జలమండలి కిందకు తేవడంతో పరిధి భారీగా విస్తరించింది. ఫలితంగా మ్యాన్హోళ్ల నిర్వహణ, మురుగుకు అడ్డుకట్ట వేయడం సవాలుగా మారుతోంది.
అక్రమంగా కనెక్షన్లు..
నగరంలో చాలా ప్రాంతాల్లో అక్రమ మురుగు కనెక్షన్లు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న హోటళ్లు, దుకాణాలు ఇతర సముదాయాలకు సంబంధించి మురుగు కనెక్షన్లును నేరుగా ప్రధాన పైపులకు కలుపుతున్నారు. మరోవైపు చాలా ప్రాంతాల్లో గతంలో పోల్చితే నివాస సముదాయాలు పెరిగాయి. వ్యక్తిగత గృహాల స్థానంలో అపార్ట్టుమెంట్లు వెలుస్తున్నాయి. ఆ ప్రాంతంలో మురుగు వ్యవస్థ సామర్థ్యం తక్కువగా ఉంటోంది. దీంతో పైపుల సామర్థ్యం సరిపోవడం లేదు. వరద నీటి వైపులను కొన్నిచోట్ల మురుగు నీటి పైపులతో కలిపేయడం వల్ల భారీ వర్షాలు కురిసిన సమయంలో ఆ వరద తాకిడికి మ్యాన్హోళ్లు లేచిపోతున్నాయి. దీంతో మురుగు మొత్తం రోడ్లపై పారుతోంది. దీనికితోడు మురుగు పైపుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త వేస్తున్నారు. సంపుల వద్ద జల్లెడలు లాంటివి అమర్చడం లేదు. ఈ వ్యర్థాలన్నీ పైపుల్లోకి చేరి మురుగుపారుదలకు ఆటంకం ఏర్పడుతోంది. గ్రేటర్ వ్యాప్తంగా అక్రమ నీటి కనెక్షన్లకు సరిసమాన స్థాయిలో అక్రమ మురుగు కనెక్షన్లు ఉన్నాయి.రాత్రి వేళల్లో రోడ్లను తవ్వి అక్రమంగా నల్లాలతో పాటు మురుగు కనెక్షన్లును ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనిపై విజిలెన్సు అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
కార్యాచరణ షురూ...
వచ్చే వానాకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీతో కలిసి కార్యాచరణ రూపొందించినట్లు జలమండలి తెలిపింది. మ్యాన్హోళ్లు, మురుగు నిర్వహణతో పాటు బోర్డు ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు ప్రకటించింది. మురుగు, మ్యాన్హోళ్ల సమస్యపై వస్తున్న సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నట్లు పేర్కొంది. వినియోగదారులు, రోడ్డు పక్కన చిరు వ్యాపారులు చెత్తను మ్యాన్హోళ్లలోకి డంప్ చేయడంతో చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉత్పన్నమవుతోందని తెలిపింది. దీనిపై ఎప్పటికప్పుడు వ్యాపారులతో పాటు హోటళ్లు ఇతరులకు అవగాహన కల్పిస్తున్నామని వివరించింది. ఈ మేరకు ఆయా కాలనీల సంక్షేమ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూబ్లీహిల్స్లో నడిరోడ్డుపై బీఎండబ్ల్యూ కారు దగ్ధం.. డ్రైవర్ క్షేమం
[ 15-06-2024]
జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్లో నడుస్తున్న బీఎండబ్ల్యూ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. -
కేసీఆర్.. చట్టబద్ధ కమిషన్నే తప్పుపడతారా?: కేంద్ర మంత్రి బండి సంజయ్
[ 15-06-2024]
విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై విచారణకు చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్నే కేసీఆర్ తప్పుపడతారా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. -
తెలంగాణ వైద్యారోగ్యశాఖలో వివిధ పోస్టుల భర్తీకి నిర్ణయం
[ 15-06-2024]
వైద్య ఆరోగ్యశాఖలో వివిధ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
డ్రోన్తో ట్రాఫిక్ పర్యవేక్షించి.. నియంత్రించి
[ 15-06-2024]
ఫైనాన్షియల్ జిల్లా, ఐటీ క్షేత్రాలతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడంలోనూ ముందుంటోంది. -
తక్కువ సమయం.. ఎక్కువ మందికి ప్రయోజనం
[ 15-06-2024]
క్యాన్సర్ చికిత్సలో కీలకమైన రేడియోషన్ థెరఫీలో అత్యాధునిక సేవలు ఎంఎన్జేలో అందుబాటులోకి రానున్నాయి. -
హాజరుకు నకిలీ మకిలి
[ 15-06-2024]
పారిశుద్ధ్య కార్మికులను వేధిస్తూ.. వారి జీతాన్ని జేబులో వేసుకుంటోన్న కేటుగాళ్లకు జీహెచ్ఎంసీ అడ్డాగా మారింది. -
కసి పెంచుకొని.. ఉసురు తీసి
[ 15-06-2024]
ప్రతీకారంతో ఒకరు.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఇంకొకరు.. ఇంట్లో గొడవల కారణంగా మరొకరు.. డబ్బుల విషయమై ఓ మహిళ, మరో వ్యక్తి హత్యకు గురయ్యారు. -
మరో 100 రోడ్లకు వాణిజ్య హోదా
[ 15-06-2024]
ఆదాయం పెంపు దిశగా జీహెచ్ఎంసీ మరో ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో మరో వంద రోడ్లకు వాణిజ్య హోదా ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. -
ఉస్మానియా ప్రాంగణంలో జైలు వార్డు ఏర్పాటుకు సన్నాహాలు
[ 15-06-2024]
ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో ‘జైలు వార్డు’ ఏర్పాటుకు పోలీసు, జైళ్లశాఖ అధికారులు, వైద్యాధికారులతో సన్నాహాలు చేస్తున్నారు. -
నేటి నుంచి డయల్ యువర్ ఎండీ
[ 15-06-2024]
జలమండలి పరిధిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై గతంలో నిర్వహించిన డయల్ యువర్ ఎండీ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తున్నట్లు జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి తెలిపారు. -
అదిరే.. కళ్లు చెదిరే
[ 15-06-2024]
యువ ఫ్యాషన్ డిజైనర్లు సరికొత్త డిజైన్లతో తమ సృజన చాటారు. -
గోదావరి నుంచి అత్యవసర పంపింగ్
[ 15-06-2024]
నగర అవసరాలకు గోదావరి జలాల తరలింపునకు సంబంధించి అత్యవసర పంపింగ్కు జలమండలి సిద్ధమవుతోంది. -
తాజా..తాజాగా..
[ 15-06-2024]
రైతులు పండించిన కూరగాయలు, పండ్లు మరింత తాజాగా వినియోగదారులకు అందనున్నాయి. -
అవకాశాల పెన్నిధి.. ఆకర్షణీయ ఉపాధి
[ 15-06-2024]
మార్కెట్లో లభించే ప్రతి వస్తువు వినియోగించే వరకు భద్రంగా ఉండాలంటే దానికి ప్రత్యేకమైన ప్యాకింగ్ అవసరం. -
తెలుగు వైతాళికుడు రామోజీరావు
[ 15-06-2024]
రామోజీరావు అక్షరశిల్పి అని సీనియర్ పాత్రికేయుడు, హాస్యావధాని శంకరనారాయణ నివాళులర్పించారు. ఆయన తెలుగు వైతాళికుడని కొనియాడారు. -
27 నుంచి రామకృష్ణ మఠంలో ‘శౌర్య క్యాంప్’
[ 15-06-2024]
యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా దోమలగూడలోని రామకృష్ణ మఠంలో.. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు ‘శౌర్య’ పేరిట శిబిరం నిర్వహిస్తున్నట్లు మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద స్వామి తెలిపారు. -
హైదరాబాద్ విద్యార్ధికే ఐసెట్ ఫస్ట్ ర్యాంక్
[ 15-06-2024]
తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీఐసెట్)లో మొదటి ర్యాంక్ హైదరాబాద్ విద్యార్ధినే వరించింది. -
అధ్వాన దారులు.. అవస్థల ప్రయాణాలు
[ 15-06-2024]
జిల్లాలో రహదారులు, భవనాలశాఖ ప్రధాన రోడ్లతో పాటు పల్లెలకు అనుసంధానంగా ఉన్న పంచాయతీరాజ్ రోడ్లు అధ్వానంగా మారాయి. -
అటవీ భూమిని వీడని కబ్జా పర్వం!
[ 15-06-2024]
రెండు దశాబ్దాలుగా తెలంగాణ అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
కానరాని.. ఖనిజ సంక్షేమ నిధి
[ 15-06-2024]
జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. వీటి తవ్వకాలతో సర్కారుకు ఏటా రూ.కోట్లల్లో ఆదాయం సమకూరుతోంది. -
కాలువలు పూడ్చిన వారిపై క్రిమినల్ కేసులు
[ 15-06-2024]
చంద్రవంచ శివారులో దశాబ్దాలుగా కాగ్నా నదికి అనుసంధానంగా ఉన్న పరీవాహక కాలువలను పూడ్చివేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు సిఫారసు చేస్తామని తాండూరు తహసీల్దారు కేతావత్ తారాసింగ్ వెల్లడించారు. -
కలకలం రేపుతున్న చిరుత సంచారం
[ 15-06-2024]
వికారాబాద్ పరిసర ప్రాంతంలోని అనంతగిరి అడవిలో చిరుత పులి సంచారం మరోమారు కలకలం రేపుతోంది. -
డా.శుభాకర్కు ఎఫ్ఆర్సీపీ పురస్కారం
[ 15-06-2024]
వైద్య రంగంలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి మాజీ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డా. కె.శుభాకర్ శుక్రవారం ఈడెన్బర్గ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ నుంచి అరుదైన ఎఫ్ఆర్సీపీ పురస్కారాన్ని అందుకున్నారు. -
అద్దె పేరుతో వచ్చి.. దోపిడీకి యత్నించి
[ 15-06-2024]
ఉపాధి కోసం నగరానికొచ్చారు. ఏ పని చేసినా ఎక్కువ డబ్బు రావట్లేదు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన తట్టింది. -
పోలీసు వేషం.. ఘరానా మోసం
[ 15-06-2024]
పోలీసు అధికారినంటూ బెదిరిస్తూ మోసాలకు పాల్పడుతున్న మాయగాడు జాదవ్ సన్నీ(35)ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు టాస్క్ఫోర్స్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ శుక్రవారం మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!
-
జూబ్లీహిల్స్లో నడిరోడ్డుపై బీఎండబ్ల్యూ కారు దగ్ధం.. డ్రైవర్ క్షేమం
-
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!
-
వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: సీఎం రేవంత్రెడ్డి
-
వందేభారత్ స్లీపర్.. త్వరలో ట్రయల్ రన్
-
అనుకుందే జరిగింది.. భారత్, కెనడా మ్యాచ్ రద్దు